Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan: విశాఖ నుంచి ఇక జగన్ పని.. అమరావతి పరిస్థితేంటి?

YS Jagan: విశాఖ నుంచి ఇక జగన్ పని.. అమరావతి పరిస్థితేంటి?

YS Jagan
YS Jagan

YS Jagan: ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. కొద్దిరోజుల్లో ప్రారంభంకానున్న బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఇందుకు వేదిక కానున్నాయి.ఈ నెల 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 17న అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే సర్క్యులర్ జారీచేసింది. ఈ నెల 27 వరకూ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే విశాఖ రాజధాని విషయంలో జగన్ సమావేశాల్లో కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం రాజధానులపై సుప్రీం కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. ఈ నెల 28కి కేసు విచారణ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ చేసే ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులపై మొగ్గుచూపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహణలో భాగంగా మూడు రాజధానులనేది ఉత్తమాటేనని.. విశాఖే తమ ఏకైక రాజధాని అని.. పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరడంతో పెద్ద దుమారమే రేగింది. అటు సీఎం జగన్ సైతం తాను విశాఖకు షిఫ్ట్ అవుతున్నట్టు స్పష్టం చేశారు. కానీ ఎప్పుడు అన్నది మాత్రం వెల్లడించలేదు. అటు సుప్రీంకోర్టులో కేసు విచారణలో జాప్యం జరుగుతుండడం, ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎలాగైన విశాఖ నుంచే పాలనను ప్రారంభించాలని జగన్ డిసైడ్ అయ్యారు.

ఈ నెల 28, 29 తేదీల్లో విశాఖలో జీ 20 సన్నాహక సదస్సు జరగనుంది. ఆ తరువాత విశాఖలోనే ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయం ప్రారంభించి..అక్కడ నుంచే పాలన కొనసాగించేలా నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 14 డా బీఆర్ అంబేద్కర్ జన్మదినం నాడు విజయవాడలో 125 అడుగులు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అదే రోజు విశాఖ నుంచి సీఎం జగన్ క్యాంపు కార్యాలయం ప్రారంభించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం.సుప్రీంకోర్టులో కేసు విషయంలోనూ ఈ నెల 28న విచారణ వేళ కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఒక వేళ విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభమైతే అమరావతిలో శని, ఆదివారాల్లో జగన్ ఉండనున్నారు. నాలుగు రోజులు విశాఖలో గడపనున్నారు. ఒక రోజు పల్లె నిద్ర చేయనున్నారు. తాము ఆశిస్తున్నట్టు సుప్రీం కోర్టులో అనుకూలమైన తీర్పు వస్తే మాత్రం జూన్ నుంచి పూర్తిస్థాయిలో విశాఖ నుంచి పాలన ప్రారంభించే చాన్స్ ఉంది. విద్యాసంవత్సరం ప్రారంభం, ఉద్యోగుల తరలింపు, విశాఖలో భవనాల అన్వేషణకు కావాల్సినంత సమయం ఉండడంతో.. ఈలోగా సీఎం క్యాంపు ఆఫీసు ప్రారంభానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో కార్యాలయం ప్రారంభం ఎప్పుడన్నది క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది.

 

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version