spot_img
Homeఆంధ్రప్రదేశ్‌కరోనా కట్టడిలో జగన్ మరో విప్లవాత్మక నిర్ణయం.

కరోనా కట్టడిలో జగన్ మరో విప్లవాత్మక నిర్ణయం.

Mobile Corona Testing
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా నిర్వహణలో గొప్ప చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పదకొండు లక్షలకు పైగా కరోనా టెస్టులు నిర్వహించి దేశంలోనే రెండవ స్థానంలో నిలిచారు. ఇక వెయ్యికి పైగా అంబులెన్సులు అత్యాధునిక సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులోకి తెచ్చి జాతీయ స్థాయిలో ఫేమస్ అయ్యారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే కొరోనాను కట్టడి చేయడంలో జగన్ ప్రభుత్వం చాలా ముందుంది.ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భారీగా నిధులు కేటాయిస్తూ జగన్ ప్రజారోగ్యం పట్ల తన చిత్తశుద్ధి చాటుకుంటున్నారు. లాక్ డౌన్ సడలింపుల కారణంగా ఎంత తీవ్ర కృషి చేసినా వైరస్ అదుపులోకి రావడం లేదు.

టీడీపీ బలాన్ని దెబ్బకొడుతున్న జగన్.

కాగా ఈ మహమ్మారిని అరికట్టడంలో భాగంగా జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన 20 మొబైల్ కరోనా టెస్టింగ్ యూనిట్లను ప్రారంభించనున్నారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాలలో ఈ కరోనా టెస్టింగ్ వాహనాలు చేరుకొని టెస్టులు నిర్వహించనున్నాయి. అత్యాధునిక టెస్టింగ్ పరికరాలతో కూడిన ఈ వాహనాలు ప్రజల వద్దకే పోయి..కరోనా ప్రభావిత ప్రాంతాలలో టెస్టులు నిర్వహిస్తాయీ. కరోనా సోకిన వ్యక్తిని గుర్తించే సరికే, జరగాల్సిన నష్టం జరిగిపోతున్న క్రమమంలో జగన్ ఈ మొబైల్ కరోనా టెస్టింగ్ యూనిట్స్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఒకే సారి పది మందికి కరోనా టెస్టులు నిర్వహించగలిగిన సామర్ధ్యం ఈ వాహనాలలో పొందుపరిచారు. అలాగే శాంపిల్ సేకరించిన 3-4 గంటల వ్యవధిలో ఫలితాలు తెలిసేలా సాంకేతికత ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొబైల్ కరోనా టెస్టింగ్ యూనిట్స్ ద్వారా చాలా వరకు కరోనాను కట్టడి చేయగలం అని అధికారులు నమ్ముతున్నారు. వీటి సంఖ్య 20 నుండి 50కి పెంచనున్నట్లు సమాచారం అందుతుంది. రెడ్ మరియు కంటైన్మెంట్స్ జోన్స్ లో ఈ మొబైల్ కరోనా టెస్టింగ్ యూనిట్స్ విరివిగా పరీక్షలు నిర్వహించనున్నాయి.

జగన్ పై తగ్గిన పవన్ విమర్శలు జోరు…కారణం?

ఇక గడచిన 24గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 1933 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవారు 1914కాగా, ఇతర రాష్ట్రాలవారు 18, ఒకరు విదేశాల నుండి వచ్చారు. ఇప్పటి వరకు ఏపీలో రికార్డు స్థాయిలో 11,53,849 కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 నాలుగు గంటల్లో 20మంది మృత్యువాతపడ్డారు. దీనితో ఆంధ్రప్రదేశ్ లో కరోనా వలన మరించిన వారి సంఖ్య 328మందికి చేరింది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper