చైనా నుండి మరో సంచలన వార్త!

2019వ సంవత్సరం చివరిలో పుట్టిన కరోనా మహమ్మారి 2020లో తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. ఈ మాయదారి వైరస్ విజృంభనతో ప్రపంచ దేశాలు వణికిపోతున్న తరుణంలో చైనా నుండి వచ్చిన మరో సంచలన వార్త హాట్ టాపిక్ గా మారింది. మనిషి తన జీవితంలో సుదీర్ఘకాలంపాటు కోవిడ్‌19 తో ప్రయాణం చేయాల్సి ఉంటుందని చైనా చెప్పిన వార్తకు వివిధ దేశాల నుండి భయాందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మహమ్మరిని పూర్తిగా రూపుమాపలేమని చైనాకు చెందిన వైద్యశాస్త్ర నిపుణులు అభిప్రాయపడ్డారు. కరోనా […]

Written By: Neelambaram, Updated On : April 29, 2020 10:28 am
Follow us on


2019వ సంవత్సరం చివరిలో పుట్టిన కరోనా మహమ్మారి 2020లో తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. ఈ మాయదారి వైరస్ విజృంభనతో ప్రపంచ దేశాలు వణికిపోతున్న తరుణంలో చైనా నుండి వచ్చిన మరో సంచలన వార్త హాట్ టాపిక్ గా మారింది. మనిషి తన జీవితంలో సుదీర్ఘకాలంపాటు కోవిడ్‌19 తో ప్రయాణం చేయాల్సి ఉంటుందని చైనా చెప్పిన వార్తకు వివిధ దేశాల నుండి భయాందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మహమ్మరిని పూర్తిగా రూపుమాపలేమని చైనాకు చెందిన వైద్యశాస్త్ర నిపుణులు అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌ కు కారణమైన సార్స్‌-కోవ్‌-2 సీజనల్‌ ఫ్లూ మాదిరిగా ప్రతియేడు ఉనికి చూపెడుతుందని వెల్లడించారు.

ఈ వైరస్ ఇప్పుడే అంతం కావడం కష్టమని, సుదీర్ఘకాలంపాటు కోవిడ్‌ ఉంటుందని చైనాలోని అత్యున్నత పరిశోధన సంస్థ పాథోజెన్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ జిన్‌ కి పేర్కొన్నారు. భారత్‌ లోని వైద్యశాస్త్ర నిపుణులు కూడా ప్రపంచ మానవాళిపై సార్స్‌-కోవ్‌-2 తిష్ట వేసుకు కూర్చుందని చెప్తున్నారు. అత్యధిక ట్రాన్స్‌మిషన్‌ రేటు కలిగిన కోవిడ్‌ చాలాకాలం మనుగడలో ఉంటుందని అంటున్నారు. ఇక ఇదే అభిప్రాయాన్ని అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ, ఇన్‌ఫెక్చువస్‌ డైరెక్టర్‌ ఆంథోని ఫాసీ కూడా వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ శీతాకాలం ఫ్లూగా మానవ జీవితంలో భాగమవుతుందన్నారు. రోగ నిరోధక శక్తి లేని వ్యక్తులపై కోవిడ్‌ మళ్లీ మళ్లీ దాడి చేస్తుందని భారత వైద్య పరిశోధన మండలిలో పనిచేసిన ఎపిడెమాలజిస్టు డాక్టర్‌ లలిత్‌ కాంత్‌ అభిప్రాయపడ్డారు.

ప్రతియేడు ఫ్లూ కారణంగా మూడు లక్షల నుంచి 6 లక్షల 50 వేల మంది మరణిస్తారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, సమర్థవంతమైన వ్యాక్సిన్‌ తో కోవిడ్‌ చెక్‌ పెట్టొచ్చునని వైద్యశాస్త్ర నిపుణులు అభిప్రాయపడ్డారు.