స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం ఒక్కరిదేనా..? : అందరిది కాదా!

విశాఖపట్నం.. ఈ పేరు వినగానే అందమైన సాగర తీరం మన కళ్లముందు కదలాడుతుంది. అదే సమయంలో స్టీల్ ప్లాంట్‌ కూడా గుర్తొస్తుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నలు దిక్కులూ పిక్కటిల్లేలా ఒక్కపెట్టున సాగిన ఉద్యమం గుర్తొస్తుంది. ఈ పోరులో ఏకంగా 32 మంది ప్రాణత్యాగాలు చేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవంగా విశాఖ ఉక్కు ఉంది. అయితే ఇప్పుడు ఆ ఆత్మగౌరవం ప్రైవేట్ పరం చేసే యోచనలో కేంద్రం ఉంది. అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ […]

Written By: Srinivas, Updated On : February 5, 2021 4:33 pm
Follow us on


విశాఖపట్నం.. ఈ పేరు వినగానే అందమైన సాగర తీరం మన కళ్లముందు కదలాడుతుంది. అదే సమయంలో స్టీల్ ప్లాంట్‌ కూడా గుర్తొస్తుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నలు దిక్కులూ పిక్కటిల్లేలా ఒక్కపెట్టున సాగిన ఉద్యమం గుర్తొస్తుంది. ఈ పోరులో ఏకంగా 32 మంది ప్రాణత్యాగాలు చేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవంగా విశాఖ ఉక్కు ఉంది. అయితే ఇప్పుడు ఆ ఆత్మగౌరవం ప్రైవేట్ పరం చేసే యోచనలో కేంద్రం ఉంది. అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడం తప్పదా? ప్రైవేట్ వారి చేతుల్లోకి వెళ్తే ఉక్కు ధరలకు అడ్డు అదుపు ఉంటాయా?

Also Read: జగన్‌ ఢిల్లీ పర్యటనల్లో జరుగుతున్నదేంటి..? : చెప్పేదొకటి.. జరిగేదొకటా..!

ఇప్పటితరానికి ఆ ఉద్యమం గురించి తెలియదు. వెంకయ్యనాయుడు వంటి నేతలు విద్యార్ధి దశలోనే నాయకులుగా మారినప్పుడు.. చేసిన పోరాటాల్లో ‘విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు’ విజయవంతం. విశాఖలో స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఆనాడు జరిగిన ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారు ఉన్నారు. నాడు ఒక్క విశాఖలో మాత్రమే ఆ ఉద్యమం జరగలేదు. ఏపీ మొత్తం నడిచింది. ఆ ఉద్యమ ఫలితంగానే స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. దేశ మౌలిక సదుపాయాల రంగంలో స్టీల్ ప్లాంట్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతింతై అన్నట్లుగా ఎదిగిన స్టీల్ ప్లాంట్‌ను ఇప్పుడు నష్టాల పేరుతో ప్రైవేటీకరణ చేస్తున్నారు.

ఇప్పుడు ప్రజలు మళ్లీ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. స్టీలు ప్లాంట్‌లోని వందశాతం వాటాలు అమ్మేస్తామని కేంద్రం ప్రకటించింది. కానీ.. ప్రజల్లో మాత్రం ఏ మాత్రం ఎమోషన్ కనిపించలేదు. రాజకీయ పార్టీల్లోనూ నామమాత్రమే. ఎక్కడా స్పందన లేదు. చివరికి ఉత్తరాంధ్ర నేతల్లోనూ అలజడి లేదు. రామ్మోహన్ నాయుడు లాంటి యువ ఎంపీ మాత్రం దూకుడుగా స్పందిస్తున్నారు. మిగతా వారంతా సైలెంట్ గా ఉండిపోయారు. ప్రాణత్యాగాలు చేసి మరీ తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టేస్తే ఎవరిలోనూ ఎలాంటి చలనం ఎందుకు రావడం లేదనేది ప్రశ్న.

Also Read: ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలు ఎన్నో తెలుసా..!

ఇక.. ఉత్తరాంధ్రలోనే పెద్దగా ఎవరికీ పట్టకపోతే ఇతర ప్రాంతాల్లోని వారు పట్టించుకునే చాన్స్ లేదు. రాష్ట్ర రాజధాని అమరావతిని ఆ 29 గ్రామాల సమస్య అన్నట్లుగా చూశారు. వారు పోరాటం చేస్తుంటే.. మాటల్లో కూడా సానుభూతి చూపించలేదు. ఆ అమరావతి అందరి రాజధాని అనే భావనకు రాలేకపోయారు. ఇప్పుడు ఆ పార్టియాలిటీ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ కనిపిస్తోంది. స్టీల్ ప్లాంట్ సమస్య ఒక్క ఉద్యోగులదే అనుకునే పరిస్థితే వస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటూ జరిగితే అది అక్కడి ఉద్యోగులకే ఇబ్బంది కానీ.. ప్రజలకు కాదని అనుకునే పరిస్థితి వచ్చింది. ప్రజల్లో ఈ భావనను రాజకీయ పార్టీలు పెంచి పోషిస్తున్నాయి. అందుకే వారిలోని ఐక్యత దెబ్బతింటోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్