Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan: జగన్ మహిళల కార్డు వెనుక కథ అదా?

CM Jagan: జగన్ మహిళల కార్డు వెనుక కథ అదా?

CM Jagan: ఏపీ సీఎం జగన్ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సంక్షేమమే తనకు శ్రీరామరక్షగా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నారు. అభివృద్ధి లేదన్న అపవాదును సంక్షేమ పథకాలు అధిగమిస్తాయని భావిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు తనకు అండగా నిలుస్తారని అంచనా వేస్తున్నారు. సంక్షేమ పథకాలలో మహిళల కే పెద్ద పీట వేయడం.. వారి పేరిటే అందిస్తుండడం కలిసి వస్తుందని బలమైన నమ్మకం ఏర్పరచుకున్నారు. అయితే జగన్ ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎలక్షన్ కమిషన్ ఓటర్ల వివరాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. దాదాపు సగానికి పైగా నియోజకవర్గాల్లో.. పురుషులకంటే మహిళా ఓటర్లు అధికం. ఆ ఆలోచనతోనే జగన్ మహిళలకు సంక్షేమ పథకాల్లో పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది.

జగన్ అమలు చేసే ప్రతి పథకం లబ్ధిదారులు మహిళలే. వారి ఖాతాల్లోకి నేరుగా నగదు చేరుతోంది. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా వంటి అనేక పథకాలు మహిళల పేరుతోనే నిర్వహిస్తున్నారు. చివరకు రేషన్ కార్డు సైతం మహిళల పేరుతోనే అందిస్తున్నారు. చివరకు గృహ నిర్మాణం కింద మంజూరు చేసిన ఇల్లను సైతం వారి పేరుతోనే అందిస్తున్నారు. వీటన్నింటికి కారణం పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటం. దాదాపు 152 నియోజకవర్గాల్లో పురుషుల ఓటర్ల కంటే.. మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ప్రతి 1000 మంది పురుష ఓటర్లు ఉంటే.. 1036 మంది మహిళా ఓటర్లు ఉండడం విశేషం. 18 నుంచి 21 సంవత్సరాల మధ్య మహిళా ఓటర్లు మూడున్నర లక్షల మంది ఉన్నారు. వారిని ప్రభావితం చేసేందుకే జగన్ మహిళల పేరుతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు విశ్లేషణలు ఉన్నాయి.

రాష్ట్రంలో మహిళలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలు ఇలా ఉన్నాయి.కొవ్వూరు, రంపచోడవరం, ఏలూరు, గన్నవరం, పెనమలూరు, పత్తిపాడు, తెనాలి, రామచంద్రపురం, ఒంగోలు, మంగళగిరి, రాజమండ్రి సిటీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికం. 2014లో ప్రతి 1000 మంది పురుష ఓటర్ల కంటే మహిళలు 13 మంది అధికంగా ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 36 కు పెరగడం విశేషం. ఈ లెక్కకు అనుగుణంగానే జగన్ మహిళలకు ప్రాధాన్యమిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తుండడం గమనార్హం.

గతంలో చంద్రబాబు మహిళా ఓటర్లను టార్గెట్ చేసుకొని సక్సెస్ అయ్యారు. డ్వాక్రా మహిళలతో పాటు మహిళలకు స్వయం ఉపాధి పథకాలను పెద్ద ఎత్తున అమలు చేసేవారు. రుణ రాయితీలు కల్పించి వారి స్వయం సమృద్ధి సాధనకు పాటుపడేవారు. దీంతో మహిళలు టిడిపి ఓటు బ్యాంకు గా మారారు. దీనిని గమనించిన జగన్ మహిళా ఓటర్లను టార్గెట్ చేయడం ప్రారంభించారు. వారి పేరుతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసి అభిమానాన్ని చూరగొనాలని చూస్తున్నారు. అయితే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

TDP MLA

TDP MLA: మారుతున్న టిడిపి ఎమ్మెల్యే వైఖరి.. ఏంటి కథ?!

TDP MLA: తెలుగుదేశం పార్టీకి వీర విధేయులైన నేతలు చాలామంది ఉన్నారు. పార్టీ కష్టకాలంలో సైతం వెన్నంటి నడిచిన వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో బోండా ఉమామహేశ్వరరావు ఒకరు. విజయవాడకు చెందిన...
Newtons Third Law

Newtons Third Law: న్యూటన్స్ థర్డ్ లా మూవీ ట్రైలర్ రివ్యూ..

Newtons Third Law: సమంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉంటాయి. ఆయన ఎప్పుడు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తాడు. ఆ మూవీని కల్ట్ క్లాసికల్...
Corona alert in AP

Corona alert in AP: ఏపీలో కరోనా అలెర్ట్.. ఒక్క రోజులోనే పది!

Corona alert in AP: ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తరకం వేరియంట్ నమోదవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల వ్యవధిలో పది కేసులు నమోదు కావడం గమనార్హం....
Operation Aranya

Operation Aranya: ‘ఆపరేషన్ అరణ్య’పై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్!

Operation Aranya: ఎర్రచందనం స్మగ్లర్ల పై ప్రత్యేకంగా గురి పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన అటవీ శాఖ బాధ్యతలను కూడా చూస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్...
VVS Laxman

VVS Laxman: టీమిండియా కు లక్కీ లక్ష్మణ్… ఆ గౌతమ్ గంభీర్ ను సాగనంపండి సార్

VVS Laxman: ముక్కు మీద కోపం లేదు. ముఖం మీద చిరునవ్వు మాత్రమే ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ ఉండదు. కేవలం సానుకూల దృక్పథం మాత్రమే ఉంటుంది. ఓటమి ఎదురైతే బాధ ఉండదు.. ఎలా గెలవాలి...
Oktelugu Epaper