Homeజాతీయ వార్తలుHuzurabad bypoll: హుజురాబాద్ అంటేనే కేసీఆర్ భయపడుతున్నారా?

Huzurabad bypoll: హుజురాబాద్ అంటేనే కేసీఆర్ భయపడుతున్నారా?

CM KCRHuzurabad bypoll: అందరిలో హుజురాబాద్ (Huzurabad) భయం పట్టుకుంది. ఎలాగైనా విజయం సాధించాలనే తపనతో అన్ని పార్టీలు తమ శక్తియుక్తులను పణంగా పెడుతున్నాయి. హుజురాబాద్ దెబ్బకు సీఎం కేసీఆర్ (CM KCR) సైతం తన పంథా మార్చుకుని సహజసిద్దానికి వ్యతిరేకంగా జనాల్లో కలిసిపోతున్నారు. ఇన్నాళ్లు ప్రజల్లోకి రాని కేసీఆర్ తన పద్దతి మార్చుకుని జనం వెంట పడుతున్నారు. దళిత బంధు (Dalita Bandhu) పథకం ప్రారంభించి వారిలో ఆత్మస్థైర్యం నింపడమే ధ్యేయంగా ముందుకు కదులుతున్నామని చెబుతున్నారు. దీంతో ఉన్నతాధికారులకు సైతం అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్ ప్రస్తుతం ప్రజలకు చేరువ కావాలని ప్రయత్నిస్తుండడం చూస్తుంటే అందరిలో వణుకు పుడుతున్నట్లు తెలుస్తోంది.

ఎప్పుడు ఫామ్ హౌస్ దాటి బయటకు రాని కేసీఆర్ హుజురాబాద్ లో ఓటర్లను ఆకట్టుకునే క్రమంలో జనజీవన స్రవంతికి దగ్గరవుతున్నారనే ప్రచారం సాగుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఓటమి పాలయితే పార్టీ ప్రతిష్ట దిగజారిపోతుందనే బెంగతోనే కేసీఆర్ విజయమంత్రం జపిస్తున్నారని తెలుస్తోంది. నెలల తరబడి ఫామ్ హౌస్ దాటి బయటకు రాని నేత ప్రస్తుతం ఇలా చేయడంతో అందరు ఆశ్చర్యపడుతున్నారు. వాసాలమర్రి, హుజురాబాద్ లో సభలు నిర్వహిస్తూ వారిలో మార్పు తేవాలని సూచిస్తున్నారు. అధికార పార్టీకి ఓటు వేసి విజయం దక్కించాలని వేడుకుంటున్నారు.

హుజురాబాద్ లో దళిత బంధు పథకం ప్రారంభోత్సం చేశారు. గురువారం మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ దళితబంధు లబ్ధిదారులకు వాహనాలు అందజేశారు. స్కీంలో భాగంగా వారికి ఇస్టమైన వాహనాలు వారు కొనుగోలు చేసుకోవడంతో మంత్రులు వారికి తాళాలు అందజేసి మాట్లాడారు. దళితబంధు పథకం రాష్ర్టవ్యాప్తంగా అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించడంతో అందరిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పథకం కోసం రూ.2 వేల కోట్లు కేటాయించారు.

హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటలను ఓడించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. తన సహజ శైలికి విరుద్దంగా బహిరంగ సభల్లో పాల్గొంటూ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. హుజురాబాద్ దెబ్బకు నేతల మైండ్ బ్లాక్ అవుతున్నట్లు సమాచారం. అందుకే దళితబంధు పథకంతో ప్రజలను తమ వైపు తప్పుకోవాలని ప్రయత్నిస్తోన్నారు. ఇప్పటికే నిధులు కేటాయించి రాష్ర్ట వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పడంతో అందరిలో ఉత్కంఠ కనిపిస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.

కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉప ఎన్నికపై ఇంకా తేదీ ప్రకటించలేదు. దీంతో ఎన్నికల సంఘం ఎప్పుడు తేదీ ప్రకటిస్తుందోనని నేతల్లో ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుందని తెలుస్తోంది. ఎలాగైనా విజయం దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే పలు పార్టీల నేతలను టీఆర్ఎస్ లోకి లాక్కునేందుకు పావులు కదుపుతున్నారు. వ్యూహాలు మార్చుకుంటున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version