Air Force : డ్రాగన్‌ కంట్రీ ఎత్తుకు.. భారత్‌ పైఎత్తు.. నిఘా బెలూన్లకు చెక్‌..

భారత్‌కు పక్కలో బల్లెంగా మారింది డ్రాగన్‌ కంట్రీ చైనా. పలు దేశాలపై పట్టు పెంచుకునేందుకు, ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసేందుకు శత్రుదేశాల శక్తి సామర్థ్యాలు తెలుసుకునేందుకు చైనా అనేక కుయుక్తులు పన్నుతోంది.

Written By: Neelambaram, Updated On : October 7, 2024 2:19 pm

Air Force

Follow us on

Air Force :  భారత్‌కు దాయాది దేశం పాకిస్తాన్‌ తలనొప్పిగా మారింది. ఉగ్రవాదులను, చొరబాట్లను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌ భారత్‌లో అలజడికి ప్రయత్నిస్తోంది. ఐదేళ్లుగా మరో పొరుగు దేశం చైనా కూడా తన చర్యలతో భారత్‌ను కవ్విస్తోంది. తరచూ సరిహద్దులు మారుస్తూ.. మ్యాప్‌లు విడుదల చేస్తోంది. గాల్వన్‌లో అయితే చొరబాటుకు ప్రయత్నించింది. భారత సైన్యం దానిని తిప్ప కొంట్టింది. అప్పటి నుంచి చైనా భారత్‌ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అప్పటి నుంచి భారత్‌ను కవ్విస్తోంది. దీంతో మోదీ కూడా చైనాకు చెక్‌ పెట్టే చర్యలు మొదలు పెట్టారు. పలు చైనా యాప్‌లను బ్యాన్‌ చేసి కోట్ల రూపాయల ఆదాయానికి గండి కొట్టాడు. చైనా తయారీ వస్తువుల దిగుమతిపై ట్యాక్స్‌లు పెంచారు. చాలా వరకు దిగుమతులు తగ్గించారు. ఈ నేపథ్యంలో చైనా దొడ్డిదారిన భారత్‌పై నిఘా పెడుతోంది. మనతో సన్నిహితంగా ఉండే, శ్రీలంక, మాల్దీవులను మచ్చిక చేసుకుని సరిహద్దుల్లో నిఘా పెంచుతోంది. ఇక భారత సరిహద్దుల్లో అనేక నిర్మాణాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌ కూడా చైనా ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది.

నిఘా బెలూన్లకు చెక్‌..
పొరుగు దేశాలపై నిఘా కోసం చైనా ప్రత్యేకంగా బెలూన్లు తయారు చేసి వినియోగిస్తోంది. తాజాగా ఈ బెలూన్లను కూల్చివేసే అంశంపై భారత వాయుసేన దృష్టిపెట్టింది. దాదాపు 15 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తున్న వస్తువులను కూల్చడంపై ఎయిర్‌ఫోర్స్‌ కమాండోలకు శిక్షణ ఇచ్చింది. అత్యంత ఎత్తులో ఉన్న బెలూన్లను కూల్చే ఆపరేషన్‌లో రఫేల్‌ యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. దీనిలో ఉపయోగించిన బెలూన్లకు పేలోడ్‌ను కూడా అమర్చారు. దీనిని 55 వేల అడుగుల ఎత్తులో ఒక క్షిపిణిని ప్రయోగించి కూల్చేశారు. దీంతో గగనతలంల నిదానంగా కదిలే భారీ టార్గెట్లను కూడా కూల్చే సత్తాను భారత్‌ ఏర్పాటు చేసుకుంది.

2023 నుంచి చైనా నిఘా బెలూన్లు
ఇక డ్రాగన్‌ కంట్రీ చైనా 2023 నుంచి నిఘా బెలూన్లను ప్రయోగిస్తోంది. అమెరికాలో దక్షిణ కరోలినా గగనతలంల ఓ నిఘా బెలూన్‌ ప్రత్యక్షమై సంచలనం సృష్టించింది. నాడు అమెరికా యుద్ధ విమానం ఎఫ్‌–22 సాయంతో దీనిని కూల్చారు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలపై చైనా నిఘా బెలూన్లు కనిపించాయి. భారత్‌లో కూడా త్రివిద దళాల కమాండ్‌ ఉన్న అండమాన్‌ నికోబార్‌ దీవులపైనా కనిపించాయి. నాలుగు రోజుల తర్వాత మాయమయ్యాయి. ఈ నిఘా బెలూన్లపై ప్రత్యేక పరికరాలు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్‌ చైనాకు చెక్‌ పెట్టేలా గగణతలంలో పేల్చే పరిజ్ఞానం సొంతం చేసుకుంది.