Homeజాతీయ వార్తలుIndia-Pakistan : సాగర దిగ్బంధం.. దాయాది వెన్నులో వణుకు!

India-Pakistan : సాగర దిగ్బంధం.. దాయాది వెన్నులో వణుకు!

India-Pakistan  : పహల్గాం ఘటన భారత్‌–పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి చేయడం, వారి వెనుక పాకిస్థాన్‌ఉండడం.. భారత్‌ ఆగ్రహానికి కారణమైంది. ముష్కరులకు అండగా ఉంటున్న పాకిస్థాన్‌ను దెబ్బకొట్టేందుకు భారత్‌ సర్వం సన్నద్ధమైంది. సైన్యం, ఎయిర్‌ ఫోర్స్‌తోపాటు నావికాదళం కూడా ఎలాంటి పరిస్థితి అయినా ఎదుక్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు పాకిస్థాన్‌ వెన్నులో వణుకు పుట్టేలా త్రివిధ దళాలు విన్యాసాలు చేస్తున్నాయి. తాజాగా భారత నౌకాదళం పాకిస్తాన్‌ను సాగర దిగ్బంధం చేస్తోంది.

Also Read : పాకిస్థాన్‌ నుంచి తిరిగి వస్తున్న భారతీయులు.. ఇప్పటి వరకు ఎంత మంది వచ్చారంటే..

భారత నౌకాదళం అరేబియా సముద్రంలో ఐఎన్‌ఎస్‌ సూరత్‌ యుద్ధనౌక నుంచి ఎంఆర్‌శామ్‌ (మీడియం రేంజ్‌ సర్ఫేస్‌–టు–ఎయిర్‌ మిసైల్‌) క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి సముద్రతీరానికి చేరువగా దూసుకొచ్చిన లక్ష్యాన్ని కచ్చితంగా ధ్వంసం చేసింది. యుద్ధ విమానాలు, డ్రోన్లు, హెలికాప్టర్లు, క్రూయిజ్‌ క్షిపణులను నాశనం చేసే సామర్థ్యం ఈ క్షిపణికి ఉంది. ఈ పరీక్ష భారత నౌకాదళం యొక్క ఆధునిక యుద్ధ సన్నద్ధతను, సముద్ర రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది.
సముద్రంలో ఆధిపత్యం
విమానవాహక నౌకలు ఒంటరిగా రంగంలోకి దిగవు. వీటిని జలాంతర్గాములు, డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లతో కూడిన శక్తిమంతమైన సమూహం, అంటే క్యారియర్‌ బ్యాటిల్‌ గ్రూప్‌ (సీబీజీ), మద్దతు ఇస్తుంది. ఈ గ్రూప్‌ సముద్రంలో విస్తత ప్రాంతంపై పూర్తి ఆధిపత్యం సాధించగలదు. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ వంటి విమానవాహక నౌకలు ఈ సీబీజీలో కీలక పాత్ర పోషిస్తాయి, వాయు, ఉపరితల, సముద్రగర్భ దాడులను సమన్వయంతో నిర్వహిస్తాయి.

పాకిస్థాన్‌పై దిగ్బంధం సాధ్యమేనా?
స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్, అరేబియా సముద్రంలో మోహరించడం పాకిస్థాన్‌లో ఆందోళన కలిగిస్తోంది. ఈ విమానవాహక నౌక పాకిస్థాన్‌ యొక్క వ్యూహాత్మక రేవులైన కరాచీ, గ్వాదర్‌లను దిగ్బంధం చేసే సామర్థ్యం కలిగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్థాన్‌ వాణిజ్యంలో 60 శాతానికి పైగా ఈ రేవుల ద్వారానే జరుగుతుంది, అలాగే 85 శాతం చమురు దిగుమతులు సముద్ర మార్గంలోనే సాగుతాయి. దిగ్బంధం వల్ల పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల కొరత, అలాగే మూడోవంతు విద్యుత్‌ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడవచ్చు.

విక్రాంత్‌ యొక్క యుద్ధ సామర్థ్యం
ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ మిగ్‌–29కె ఫైటర్‌ జెట్లు, కామోవ్‌–31 హెలికాప్టర్లతో సహా 40 యుద్ధ విమానాలను మోహరించగలదు. ఇది 64 బరాక్‌ క్షిపణులు, బ్రహ్మోస్‌ క్రూయిజ్‌ క్షిపణులు, ఒటోబ్రెడా 76 ఎంఎం గన్స్, ఏకే–630 క్లోజ్‌–ఇన్‌ ఆయుధ వ్యవస్థలతో శక్తిమంతంగా ఉంది. ఈ నౌక శత్రు వైమానిక, క్షిపణి దాడులను తట్టుకునే బహుళ అంచెల రక్షణ వ్యవస్థను కలిగి ఉంది. మిగ్‌–29కె జెట్లు 850 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలవు, పాకిస్థాన్‌లోని మస్రూర్, సర్గోదా వంటి వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవచ్చు. భారత వాయుసేనతో సమన్వయంతో దాడులు చేస్తే, పాకిస్థాన్‌ యొక్క సైనిక ఆదేశిక వ్యవస్థలను గణనీయంగా దెబ్బతీయవచ్చు.

పాక్‌ నేవీతో పోలిస్తే భారత్‌ ఆధిపత్యం
భారత నౌకాదళం ముందు పాకిస్థాన్‌ నేవీ సామర్థ్యం చాలా బలహీనంగా ఉంది. భారత్‌ వద్ద విమానవాహక నౌకలు, అణు జలాంతర్గాములు, ఆధునిక యుద్ధనౌకలు ఉండగా, పాకిస్థాన్‌ వద్ద చైనా తయారీ టైప్‌–054ఏ/పీ ఫ్రిగేట్లు, తుర్కియే నిర్మిత మిల్జెమ్‌ కార్వెట్లు, హంగోర్‌ తరగతి జలాంతర్గాములు ఉన్నాయి, అయితే ఇవి ఇంకా తయారీ దశలోనే ఉన్నాయి. భారత నౌకాదళం ఆధునికీకరణ శరవేగంగా సాగుతుండగా, పాకిస్థాన్‌ నేవీ నత్తనడకన సాగుతోంది. ఈ నేపథ్యంలో, భారత నౌకా దిగ్బంధాన్ని తట్టుకునే సామర్థ్యం పాక్‌ నేవీకి లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

1971 యుద్ధంలో విక్రాంత్‌ వీరగాథ
1971 భారత్‌–పాక్‌ యుద్ధంలో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ కీలక పాత్ర పోషించింది. తూర్పు పాకిస్థాన్‌ (నేటి బంగ్లాదేశ్‌)లోని చిట్టగాంగ్, కాక్స్‌ బజార్, ఖుల్నా నగరాలపై దాడులు చేసి, పాక్‌ నౌకాదళ సరఫరాలను అడ్డుకుంది. పాకిస్థాన్‌ ఈ నౌకను ధ్వంసం చేసేందుకు పీఎన్‌ఎస్‌ ఘాజీ జలాంతర్గామిని రంగంలోకి దించగా, భారత నేవీ తెలివిగా ఐఎన్‌ఎస్‌ రాజ్పుత్‌ను విక్రాంత్‌గా పొరబడేలా చేసి, ఘాజీని జలసమాధి చేసింది. ఈ ఘటన పాక్‌ నౌకాదళానికి పెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది.

కరాచీపై చారిత్రక దాడులు
1971 యుద్ధంలో భారత నౌకాదళం కరాచీ రేవుపై చేపట్టిన ఆపరేషన్‌ ట్రైడెంట్, ఆపరేషన్‌ పైథాన్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. డిసెంబర్‌ 4, 1971న కిల్లర్‌ స్క్వాడ్రన్‌ క్షిపణి నౌకలు పాక్‌ యుద్ధనౌకలైన పీఎన్‌ఎస్‌ ముహాఫిజ్, పీఎన్‌ఎస్‌ ఖైబర్, సరఫరా నౌక ఎంవీ వీనస్‌లను ముంచాయి. కరాచీలోని చమురు ట్యాంకులు, ఇంధన నిల్వలు ధ్వంసమయ్యాయి. ఆపరేషన్‌ పైథాన్‌లో మరిన్ని సరకు రవాణా నౌకలు, ఇంధన ట్యాంకర్‌ పీఎన్‌ఎస్‌ ఢాకా దెబ్బతిన్నాయి. ఈ దాడులు పాక్‌ నేవీ ఇంధన నిల్వల్లో 50 శాతాన్ని నాశనం చేసి, భారత విజయానికి బాటలు వేశాయి.

ఐఎన్‌ఎస్‌ సూరత్‌ నుంచి ఎంఆర్‌శామ్‌ క్షిపణి పరీక్ష, ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ మోహరింపు భారత నౌకాదళ శక్తిని ప్రపంచానికి చాటాయి. సముద్ర రక్షణ, దిగ్బంధం, దాడి సామర్థ్యాలతో భారత్‌ పాకిస్థాన్‌పై ఆధిపత్యం కొనసాగిస్తోంది. 1971 యుద్ధంలో విక్రాంత్, కరాచీ దాడుల చరిత్ర ఈ శక్తిని గతంలోనూ నిరూపించింది. ఆధునిక ఆయుధాలు, వ్యూహాత్మక సామర్థ్యాలతో భారత నౌకాదళం జాతీయ భద్రతను మరింత బలోపేతం చేస్తోంది.

Also Read : పహల్గామ్ ‘హీరో’ రయీస్ అహ్మద్ భట్ ఎవరు? అక్కడ ఆయన చూసిన వాస్తవాలు ఏంటి?

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version