Homeజాతీయ వార్తలుIndia Hits A Jackpot: ఒడిశాలో గుట్టల కొద్దీ బంగారం.. ఆర్థిక శక్తికి కొత్త ఊపిరి

India Hits A Jackpot: ఒడిశాలో గుట్టల కొద్దీ బంగారం.. ఆర్థిక శక్తికి కొత్త ఊపిరి

India Hits A Jackpot: భారత దేశం 80 శాతం పెట్రోలియం ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటుంది. కేవలం 20 శాతం మాత్రమే మన దేశంలో లభిస్తోంది. అలాగే బంగారం కూడా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ప్రపంచంలో బంగారం ఎక్కువగా వినియోగించే దేశాల్లో భారత్‌ ఒకటి. ఈ దిగుమతుల కారణంగా మన రూపాయి విలువ తగ్గుతోంది. విదేశా మారక నిల్వలు తగ్గిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో భారత ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసేలా భారీ బంగారు నిల్వలను జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జేఎస్‌ఐ) గుర్తించింది. ఇది దేశ ఆర్థిక రంగంలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో సుమారు 20 మెట్రిక్‌ టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్లు అంచనా. ఇది బంగారం దిగుమతులపై ఆధారపడే భారత్‌కు ఊరట కలిగించే అంశం. ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే మైనింగ్‌ పనులను ప్రారంభించి, త్వరలో వేలం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

బంగారం ప్రాముఖ్యత
జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఒడిశాలోని నాలుగు జిల్లాల్లో 20 మెట్రిక్‌ టన్నుల బంగారు నిల్వలను గుర్తించింది. ఈ నిల్వలు దేశంలో బంగారం ఉత్పత్తిని పెంచి, విదేశీ దిగుమతులపై ఆధారపడే తీవ్రతను తగ్గించే అవకాశం ఉంది. భారత్‌ ఏటా భారీ మొత్తంలో బంగారాన్ని దిగుమతి చేస్తుంది. ఇది విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని పెంచుతుంది. స్థానిక ఉత్పత్తి ద్వారా ఈ భారం తగ్గవచ్చు. మైనింగ్‌ కార్యకలాపాలు స్థానికులకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి, ఒడిశా ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి. ఒడిశా ప్రభుత్వం ఈ బంగారు నిల్వలను సద్వినియోగం చేసుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. మైనింగ్‌ పనులు ప్రారంభించడంతోపాటు, త్వరలో వేలం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. పారదర్శకమైన వేలం విధానం ద్వారా సమర్థవంతమైన కంపెనీలకు మైనింగ్‌ హక్కులు కేటాయించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఆధునిక మైనింగ్‌ సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. మైనింగ్‌ ఆదాయాన్ని ఒడిశాలో మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధికి వినియోగించవచ్చు.

Also Read: దేశం వీడుతున్న మేధావులు.. కారణం ఇదే!

దిగుమతుల తగ్గింపు
భారత్‌ ప్రపంచంలో అతిపెద్ద బంగారం దిగుమతి దేశాల్లో ఒకటి. 2024లో భారత్‌ దాదాపు 800 మెట్రిక్‌ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసినట్లు అంచనా. ఒడిశాలో 20 మెట్రిక్‌ టన్నుల నిల్వలు ఈ దిగుమతి భారాన్ని కొంతమేర తగ్గించవచ్చు. స్థానిక ఉత్పత్తి ద్వారా విదేశీ మారక ఖర్చు తగ్గడం వల్ల రూపాయి విలువ స్థిరీకరణకు దోహదం చేస్తుంది. స్థానిక ఉత్పత్తి పెరిగితే, దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో అధిక ఉత్పత్తి సాధ్యమైతే, భారత్‌ బంగారం ఎగుమతి దేశంగా మారే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version