Homeజాతీయ వార్తలుIndian Temples Unique Prasads: భారతదేశంలోని ఈ దేవాలయాల్లో నైవేద్యంగా మాంసాహారం.. వింత ఆచారాలు

Indian Temples Unique Prasads: భారతదేశంలోని ఈ దేవాలయాల్లో నైవేద్యంగా మాంసాహారం.. వింత ఆచారాలు

Indian Temples Unique Prasads: ఒకటే దేశం.. కానీ విభిన్న మతాలు, సంస్కృతులకు పుట్టినిల్లు మన ‘భారతం’.. ఇక్కడే హిందూ, జైన, బౌద్ధ సహా చాలా పురుడుపోసుకున్నాయని చరిత్ర చెబుతోంది. సువిశాల భారతంలో రాష్ట్రానికో సంస్కృతి సంప్రదాయం పరిఢవిల్లుతోంది. భారతదేశంలోని ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఆ దేవతలకు జాతరులు, బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ కొలుస్తుంటారు. భారతదేశంలోని ప్రతి కొన్ని కిలోమీటర్లకు, సంస్కృతి మారుతుంది. ప్రతి ప్రదేశం దాని స్వంత నమ్మకాలను కలిగి ఉంటుంది. ఈ నమ్మకం ప్రకారం, దేవతలకు ప్రత్యేకమైన నైవేద్యాలు చేయడం అనాదిగా వస్తుంటుంది. వంట చేసిన తర్వాత ఈ నైవేద్యాన్ని దేవుడికి సమర్పించి అనంతరం ఆలయ భక్తులకు అందిస్తారు. దీనినే ప్రసాదం అంటారు. ఇది దైవానికి ఇవ్వబడిన దయగల బహుమతిగా భావిస్తారు. దాతలు చాలా మంది ఈ ప్రసాదాన్ని సొంత ఖర్చుతో తయారు చేసి దేవుడికి సమర్పిస్తారు. భక్తుల ఆకలి తీరుస్తుంటారు. ఇది దైవిక – మానవుల మధ్య స్వీకరించడం.. ఇవ్వడాన్ని నేర్పుతుంది. దయ, దైవిక ప్రేమ.. సమాజంలోని వారి పట్ల సానుభూతిని తెలియజేస్తుంది. నైవేద్యాన్ని దేవతకు సమర్పించి తిరిగి ఇచ్చినప్పుడు అది పవిత్రమైనదని భావిస్తారు. ఆ తర్వాత భక్తులు నైవేద్యాన్ని పంచి సేవిస్తారు. ఎక్కువగా ప్రసాదాల్లో తీపి లేదా ఏదైనా శాఖాహారం కానీ ఉంటుంది. కానీ భారతదేశంలోని కొన్ని దేవాలయాలు మాంసాహారాన్ని ప్రసాదంగా అందిస్తాయి. అవేంటి? ఎక్కడున్నాయి? వాటి కథ ఏంటన్నది తెలుసుకుందాం.

Indian Temples Unique Prasads
Indian Temples Unique Prasads

-ఒడిశాలోని విమల ఆలయంలో నైవేద్యంగా చేపలు-మటన్
దుర్గా అవతారం అయిన పూరీలోని విమల దేవాలయానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడే ఈ మందిరం పూరీలోని జగన్నాథ ఆలయ సముదాయంలో ఒక భాగం. పవిత్ర మార్కండ ఆలయ ట్యాంక్ నుండి చేపలను వండి దుర్గా పూజ పండుగ సందర్భంగా బిమల దేవికి అందజేస్తారు. ప్రసాదాన్ని ‘బిమల పరుస’ (విమల అక్కడ బిమల అని పలుకుతారు) అని అంటారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. జగన్నాథుని ఆలయం తలుపులు తెల్లవారుజామున తెరవబడటానికి ముందు ఇవన్నీ జరుగుతాయి. ఈ ఆచారం సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుగుతుంది. జంతుబలి కూడా ఇక్కడ ఉంది. ఈ సమయంలో దేవత తన కోపంతో విధ్వంసక స్థితిలోకి వస్తుందని భక్తులు నమ్ముతారు. ఆమెను శాంతింపజేయడానికి మాంసం అవసరమని భావిస్తారు.అందుకే అమ్మవారికి చేపలు-మటన్ ను నైవేద్యంగా పెట్టడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.

Indian Temples Unique Prasads
Vimala temple

Also Read: Jagan- Govt Employees: ఏపీ ప్రభుత్వంపై తిరుగుబాటుకు రెడీ అయిన ఉద్యోగులు

-ఉత్తరప్రదేశ్ తార్కుల్హా దేవి ఆలయంలో నైవేద్యంగా మటన్ మాంసం
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉన్న తార్కుల్హా దేవి ఆలయంలో ప్రతి సంవత్సరం ఖిచారి మేళా నిర్వహించినప్పుడు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. కోరికలు తీర్చడంలో ఈ పుణ్యక్షేత్రం ఖ్యాతిగాంచింది. చైత్ర నవరాత్రుల సమయంలో, ప్రజలు తమ కోరికను తీర్చడానికి బదులుగా దేవతకు మేకను సమర్పిస్తారు. దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి ఈ ఆలయానికి వస్తారు.. అమర్ షహీద్ బంధు సింగ్ తన తలను బ్రిటీష్ వారికి సమర్పించి ప్రారంభించిన త్యాగం సంప్రదాయం ఇప్పటికీ ఇక్కడ కొనసాగుతోంది. ఇప్పుడు ఇక్కడ దాన్ని కొనసాగిస్తూ మేకను బలి ఇస్తారు. ఆ తర్వాత మేక మాంసాన్ని మట్టి కుండలలో (మట్కీ లేదా హండీ) వండుతారు. తరువాత ప్రసాదంగా పంపిణీ చేస్తారు.

Indian Temples Unique Prasads
Tarkulha Devi Temple

కేరళలోని లార్డ్ ముత్తప్ప పారిస్సినికడవు ముత్తప్పన్ ఆలయంలో నైవేద్యంగా చేపలు
లార్డ్ ముత్తప్పన్, శివుడు మరియు విష్ణువుల కలియుగగా ఈ దేవుడిని నమ్ముతారు. కలియుగంలో జన్మించినట్లు భావించే అవతారం. దక్షిణాన ఈయన అనేక పేర్లతో ప్రసిద్ది చెందాడు. ఈ దేవుడికి నైవేద్యాలలో ఎక్కువ భాగం కల్లు , కాల్చిన చేపలను వండి పెడుతారు. వీటిని లార్డ్ ముత్తప్పన్‌ సమర్పించడం వల్ల వారి కోరికలు నెరవేరుతాయన్నది భక్తుల విశ్వాసం. అనంతరం ఇది పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయబడుతుంది. ఈనాటికీ పరిసినికడవు ఆలయంలో ఉడికించిన ధాన్యాలు, కొబ్బరి ముక్కలు మరియు చేపలను ప్రసాదంగా (పవిత్ర నైవేద్యంగా) అందజేస్తారు.

Parassinikadavu Sree Muthappan Temple
Parassinikadavu Sree Muthappan Temple

-పశ్చిమ బెంగాల్ లోని కాళీఘాట్ నైవేద్యంగా మాంసం
కాళీ మాతా ఆలయం 200 సంవత్సరాల పురాతన శక్తిపీఠాలలో ఒకటిగా ఉంది. మేక బలి ఇక్కడ ఒక సాధారణ ఆచారం. దాక్షాయణి లేదా సతి యొక్క కుడి పాదం యొక్క వేళ్లు నేలను తాకిన ప్రదేశం కాళీఘాట్ గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మాంసాన్ని ఉల్లి వెల్లుల్లి లేకుండా వండుతారు. భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. ఇక్కడ దేవికి శాఖాహారం కూడా నైవేద్యంగా పెడుతారు. ఆమె సహచర దేవతామూర్తులైన డాకిని, యోగిని లకు మాంసాహారాన్ని నైవేద్యంగా పెడుతారు.

Kalighat
Kalighat

– అస్సాంలోని కామాఖ్య దేవాలయంలో నైవేద్యంగా చేపలు & మాంసం
అస్సాంలోని కామాఖ్య దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన మరొక శక్తి పీఠం. అక్కడ రెండు వంటలు తయారు చేసి సమర్పిస్తారు.. ఒకటి శాఖాహారం.. మరొకటి మాంసాహారం. నైవేద్యంలో ఉల్లిపాయ లేదా వెల్లుల్లిని అస్సలు వాడరు. మేక మాంసాన్ని ఉడికించి కామాఖ్యకు సమర్పించి మాంసాహార నైవేద్యం చేయిస్తారు. అదనంగా అప్పుడప్పుడు చేపలను చట్నీలో వండుతారు. మధ్యాహ్నం 1:00 మరియు 2:00 గంటల మధ్య దేవతకు నైవేద్యంగా పెడతారు. ఈ నైవేద్యాన్ని సమర్పించే సమయంలో ఆలయ ముఖద్వారాలు మూసి ఉంటాయి. చేపలు మంసాన్ని నైవేద్యంగా పెట్టడం ఇక్కడ అనాధిగా వస్తున్న ఆచారం.

Kamakhya Temple
Kamakhya Temple

-పశ్చిమ బెంగాల్ లోని దక్షిణేశ్వర్ కాళీ దేవాలయంలో నైవేద్యంగా చేప
దుర్గాదేవిని ఆరాధించేవారిలో ప్రసిద్ధి చెందిన మరొక శక్తిపీఠం ఇది. కాళీ దేవిని ఆరాధించేందుకు వచ్చిన భక్తులు నైవేద్యంగా ఇక్కడ చేపలను వండుతారు. ఈ ఆలయంలో జంతుబలులు పాటించరు. హుగ్లీ నది తూర్పు ఒడ్డున ఉన్న ఈ ఆలయ ప్రధాన దేవత భవతారిణిని ఆదిశక్తి కాళికా అని కూడా పిలుస్తారు. పరాశక్తి ఆద్య కాళి అమ్మవారిగా కొలుస్తారు. ఇక్కడ నైవద్యంగా చేపను వండిపెట్టడం అనాదిగా వస్తుంది.

Dakshineswar Kali Temple
Dakshineswar Kali Temple

ఇలా నైవేద్యంగా దేవతలకు శాఖాహారాలే కాదు.. మాంసాహారాన్ని కూడా పెట్టే ఆలయాలు, సంప్రదాయాలు దేశంలో ఉన్నాయి. అనాదిగా ఇక్కడ ఆఅది కొనసాగుతోంది. దేవతకు ఇష్టమైన ఆహారాన్ని వండి భక్తులకు పంచడం జరుగుతూనే ఉంది. ఈ విభిన్న ఆచార వ్యవహారాల గురించి చాలా మందికి తెలియదు.

Also Read:Jagan Chandrababu: పార్టీలోనూ కలవరా పుష్ప.. జగన్ , చంద్రబాబు ల హావభావాలు చూడాల్సిందే?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version