Homeజాతీయ వార్తలుTelangana Politics: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. తెలంగాణలో ఎవరిది అధికారం?

Telangana Politics: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. తెలంగాణలో ఎవరిది అధికారం?

Telangana Politics: చూస్తుండగానే ఐదేళ్లు గడిచిపోయాయి. భారత రాష్ట్ర సమితి రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.. జాతీయ రాజకీయాల్లోకి కూడా ప్రవేశించింది. అయితే ఇప్పుడు తెలంగాణలో భారత రాష్ట్ర సమితి పదవి కాలం దాదాపుగా ముగిసేందుకు వచ్చింది. అంటే దాదాపుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించినట్టే. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది డిసెంబర్ నాటికే తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇటు మూడవసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భారత రాష్ట్ర సమితి యోచిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులకు రావాలని అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బిజెపి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. రాజకీయ పార్టీల విషయాన్ని పక్కన పెడితే ఎన్నికలకు సంబంధించి ప్రజల నాడిని కొన్ని కొన్ని సంస్థలు సర్వే చేస్తుంటాయి. అధికారంలోకి ఫలానా పార్టీ వస్తుందని తమ అంచనాగా చెబుతాయి. ఈ పరిస్థితుల మధ్య తాజాగా పోల్ స్ట్రాటజీ గ్రూప్ అనే ఓ సంస్థ తెలంగాణ రాజకీయాలపై సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు అధికారంలోకి వస్తారో తేల్చి చెప్పింది.

ఈ సర్వే నివేదిక ప్రకారం

పోల్ స్ట్రాటజీ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భారత రాష్ట్ర సమితికి 40 శాతం వరకు ఓట్లు వస్తాయని చెప్పింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ మూడవసారి ప్రమాణస్వీకారం చేస్తారని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి 34 శాతం ఓట్లు పోలవుతాయని లెక్క కట్టింది. భారతీయ జనతా పార్టీకి 16 శాతం వరకు ఓట్లు పడతాయని అంచనా వేసింది. ఇక ఇతరులు 10 శాతం వరకు ఓట్లు సాధిస్తారని స్పష్టం చేసింది. ఇక మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతారని పోల్ స్ట్రాటజీ నిర్వహించిన సర్వేలో 43 శాతం మంది ప్రజలు తమ మనోగతాన్ని వెల్లడించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని 29 శాతం మంది కోరుకున్నారు.. బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ సీఎం అవ్వాలని నాలుగు శాతం మంది కోరుకున్నారు..

పాలనా పరంగా..

ఇక పాలనాపరంగా తెలంగాణలో 49 శాతం మంది ప్రజలు కేసీఆర్ పరిపాలనను మెచ్చుకున్నారు. ఆయన పాలన అద్భుతంగా ఉంటుందంటే ప్రశంసించారు. 20 శాతం మంది ప్రజలు కేసీఆర్ పాలన బాగాలేదని చెప్పారు. 13 శాతం మంది పరిపాలన విషయంలో మార్పులు జరగాలని కోరారు. తెలంగాణలో ప్రభుత్వం అధ్వానంగా ఉందని 15 శాతం మంది ప్రకటించారు. ఎటూ చెప్పలేమని మూడు శాతం మంది ప్రకటించారు. మరోవైపు ప్రతిపక్షాల గురించి సర్వే సంస్థ ఓటర్ల వద్ద ప్రస్తావించగా.. వారికి గతంలో పాలించిన అనుభవం లేదు కాబట్టి అంతగా మొగ్గు చూపలేమని ఓటర్లు ప్రకటించారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version