Homeజాతీయ వార్తలుHydrogen Train India: హైడ్రోజన్‌ రైలు వచ్చేస్తోంది.. భారత రైల్వే వ్యవస్థలో కొత్త అధ్యాయం

Hydrogen Train India: హైడ్రోజన్‌ రైలు వచ్చేస్తోంది.. భారత రైల్వే వ్యవస్థలో కొత్త అధ్యాయం

Hydrogen Train India: ఇప్పటి వరకు మనకు బొగ్గుతో నడిచే రైలు ఇంజిన్లు, డీజిల్‌తో నడిచే ఇంజిన్లు.. ప్రస్తుతం విద్యుత్‌తో నడిచే ఇంజిన్లు తెలుసు. బొగ్గుతో నడిచే ఇంజిన్లు కనుమరుగయ్యాయి. డీజిన్‌ ఇంజిన్లు, విద్యుత్‌ ఇంజిన్లు ప్రస్తుతం ఉన్నాయి. అయితే డీజిల్‌ ఇంజిన్లు కాలుష్యానికి కారణం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత రైల్వే కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. హైడ్రోజన్‌ ఇంజిన్‌ను రూపొందించాయి. జనవరి 26న భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్యానా జీంద్‌ నుంచి సోనీపత్‌లోకి మొదటి హైడ్రోజన్‌ రైలును ప్రారంభిస్తారు. ఇది భారత ఇంజినీరింగ్‌ సామర్థ్యానికి చిహ్నం. ప్రస్తుతం భారతీయ రైల్వేలో 5 వేలకు పైగా డీజిల్‌ లోకోమోటివ్‌లు పరిచయం చేస్తున్నాయి, ఇవి పర్యావరణానికి భారం.

డీజిల్‌ నుంచి హైడ్రోజన్‌కు మార్పు..
డీజిల్‌ ఇంజిన్‌లు కార్బన్‌ ఉద్గారాలతో కాలుష్యాన్ని పెంచుతుంటే, హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌లు విపరీతం. హైడ్రోజన్, ఆక్సిజన్‌ మిశ్రమాన్ని ఎలక్ట్రోకెమికల్‌ ప్రక్రియలో వాడి, ఏకైక ఉత్పత్తి నీటి ఆవిరి. ఇది ’క్లైమేట్‌ ఫ్రెండ్లీ’ ఎంజిన్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది.

ప్రపంచంలో ఐదో దేశం
ఇప్పటివరకు జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, చైనా మాత్రమే హైడ్రోజన్‌ రైళ్లను రన్ని. భారత్‌ ఐదవ దేశంగా చేరింది. అమెరికా, చైనా, యూరప్‌ కాలుష్య సమస్యలను విస్మరిస్తుంటే, భారత్‌ 2015 పారిస్‌ ఒప్పంద పట్టుకుని ఒక్కొక్క గ్రీన్‌ టెక్‌ను అమలు చేస్తోంది.

35 ఇంజిన్ల తయారీకి ప్రణాళిక..
కేంద్ర ప్రభుత్వం 2,800 కోట్ల రూపాయల ప్రాజెక్టును ప్రవేశపెట్టి, 35 హైడ్రోజన్‌ లోకోమోటివ్‌ల తయారీకి ఆమోదం తెలిపింది. ఇది మొదటి దశ. బ్యాటరీ రైళ్లలో రీఛార్జింగ్, బ్యాటరీ ఎక్స్‌చేంజ్‌కు గంటలు పడితే, హైడ్రోజన్‌ సెల్‌లు క్విక్‌ రిఫ్యూయల్‌తో రెండు ట్రైన్‌ల మధ్య గ్యాప్‌ను తగ్గిస్తాయి.

ఈ టెక్‌ విస్తరణతో డీజిల్‌ ఇంజిన్‌లు క్రమంగా రద్దు చేసి.. పూర్తి హైడ్రోజన్‌ ఫ్లీట్‌ ఏర్పాటవుతుంది. 2017లో చేసిన ’నెట్‌–జీరో ఎమిషన్‌ ట్రాన్స్‌పోర్ట్‌’ వాగ్దానాన్ని ఇప్పుడు నిజం చేస్తున్నాం. ఎదుగుతున్న భారత్‌కు ఇది పర్యావరణ, టెక్నాలజీ రంగాల్లో మార్గదర్శకం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version