Homeజాతీయ వార్తలుBangalore house rent: ఇంటి అద్దె రూ.70 వేలు.. రూ.5 లక్షల అడ్వాన్స్‌.. ఇదీ ‘బెంగ’ళూరు

Bangalore house rent: ఇంటి అద్దె రూ.70 వేలు.. రూ.5 లక్షల అడ్వాన్స్‌.. ఇదీ ‘బెంగ’ళూరు

Bangalore house rent: భారతదేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు, సిలికాన్‌ సిటీగా ఖ్యాతి గడించింది. ఇక్కడి ఇంటి అద్దెలు సామాన్యులకు ఆర్థిక భారంగా మారుతున్నాయి. జీతంలో అత్యధికంగా ఇంటి అద్దెకే చెల్లించాల్సి వస్తోంది. అడ్వాన్స్‌ డిపాజిట్‌ డిమాండ్‌లు జనసామాన్యాన్ని, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులను కలవరపెడుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇటీవల రెడిట్‌లో ఓ వినియోగదారు బెంగళూరులోని పణత్తూరు ప్రాంతంలో ఒక ఫ్లాట్‌కు నెలకు రూ.70 వేల అద్దె, రూ.5 లక్షల […]

Bangalore house rent: భారతదేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు, సిలికాన్‌ సిటీగా ఖ్యాతి గడించింది. ఇక్కడి ఇంటి అద్దెలు సామాన్యులకు ఆర్థిక భారంగా మారుతున్నాయి. జీతంలో అత్యధికంగా ఇంటి అద్దెకే చెల్లించాల్సి వస్తోంది. అడ్వాన్స్‌ డిపాజిట్‌ డిమాండ్‌లు జనసామాన్యాన్ని, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులను కలవరపెడుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది.

ఇటీవల రెడిట్‌లో ఓ వినియోగదారు బెంగళూరులోని పణత్తూరు ప్రాంతంలో ఒక ఫ్లాట్‌కు నెలకు రూ.70 వేల అద్దె, రూ.5 లక్షల డిపాజిట్‌ అడుగుతున్నారని పోస్ట్‌ చేశాడు. ఈ పోస్ట్‌ ఐటీ ఉద్యోగులు, స్థానికుల మధ్య భారీ చర్చకు దారితీసింది. ట్రాఫిక్‌ సమస్యలు, వర్షంతో నీటితో నిండిపోయే రోడ్ల మధ్య ఇంత భారీ అద్దె డిమాండ్‌ చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరు ‘ఇంత అద్దె భారం ఉంటే జీవనం ఎలా సాగించగలం?‘ అని ప్రశ్నించగా, మరొకరు చమత్కారంగా ‘కార్యాలయానికి దగ్గరగా ఉంటే చిన్న గదికైనా భారీ అద్దె చెల్లిస్తారు, కానీ ట్రాఫిక్‌లో చిక్కుకుంటారు‘ అని వ్యాఖ్యానించారు. ఇక పణత్తూరులో సగటు అద్దె రూ.41 వేలు ఉండగా, రూ.70 వేల అని పేర్కొనడంపై స్థానికులు అభ్యంతరం తెలుపుతున్నారు.

అద్దెల పెరుగుదలకు కారణాలు
బెంగళూరులో ఇంటి అద్దెలు గతంలో ముంబై, ఢిల్లీలతో పోలిస్తే సాపేక్షంగా తక్కువగా ఉండేవి. అయితే, కొవిడ్‌–19 మహమ్మారి తర్వాత పరిస్థితులు గణనీయంగా మారాయి. ఈ అద్దెల పెరుగుదలకు కొన్ని కీలక కారణాలు ఉన్నాయి.

– కోవిడ్‌ తర్వాత ఐటీ సంస్థలు కార్యాలయాలకు తిరిగి రావాలని ఉద్యోగులను కోరడంతో, బెంగళూరుకు తిరిగి వచ్చే ఉద్యోగుల సంఖ్య పెరిగింది. ఇది గృహాల డిమాండ్‌ను పెంచింది.

– ఇళ్ల నిర్మాణం తగ్గడంతో సరఫరా డిమాండ్‌కు సరిపడటం లేదు, ఫలితంగా అద్దెలు పెరిగాయి.

– రద్దీగా ఉండే రోడ్లు, ట్రాఫిక్‌ సమస్యల కారణంగా ఉద్యోగులు కార్యాలయాలకు సమీపంలో ఉండేందుకు ఎక్కువ అద్దెలు చెల్లించడానికి సిద్ధపడుతున్నారు.

– స్థానికుల అభిప్రాయం ప్రకారం, మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా అద్దెలు పెరుగుతాయని, ఇది సహజమైన ఆర్థిక ఒడిదుడుకుల ఫలితమని చెబుతున్నారు.

డిపాజిట్‌ భారం
మల్లేశ్వరం వంటి ప్రాంతాల్లో త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌లకు రూ.లక్షకు పైగా అద్దె ఉండగా, 11 నెలల డిపాజిట్‌ వసూలు సాధారణమైంది. ఇంటిని ఖాళీ చేసేటప్పుడు రిపేర్, పెయింటింగ్‌ ఖర్చుల పేరుతో డిపాజిట్‌లోంచి ఒక నెల అద్దె మొత్తాన్ని కోతపెట్టడం సర్వసాధారణంగా మారింది. ఇది అద్దెదారులకు అదనపు ఆర్థిక భారంగా పరిణమిస్తోంది. బెంగళూరు ఐటీ రాజధానిగా ఉండటం వల్ల ఆర్థిక అవకాశాలు ఎన్నో అందిస్తున్నప్పటికీ, ఇంటి అద్దెల భారం సామాన్యులకు, ఐటీ ఉద్యోగులకు సవాలుగా మారింది. సోషల్‌ మీడియా చర్చలు ఈ సమస్య యొక్క తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper