పరిషత్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్

కొత్త ఎస్ఈసీ నీలం సాహ్ని వచ్చారు. వచ్చిన మొదటిరోజే జగన్ సర్కార్ ఆశించినట్టు పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. వారం రోజుల్లో పూర్తయ్యేలా షెడ్యూల్ చేశారు. ఈ నెల 8న పోలింగ్ ఉండగా.. హైకోర్టు బ్రేక్ వేసింది. ఏపీలో పరిషత్ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్.ఈ.సీ ఇచ్చిన నోటిఫికేషన్ పై స్టే విధించింది.తెలుగుదేశం పార్టీ దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు […]

Written By: NARESH, Updated On : April 6, 2021 6:17 pm
Follow us on

కొత్త ఎస్ఈసీ నీలం సాహ్ని వచ్చారు. వచ్చిన మొదటిరోజే జగన్ సర్కార్ ఆశించినట్టు పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. వారం రోజుల్లో పూర్తయ్యేలా షెడ్యూల్ చేశారు. ఈ నెల 8న పోలింగ్ ఉండగా.. హైకోర్టు బ్రేక్ వేసింది.

ఏపీలో పరిషత్ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్.ఈ.సీ ఇచ్చిన నోటిఫికేషన్ పై స్టే విధించింది.తెలుగుదేశం పార్టీ దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోడ్ విధించలేదని ఆక్షేపించింది.

ఏపీలో పరిషత్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 8వ తేదీన ఎన్నికలు నిర్వహించడానికి ఏపీ ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. అయినా కూడా హైకోర్టు ఎన్నికలను నిలిపివేయడం సంచలనమైంది. ఈనెల 15న ఎస్ఈసీ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

మరో రెండు రోజుల్లో ఎన్నికలు అనగా ఏపీ హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులు ఏపీ సర్కార్ కు షాకింగ్ గా మారాయి.. ప్రభుత్వం దీనిపై ఏం చేస్తుందన్నది ఉత్కంఠగా మారింది.