Karnataka CM Swearing Ceremony: వీరిని వద్దనుకుంటున్న కాంగ్రెస్

2023లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ఘడ్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో ఆప్ చాలా కాలంగా క్రియాశీలంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఈ రాష్ట్రాల్లోనూ తమ ఓటు బ్యాంకుకు గండి పడుతుందని కాంగ్రెస్ ఆందళన చెందుతున్నది.

Written By: NARESH, Updated On : May 19, 2023 5:43 pm

Karnataka CM Swearing Ceremony

Follow us on

Karnataka CM Swearing Ceremony: సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారాన్ని గ్రాండ్‌గా చేయడం ద్వారా విపక్షాల ఐక్యతను చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే తన సమీకరణలకు పొంతన లేని పార్టీలను, నేతలను పక్క పెట్టేందకు సిద్ధమైంది.

మే 20న కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గేట్ ఆఫ్ సౌత్ అని పిలుచుకునే కర్ణాటకలో కాంగ్రెస్ 135 సీట్లతో అఖండ విజయం సాధించింది. 2023లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ విజయం కాంగ్రెస్‌కు బూస్ట్ ఇచ్చినట్లయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నేతలకు ఆహ్వానాలు పంపింది. విపక్షాల బల నిరూపణగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఆహ్వానం పంపలేదు. రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ఈ పార్టీలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

కర్నాటకలో కాంగ్రెస్ సాధించిన ఈ విజయం బీజేపీ అధికారం నుంచి గద్దె దించడమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న హస్తం కార్యకర్తలు, మద్దతుదారులను ఉత్తేజపరిచింది. ఈ విజయం 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నాయకులను ఉత్తేజపరిచేందుకు కూడా ఉపయోగపడుతుందని కాంగ్రెస్ థింక్ ట్యాంక్ అభిప్రాయపడింది. సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారాన్ని గ్రాండ్‌గా చేయడం ద్వారా విపక్షాల ఐక్యతను చాటాలని కాంగ్రెస్ కూడా భావిస్తోంది.

– ఆహ్వానం అందుకున్నది వీరే..
– బీహార్ సీఎం నితీష్ కుమార్
-బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్
-తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ – జార్ఖండ్సీఎం హేమంత్ సోరెన్
-పీడీపీ చీఫ్ మెహబూబా ముస్తీ
-సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా –
-సీపీఐ (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
– బెంగాల్ సీఎం మమతా బెనర్జీ –
– ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్
– NCP అధినేత శరద్ పవార్
– మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే –
నటుడు మరియు MNM అధినేత కమల్ హాసన్
ఆహ్వానం అందని వారు
– ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్
– తెలంగాణ సీఎం కేసీఆర్
– కేరళ సీఎం పీ విజయన్
– ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి
– ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్

రాజకీయ ప్రాధాన్యతాంశాలివే..

1- ఢిల్లీలో పీక్ నుంచి జీరోకు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ వాల్ కు కాంగ్రెస్ ఆహ్వానం పంపలేదు. 2024 ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై కసరత్తు చేస్తున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ రెండు చోట్లా అధికారంలో ఉంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఆప్ ను దూరం పెడతున్నది. అందుకు కారణాలివే. ఢిల్లీ, పంజాబ్ లలో కాంగ్రెస్ అధికారం నుంచి దూరం కావడానికి ఆప్ కారణమైంది. పదిహేనేళ్లు అధికారంలో ఉన్న ఢిల్లీలో 2013 ఎన్నికలు కాంగ్రెస్ ను దెబ్బతీశాయి. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ రాజధాని ఎన్నికల రాజకీయాల్లో ప్రవేశించి 28 సీట్లు గెలుచుకుంది. 2008లో 43 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 8 సీట్లకు పడిపోయింది. 2015లో మళ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఆప్ గ్రాఫ్ 67 స్థానాలకు చేరుకుంది. బీజేపీకి 3 సీట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ జీరో కు చేరింది. ఢిల్లీలో 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది.

2- పంజాబ్ లోనూ అదే పరిస్థితి..

2017 ఎన్నికల్లో పంజాబ్లో కాంగ్రెస్ 77 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు ఆప్ 20 సీట్లు గెలుచుకుంది. కానీ 2022 వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆప్ 92 స్థానాలకు చేరుకోగా, కాంగ్రెస్ కేవలం 18 స్థానాలకు పడిపోయింది.

3- గుజరాత్ లోనూ దెబ్బ

2017లో గుజరాత్ లో బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. ఆ తర్వాత బీజేపీ 99 సీట్లతో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ 77 స్థానాల్లో విజయం సాధించింది. అయితే 2022లో గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దెబ్బతిన్నది. ఆప్ కేవలం 5 సీట్లు మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ పడిపోవడానికి పరోక్షంగా ఆప్ కారణమైంది. 2017లో కాంగ్రెస్ కు 42.2% ఓట్లు వచ్చాయి. అదే, 2022లో 27% మాత్రమే ఉంది. ఆప్ కు 13.1% ఓట్లు వచ్చాయి.

4- గోవాలో కూడా కోత

అదేవిధంగా 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ రెండు స్థానాలను కైవసం చేసుకుంది. అంతే కాదు ఆ పార్టీకి 6.8 శాతం ఓట్లు కూడా వచ్చాయి. ఇతర రాష్ర్టాల మాదిరిగానే గోవాల్ కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చి ఆప్ తనకు పునాది వేసుకుంది.

5- వచ్చే ఎన్నికల్లో ఆప్ తో ప్రమాదమే..

2023లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ఘడ్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో ఆప్ చాలా కాలంగా క్రియాశీలంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఈ రాష్ట్రాల్లోనూ తమ ఓటు బ్యాంకుకు గండి పడుతుందని కాంగ్రెస్ ఆందళన చెందుతున్నది. బీజేపీలాగా ఆప్ ను ప్రత్యర్థిగా ఉంచి పోటీ చేయాలని కాంగ్రెస్
భావిస్తున్నది.

6- రెండు పార్టీల మధ్య చిచ్చు

ఇటీవల, మద్యం కుంభకోణంలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టయ్యారు. ఈ అరెస్టును వ్యతిరేకిస్తూ విపక్షాలన్నీ ప్రధాని మోదీకి లేఖలు రాశాయి. కానీ కాంగ్రెస్ మాత్రం మిన్నకుండి పోయింది. అరవింద్ కేజ్రీవాల్ అన్నా హాజారే ఉద్యమం నుంచి రాజకీయ పార్టీని ఏర్పాటు సమయంలో కాంగ్రెస్ అవినీతిపై దాడికి దిగారు. ఇప్పుడు ఆప్ నాయకుడు అవినీతి కేసులో జైలుకు వెళ్లిడంతో మిన్నకుండి బదులు తీర్చకుంది.

7- మూడో ఫ్రంట్ ఏర్పాటులో కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా కాంగ్రెస్ ఆహ్వానం పంపలేదు. నిజానికి 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీ, కాంగ్రెస్ లేకుండా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో ఈ ఏడాది ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ కేసీఆర్ కాంగ్రెస్ ప్రత్యక్ష పోరు సాగిస్తోంది. 2018 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ. అప్పుడు కేసీఆర్ కు 47.4 శాతం ఓట్లతో 88 సీట్లు రాగా, కాంగ్రెస్ 28.7 శాతం ఓట్లతో 19 సీట్లు గెలుచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కూడా కేసీఆర్ ను ప్రధాన ప్రతిపక్షంగా చూస్తున్నది. ఇది మాత్రమే కాదు, మహారాష్ట్రలో తన పార్టీని విస్తరించనున్నట్లు కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. కేసీఆర్ తన ప్రయత్నంలో ఫలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ కు నష్టం తప్పదు.

మరో వైపు కేరళ, ఏపీ సీఎంలకు కూడా కాంగ్రెస్ ఆహ్వానం పంపలేదు. కేరళలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం. ఇక ఏపీ సీఎం బీజేపీతో అంటకాగుతున్నాడు. అలాగే ఒడిశా సీఎం పట్నాయక్కు కూడా ఆహ్వానం అందలేదు.

అలాగే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు కూడా ఆహ్వానం అందలేదు. నిజానికి, విపక్షాల ఐక్యత సాధనలో నిమగ్నమైన బీహార్ సీఎం నితీశ్ కుమార్‌ను పట్నాయక్ ఇటీవల కలిశారు.. తాను ఎలాంటి కూటమిలో చేరబోనని ఒకరోజు తర్వాత స్పష్టం చేసినా. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ బీజేడీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు.

-శెనార్తి