Homeజాతీయ వార్తలుస్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్


కరోనా మహమ్మారి లాక్ డౌన్ నేపథ్యంలో సుదూర ప్రాంతాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులతో పాటు పర్యాటకులు, విద్యార్థులు తమతమ సొంతూళ్లకు వెళ్లవచ్చని కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు వారికి ఏర్పాట్లు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖరాసింది.

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ మరో నాలుగు రోజుల్లో ముగుస్తుందనగా కేంద్ర హోంశాఖ అంతరాష్ట్ర ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. లాక్‌డౌన్ వల్ల పలు ప్రాంతాల్లో వలస కార్మికులు, పర్యాటకులు, విద్యార్థులు చిక్కుకుపోయారు.

వాళ్లను తమ తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతించండి. ఇందుకోసం ప్రతి రాష్ట్రం నోడల్ అధికారులను నియమించాలి. ఎవరెవరిని పంపిస్తున్నారు? ఎవరెవరిని అనుతిస్తున్నారన్న వివరాలను నమోదు చేయాలని సూచించింది.

ఒకవేళ పక్క రాష్ట్రాలకు వెళ్లేవారు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వారుంటే.. ఆయా రాష్ట్రాల పరస్పరం సంప్రదింపులు జరుపుకోవాలి. పరస్పర ఒప్పందంతో రోడ్డు మార్గంలో వారిని తరలించాలి. సొంతూళ్లకు వెళ్లే వారిని విధిగా స్క్రీనింగ్ చేయాలి. ఎటువంటి కరోనా లక్షణాలు లేకుంటేనే అనుమతించాలి.

సమూహంగా వెళ్లేవారిని బస్సుల్లో తరలించాలి. బస్సును శానిటైజ్ చేయడంతో పాటు సీటింగ్ విషయంలో సామాజిక దూరం పాటించాలి. సొంత ప్రాంతాలకు చేరుకున్న తర్వాత వారిని స్థానిక అధికారులు స్క్రీనింగ్ చేసి హోం క్వారంటైన్ చేయాలి. వారంతా ఆరోగ్యసేతు యాప్ ద్వారా నిత్యం ఆరోగ్య వివరాలను నమోదు చేయాలి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Nara Lokesh: సాక్షి.. పాడిందే పాట.. లోకేష్ మీద తేల్చుకోవాల్సింది కోర్టులో..

Nara Lokesh: ఒక తప్పు జరిగింది. ఆ తప్పును ఆధారాలతో సహా నిరూపించాలి అంటే మన దగ్గర దమ్ము ఉండాలి. అన్నిటికి మించి సాక్షాలు ఉండాలి. ఆ తర్వాత కోర్టు దాకా వెళ్లాలి....

August School Holidays: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు..!

August School Holidays: సాధారణంగా విద్యార్థులకు సెలవులు అంటే చాలా ఇష్టం. పాఠశాలలకు వరుసగా సెలవులు వస్తున్నాయంటే వారిలో సరదా వేరు. అటువంటి సరదా తెచ్చింది ఆగస్టు నెల. ఒకటి కాదు రెండు...

Delhi Protests: సీజేపీ నిరసనల వెనుక రెజీమ్‌ చేంజ్‌ వ్యూహాలు.. అలర్ట్‌ కాకుంటే ఆ దేశాల గతే!

Delhi Protests: ఢిల్లీలో ఇటీవల జరిగిన నిరసనలు కేవలం సాధారణ ప్రజా ఉద్యమం కాదని, వ్యవస్థీకృత రెజీమ్‌ చేంజ్‌ ప్రయత్నంగా చూడాల్సిన అవసరం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శాంతియుత మార్గాల ద్వారా...

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం పై రీల్స్.. ఏపీ ప్రభుత్వం సంచలనం!

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం పై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. పాఠశాల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు.. ఈనెల 26 నుంచి విద్యార్థులకు రకరకాల పోటీలు...

Team India Test Cricket: ఈ గాయపడ్డ సింహాలను నమ్ముకుంటే.. లంకా దహనం అయినట్టే..

Team India Test Cricket: వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా చెప్పుకునే స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. అలాగని రెడ్ బార్ ఫార్మాట్లో అదరగొట్టడం లేదు.. కాకపోతే వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్...
Oktelugu Epaper
Exit mobile version