కరోనా, లాక్‌డౌన్ లతో ఐటీకి గడ్డు కాలమే

కరోనా వైరస్, లాక్‌డౌన్ పరాభవాలతో దేశీయ ఐటీ రంగంకు గడ్డు కాలమే అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నా.. విదేశీ ఎగుమతులపైనే ఎక్కువగా ఆధారపడ్డ భారతీయ ఐటీ రంగానికి కరోనా కష్టాలు తప్పడం లేదు. ఈ ఏడాది ఐటీ రంగ వృద్ధి స్థిరంగానో లేదంటే ప్రతికూలంగానో ఉండవచ్చని ఇన్ఫోసిస్ లిమిటెడ్ మాజీ సీఎఫ్‌వో వీ బాలకృష్ణన్ అంచనా వేస్తున్నారు. 2008లో తలెత్తిన ప్రపంచ ఆర్థిక మాంద్యం కంటే ఇప్పుడున్న పరిస్థితులు భయానకంగా […]

Written By: Neelambaram, Updated On : April 5, 2020 11:51 am
Follow us on


కరోనా వైరస్, లాక్‌డౌన్ పరాభవాలతో దేశీయ ఐటీ రంగంకు గడ్డు కాలమే అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నా.. విదేశీ ఎగుమతులపైనే ఎక్కువగా ఆధారపడ్డ భారతీయ ఐటీ రంగానికి కరోనా కష్టాలు తప్పడం లేదు. ఈ ఏడాది ఐటీ రంగ వృద్ధి స్థిరంగానో లేదంటే ప్రతికూలంగానో ఉండవచ్చని ఇన్ఫోసిస్ లిమిటెడ్ మాజీ సీఎఫ్‌వో వీ బాలకృష్ణన్ అంచనా వేస్తున్నారు.

2008లో తలెత్తిన ప్రపంచ ఆర్థిక మాంద్యం కంటే ఇప్పుడున్న పరిస్థితులు భయానకంగా ఉన్నాయని బాలకృష్ణన్ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు సహితం 2008 కంటే దారుణంగా కనిపిస్తుండటం గమనార్హం. నాటి మాంద్యం తర్వాత కూడా దేశీయ ఐటీ కంపెనీలు కొంత వృద్ధిరేటును కనబరిచాయని, త్వరగా కోలుకున్నాయని కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించట్లేదని ఈ రంగ నిపుణులు ఆందోళన .

సింగపూర్ లాంటి దేశాల్లోనూ లాక్‌డౌన్ పరిస్థితులు కనిపిస్తుండడంతో భారతీయ ఐటీ సంస్థల ైక్లెయింట్లు పెట్టుబడులను భారీగా తగ్గించుకునే వీలున్నదని, ఇప్పటికే సిద్ధమైన పెట్టుబడులనూ వెనక్కి తీసుకోవచ్చని భావిస్తున్నారు.

అంతర్జాతీయ సంస్థలు ముఖ్యంగా భారత్‌లో వ్యాపార కార్యకలాపాలను నిర్వర్తిస్తున్న సంస్థలు తమ ఉద్యోగులకు అభయమిచ్చాయి. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ మధ్య ఉద్యోగాలకు వచ్చిన భయమేమీ లేదన్నాయి. పలు సంస్థలు ఈ విపత్కర పరిస్థితులు మూడు నెలలున్నా.. భయపడవద్దని చెప్పాయి. మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఏకంగా ఏడాదిపాటు ఉద్యోగ కోతల జోలికి వెళ్లబోమని హామీ ఇవ్వడం గమనార్హం.

ఎస్‌ఏపీ, సేల్స్‌ఫోర్స్, బూజ్ అల్లెన్ హామిల్టన్ సంస్థలు 90 రోజులు ఇదే పరిస్థితులున్నా ఉద్యోగులకు వచ్చిన ముప్పేమీ లేదన్నాయి. అయితే వెల్స్ ఫర్గో, జేపీ మోర్గాన్, సిటీ గ్రూప్, హెచ్‌ఎస్‌బీసీ, డ్యూషే బ్యాంక్, క్రెడిట్ సూసీ, స్టార్‌బక్స్, పేపాల్, పాలో ఆల్టో నెట్‌వర్క్స్ మాత్రం ఇప్పటికెలా ఉన్నా.. భవిష్యత్తుపై భరోసా ఇవ్వడం లేదు. ఉద్యోగాల హామీ ఇవ్వలేకున్నా.. ఉద్యోగుల్ని కాపాడుకుంటామని చెప్తున్నాయి.

గూగుల్, అమెజాన్, వాల్‌మార్ట్ వంటి సంస్థలు కరోనా ప్రభావిత ఉద్యోగాల తొలగింపు ఉండవని స్పష్టం చేశాయి. తమ నగదు నిల్వల్ని ఈ కష్టకాలంలో జీతాలకు వాడుతున్నాయి.

ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్ పెను బీభత్సాన్నే సృష్టిస్తున్నది. కరోనా మృతులు లక్షకు పరిమితమైతే మనం అదృష్టవంతులమేనన్న అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలనుబట్టి అక్కడ కరోనా విలయాన్ని అంచనా వేసుకోవచ్చు. అయితే భారత ఐటీ రంగానికి అతిపెద్ద విదేశీ కస్టమర్ అమెరికానే. అలాంటి దేశం ఇప్పుడు కరోనా కాటుకు బలైపోతున్నది. ఈ ప్రభావం దేశీయ ఐటీ రంగంపైనా తప్పక ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

రిటైల్, ఆర్థిక సేవలు తదితర కీలక రంగాలన్నింటిపైనా కరోనా ప్రభావం గట్టిగా కనిపిస్తున్నదని, నిరుద్యోగం పెరిగిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టులు తగ్గి వాటి ధరలు కూడా పడిపోయే వీలుందని చెబుతున్నారు. ఐరోపా దేశాల్లోనూ కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తుండటం భారతీయ ఐటీ పరిశ్రమకు శరాఘాతమవుతున్నది.