Homeజాతీయ వార్తలుMarriage Scam In Uttar Pradesh: పెళ్ళి చేస్తామంటే ఎగిరి గంతులు వేశారు.. చివరికి ఈ...

Marriage Scam In Uttar Pradesh: పెళ్ళి చేస్తామంటే ఎగిరి గంతులు వేశారు.. చివరికి ఈ ప్రసాదుల పరిస్థితి ఇలా అయిపోయింది..

Marriage Scam In Uttar Pradesh: బెండకాయ ముదిరినా.. బ్రహ్మచారి ముదిరినా దేనికి పనికిరారు అంటారు. పాపం వీరి పరిస్థితి కూడా అలానే ఉంది. వయసు 30 దాటినా సరే పెళ్లి కాకపోవడంతో.. వారిలో ఆందోళన మొదలైంది. ఏం చేయాలో తెలియడం లేదు. విద్యార్హత.. ఉద్యోగం.. ఆస్తి వంటివి ఉన్నప్పటికీ వారికి పెళ్లిళ్లు కావడం లేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసిన ఉపయోగం ఉండడం లేదు. దీంతో పెళ్లిళ్ల పేరయ్యల దగ్గరికి చెప్పులు అరిగేలా తిరిగినప్పటికీ కల్యాణ తంతు జరగడం లేదు.

ఎడారిలో తిరుగుతున్న వాడికి ఓయాసిస్ తగిలినట్టు.. పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వారికి కొందరు తారసపడ్డారు. పెళ్లి చేస్తామని చెప్పారు. ఖర్చులకు 15000 ఇస్తే చాలు అన్నారు. అందమైన అమ్మాయిలు మీకోసం సిద్ధంగా ఉన్నారు అని చెప్పారు. దీంతో ఆ బ్రహ్మచారులు ఎగిరి గంతులు వేశారు. కళ్యాణం జరుగుతోందని సంబరపడ్డారు. ఖరీదైన బట్టలు కొనుక్కున్నారు. బంగారం.. ఇతర వస్తువులు కూడా కొనుగోలు చేశారు. సరిగ్గా ఆరోజు రానే వచ్చింది. నిర్వాహకులు చెప్పిన వేదిక వద్దకు గుర్రాల మీద ఆ పెళ్ళికొడుకులు గా ముస్తాబై ఆ యువకులు వచ్చేసారు. కానీ అక్కడ ఎటువంటి ఏర్పాట్లు లేవు. దీంతో ఆ యువకులలో ఆందోళన పెరిగిపోయింది.

నిర్వాహకులను అడుగుదామంటే వారు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టారు. ఈ విచారణలో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ఎందుకంటే ఆ నిర్వాహకులు చెప్పినట్టు అదేమీ నిజమైన పెళ్లి వేడుక కాదు. మోసం చేసేందుకు వారంతా ఈ ప్రణాళిక రూపొందించారు. ఏకంగా 42 మంది యువకుల వద్ద 15 వేల చొప్పున వసూలు చేశారు. చివరికి ప్లేటు ఫిరాయించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దేవాస్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల అదుపులో నిందితులు ఉన్నారు.

ఈ సంఘటన ఉత్తర భారత దేశంలో అమ్మాయిల కొరత ఏ స్థాయిలో ఉందో నిరూపిస్తోంది. చాలా రాష్ట్రాలలో అమ్మాయిలు లేక యువకులు పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. వివాహాలు జరగని వారిని లక్ష్యంగా చేసుకొని మోసగాళ్లు ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా మోసాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఎవరిని నమ్మాలో కూడా అర్థం కావడం లేదని యువకులు వాపోతున్నారు. పెళ్లి జరుగుతుంది అంటే డబ్బులు చెల్లించామని.. చివరికి పరిస్థితి ఇంత దారుణంగా మారిపోయిందని వారు చెబుతుండడం ఆవేదన కలిగిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular