spot_img
Homeజాతీయ వార్తలుDhruv Sharma: విలువైన ప్రాపర్టీ.. నెలవారీ రిటర్న్స్.. చూస్తుండగానే 500 కోట్లు.. అసలు కథ వేరే...

Dhruv Sharma: విలువైన ప్రాపర్టీ.. నెలవారీ రిటర్న్స్.. చూస్తుండగానే 500 కోట్లు.. అసలు కథ వేరే ఉంది భయ్యా!

Dhruv Sharma: మోసపోయేవాడు ఉన్నప్పుడు.. మోసం చేసేవాడు కూడా ఉంటాడు. మోసపోయే వాడికి తెలివి ఉండదు. మోసం చేసేవాడికి తన పర బేధం ఉండదు. ఆ సమయానికి నాలుగు మాయమాటలు చెబుతాడు. మోసం చేసి వెళ్ళిపోతుంటాడు. అయితే మోసం చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. అందులో ఇతడు పిహెచ్డి చేశాడు అనుకుంటా. ఏకంగా 500 కోట్లు మాయం చేశాడు.

దేశ రాజధాని ఢిల్లీకి దగ్గరలో ఉంటుంది హర్యానా. ఈ రాష్ట్రం మీదుగా అనేక జాతీయ రహదారులు వెళుతూ ఉంటాయి. పైగా ఢిల్లీలో కాలుష్యం ఎక్కువగా ఉండడంతో చాలామంది హర్యానాలో ప్రాపర్టీలుకొని నివాసాలు నిర్మించుకుంటున్నారు. అక్కడే నివాసం ఉంటున్నారు. అందువల్లే కొంతకాలంగా హర్యానాలో రియల్ ఎస్టేట్ మార్కెట్ విపరీతంగా పెరుగుతోంది.

హర్యానా రాష్ట్రంలో గురు గ్రామ్ చాలా ఫేమస్. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో 32nd Avenue పేరుతో ఓ కంపెనీ ఏర్పాటు అయింది. ఆ కంపెనీకి సీఈవోగా ధృవ్ దత్ శర్మ వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో కొంతమందికి మాయమాటలు చెప్పాడు. విలువైన వెంచర్ వేస్తున్నామని అన్నాడు. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల రెట్టింపు లాభం వస్తుందని చెప్పాడు. మొత్తంగా గొలుసు కట్టు స్కీమును అమలు చేశాడు. ఒక్కొక్కరి దగ్గర నుంచి భారీగా డబ్బులు తీసుకున్నాడు. మొదట్లో కొంతమందికి సరిగానే వడ్డీ చెల్లించాడు. ఆ తర్వాత చాలామందికి నమ్మకం ఏర్పడడంతో పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే భారీగా పెట్టుబడి లభించింద.. అప్పుడే శర్మ వేరే దారి ఎంచుకున్నాడు. మొత్తంగా 500 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. గురు గ్రామ్ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. అతడు చేసిన మోసాన్ని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏకంగా చాలా మంది దగ్గర అతడు ఈ స్థాయిలో డబ్బులు వసూలు చేశాడని తెలుస్తోంది. బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతడి గురించి ఆరా తీస్తున్నారు. అయితే ఇతడికి రాజకీయంగా అండదండలు ఉన్నాయని… అందువల్లే ఈ స్థాయిలో దోపిడికి పాల్పడ్డాడని తెలుస్తోంది. వాస్తవానికి ఇతడి కంపెనీకి ఎటువంటి ఆస్తులు లేవని.. వాటికి భారీగా విలువ ఉందని చెప్పడం కూడా మోసమని పోలీసుల దర్యాప్తులో తేలింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Chennai Love Story Twitter Talk: ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్విటర్ టాక్ ఇదే..ఇలాంటి రెస్పాన్స్ అసలు ఊహించలేదు..

Chennai Love Story Twitter Talk: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ...

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్…

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే...

Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ ఫుల్ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా? ఫట్టా?

Chennai Love Story Movie Review: 'క' సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత కే ర్యాంప్ సినిమాతో సైతం ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మరోసారి 'చెన్నై...

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Oktelugu Epaper
Exit mobile version