జాతీయ వార్తలుDelhi Blast Red Fort Explosion : ఢిల్లీలో పేలుడుకు ముందు ఏం జరిగింది.. షాకింగ్...

Delhi Blast Red Fort Explosion : ఢిల్లీలో పేలుడుకు ముందు ఏం జరిగింది.. షాకింగ్ నిజాలు వెలుగులోకి

Delhi Blast Red Fort Explosion ఢిల్లీలో ప్రస్తుతం వాతావరణం చలిగా ఉంది. పైగా ఇక్కడ కాలుష్యం తీవ్రస్థాయిలో ఉండడంతో.. ప్రతిరోజు దీని గురించే అక్కడ చర్చ జరుగుతోంది. కాలుష్యం మినహా మిగతా వ్యవహారాలు ఢిల్లీలో సాఫీగానే సాగిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో దేశ రాజధానిలో ఒక్కసారిగా ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఎవరూ అంచనా వేరని దారుణం జరిగింది.. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ వద్ద సంభవించిన పేలుడు పెను ప్రకంపనలు సృష్టించింది. ఈ పేలుడులో 8 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో ఒక డెలివరీ బాయ్ శరీరం మొత్తం గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది.

ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద ఓ కారును నిలిపి ఉంచారు.. అది ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది.. ఆ తర్వాత మంటలు అమాంతం ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల ఉన్న వాహనాలకు అంటుకున్నాయి. చూస్తుండగానే ఆ ప్రాంతం మొత్తం అత్యంత భయానకంగా మారిపోయింది.. 8 మంది చనిపోవడం.. 20 మంది గాయపడడంతో పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి వచ్చారు.. 7 ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పడానికి అనేక రకాలుగా ప్రయత్నించాయి. గంటల తరబడి శ్రమించిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి.. గాయపడిన వారిని లోక నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి తరలించారు.. అక్కడ సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.. ఈ ఘటన జరిగిన వెంటనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేరుగా రంగంలోకి దిగారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ తో మాట్లాడారు. ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తో మాట్లాడారు. ఈ పేలుడు వల్ల 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఘటన జరిగిన తర్వాత ఢిల్లీ పోలీసులు, క్లూస్ టీం బృందాలు ఘటన స్థలానికి వచ్చాయి. బాంబ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆ ప్రాంతాలను అత్యంత క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి.

సోమవారం సాయంత్రం 6:55 నిమిషాల ప్రాంతంలో ఈ దారుణం జరిగిందని తెలుస్తోంది. పేలుడు జరిగిన వెంటనే అగ్ని మాపక శాఖకు కొంతమంది ఫోన్ చేశారు. వెంటనే ఫైర్ ఇంజన్లు రంగంలోకి వచ్చాయి. ఆ తర్వాత పోలీసులు కూడా క్షేత్రస్థాయికి వచ్చారు… దేశ రాజధానిలో పేలుడు జరిగిన తర్వాత.. కేంద్ర హోం శాఖ వెంటనే అప్రమత్తమైంది. దేశ రాజధాని ఢిల్లీలో పాటు, చుట్టుపక్కల ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ఈ పేలుడు తర్వాత సమీపంలో ఉన్న సిసి కెమెరాలు పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే సోమవారం ఎర్రకోట సందర్శనకు సెలవు దినం కావడంతో భారీగా ప్రాణనష్టం తప్పింది.. లేకపోతే పరిస్థితి మరో విధంగా ఉండేది..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Amit Shah : అమిత్‌షా జోర్‌కా జట్కా… సైలెంట్‌గా చెక్‌ పెడుతున్నాడు

Amit Shah : ఒక కూల్‌ డ్రింక్‌ వాణిజ్య ప్రకటనలో వచ్చిన క్యాప్షన్‌ ఇలా ఉండేది – జోర్‌కా జట్కా తీరేసే లాగా. అంటే బలమైన దెబ్బ, కానీ మెత్తగా, నిశ్శబ్దంగా తగిలి,...

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...
Exit mobile version