spot_img
Homeజాతీయ వార్తలుNEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్ చేస్తుంటారు. ఇలా ఎవరికివారు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. ఇదంతా కూడా నీట్ పేపర్ లీకేజీ.. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి అని చేపట్టే ఆందోళనలో భాగంగా చేస్తున్న నినాదాలు.

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో న్యాయం జరగాలని చేస్తున్న ఆందోళనలో ఇటువంటి నినాదాలు చేయడం నిజంగా ఆశ్చర్యకరం. పైగా దేశంలో మూడు రాష్ట్రాలలో ఓటు హక్కు కలిగి ఉన్న ప్రకాష్ రాజ్ లాంటి నటుడు జైశ్రీరామ్ అనను అంటూ అదే వేదిక మీద చెబుతుంటాడు. ఇటువంటి వ్యక్తులు స్టూడెంట్స్ కు సపోర్ట్ గా ఉంటారా. దీనికితోడు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ముందుగా నిరసన శిబిరంలో విద్యార్థులను రెచ్చగొట్టారు. కచ్చితంగా పార్లమెంటు ముట్టడికి రావాలని పిలుపునిచ్చారు.

వచ్చిన విద్యార్థులలో నీట్ బాధితులు లేకపోవడం విశేషం. పైగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాత్రమే అక్కడ కనిపించారు. వారంతా కూడా పోలీసుల మీదికి రాళ్లు రువ్వారు. అంతేకాదు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. పోలీసులకు ఓపిక నశించి లాఠీ చార్జ్ చేశారు. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు అక్కడ కనిపించలేదు. నిరసనకు పిలుపునిచ్చినవారు.. ఆందోళనలు చేద్దామని చెప్పినవారు అక్కడ మచ్చుకు కూడా కనిపించలేదు. కేవలం కొంతమంది మాత్రమే ఆ ఆందోళనలో ముందు వరుసలో ఉన్నారు. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నారు. వారిలో చాలామందికి గాయాలయ్యాయి.

విద్యార్థుల పోరాటాన్ని హైజాక్ చేయడానికి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నిన్ననే ఎంట్రీ ఇచ్చింది. అక్రమంగా ఆప్.. టిఎంసి.. మిగతా పార్టీలు కూడా స్వరం సవరించుకోవడం మొదలుపెట్టాయి. నీట్ పేపర్ లీకేజీ గురించి నిరసనలు చేపడుతున్న కాంగ్రెస్.. తెలంగాణలో ఏం చేస్తుందో మర్చిపోతోంది. ఇటీవల కాలంలో తమకు పోలీస్ పోస్టులను పెంచాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తే వారిపై పోలీసులను ప్రయోగించింది. కేరళ రాష్ట్రంలో కూడా నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి అక్కడి విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తుంటే అక్కడి ప్రభుత్వం ఉక్కు పాదంతో తొక్కి వేసింది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాలను అమ్ముకుంది. ఇప్పటికి ఆ కేసు నడుస్తూనే ఉంది. ఇలాంటి అవకాశవాద రాజకీయ పార్టీలు విద్యార్థి ఉద్యమాన్ని తమకోసం వాడుకోవడం నిజంగా ఈ దేశం చేసుకున్న దురదృష్టం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper
Exit mobile version