జాతీయ రహదారులపై లారీల ట్రాఫిక్ జామ్?

దేశ వ్యాప్తంగా కరోనా కలకలం పుట్టిస్తున్న కారణంగా 21 రోజుల సంపూర్ణ లాక్ డౌన్ నేపథ్యంలో నిన్నమొన్నటి వరకు పూర్తి నిర్మానుష్యంగా కనిపించిన జాతీయ రహదారులపై లారీలు పరుగులు పెట్టనున్నాయి. పాసులు ఇస్తే తప్ప రవాణా వాహనాలకు అనుమతి ఉండదన్న అపోహల కారణంతో చాలామంది బుకింగ్ ‌లు చేసుకోవటానికి ఆలోచించారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కాస్త మెరుగుపడి పరిశ్రమలు లారీ సప్లై ఆఫీసులకు ఫోన్లు చేసి బుకింగ్‌ చేసుకుంటున్నాయి. పాస్‌ ల అనుమానాలపై డీజీపీ గౌతమ్‌ […]

Written By: Neelambaram, Updated On : April 13, 2020 4:05 pm
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా కలకలం పుట్టిస్తున్న కారణంగా 21 రోజుల సంపూర్ణ లాక్ డౌన్ నేపథ్యంలో నిన్నమొన్నటి వరకు పూర్తి నిర్మానుష్యంగా కనిపించిన జాతీయ రహదారులపై లారీలు పరుగులు పెట్టనున్నాయి. పాసులు ఇస్తే తప్ప రవాణా వాహనాలకు అనుమతి ఉండదన్న అపోహల కారణంతో చాలామంది బుకింగ్ ‌లు చేసుకోవటానికి ఆలోచించారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కాస్త మెరుగుపడి పరిశ్రమలు లారీ సప్లై ఆఫీసులకు ఫోన్లు చేసి బుకింగ్‌ చేసుకుంటున్నాయి.

పాస్‌ ల అనుమానాలపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెరదించారు. అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులకు రవాణా వాహనాల అనుమతులకు సంబంధించి ఫ్యాక్స్‌/రేడియో మెసేజ్ ‌ను పంపారు. అన్ని రకాల గూడ్స్‌ వాహనాలను, ఖాళీగా ఉన్నవి అయినా సరే రోడ్ల మీద తిరిగేటపుడు పోలీసులు అడ్డుకోవద్దని సూచించారు. అలాగే, పాస్ ‌లు చూపించమని కూడా వాహనదారులను డిమాండ్‌ చేయొద్దని ఆదేశించారు.

ప్రస్తుతం అన్ని రకాల గూడ్స్ వాహనాలకు అనుమతి ల‌భించింది. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటివరకు అత్యవసర సరుకులను రవాణా చేసే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంది. తాజాగా ఇతర అన్ని రకాల రవాణా వాహనాలకు కూడా అనుమతులు ఇవ్వటంతో లారీలు రోడ్లపైకి ప్రవేశిస్తున్నాయి. అయితే ఏ రకమైన గూడ్స్‌ రవాణా వాహనాల్లో అయినా కేవలం డ్రైవర్‌, క్లీనర్‌ మాత్రమే ఉండాలని, ప్రయాణికులను తరలించటాన్ని మాత్రం అనుమతించవద్దని పేర్కొన్నారు.