సీఎం సారూ.. ఇలాగైతే ఎలా..?లోకేశ్ సంచలన ట్వీట్

కరోనా కారణంగా ఏపీ బడ్జెట్ సమావేశాలను గురువారం ఒక్కరోజే నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి నెలకొన్నందున సుధీర్ఘంగా సమావేశాలు నిర్వహించే పరిస్థితి లేదని, దీంతో బడ్జెట్ పై చర్చ, ఆమోదం అన్నీ ఒక్కరోజే నిర్వహించారు. ఈ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ బైకాట్ చేసిన విషయం తెలిసిందే. అయితే గురువారం జరిగిన ఈ సమావేశంలో సీఎం జగన్ ఓ మిస్టేక్ చేశారని టీడీపీ నేత లోకేశ్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. మీరెలా ఇలా ఉంటే ప్రజలకేం […]

Written By: NARESH, Updated On : May 20, 2021 5:27 pm
Follow us on

కరోనా కారణంగా ఏపీ బడ్జెట్ సమావేశాలను గురువారం ఒక్కరోజే నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి నెలకొన్నందున సుధీర్ఘంగా సమావేశాలు నిర్వహించే పరిస్థితి లేదని, దీంతో బడ్జెట్ పై చర్చ, ఆమోదం అన్నీ ఒక్కరోజే నిర్వహించారు. ఈ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ బైకాట్ చేసిన విషయం తెలిసిందే. అయితే గురువారం జరిగిన ఈ సమావేశంలో సీఎం జగన్ ఓ మిస్టేక్ చేశారని టీడీపీ నేత లోకేశ్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. మీరెలా ఇలా ఉంటే ప్రజలకేం చెబుతారు..? అంటూ పోస్టు చేయడం సంచలనంగా మారింది.

‘ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి.. మాస్క్ తప్పని సరిగి పెట్టుకోవాలి.. భౌతిక దూరం పాటించాలని.. మీ బోర్డులతో ప్రచారం చేయిస్తున్నారు. కానీ మీరు మాత్రం మాస్క్ పెట్టుకోరా..? మీరు మాస్క్ పెట్టుకోకుండా ప్రజలకు ఏం సూచనలు ఇస్తున్నట్లు సీఎం గారు..? ’అంటూ లోకేస్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు. కరోనా ఫస్ట్ వేవ్లో చిన్న జ్వరం లాంటిదేని చెప్పిన మీరు ఇప్పుడు మరణాలు జరగడం బాధాకరమని అనడం ఏం సందేశం ఇచ్చినట్లని పేర్కొన్నారు.

సెకండ్ వేవ్లో మరణాలు సంబవించి రాష్ట్రం అల్లకల్లోలంగా మారుతుండగా మీరు చిరునవ్వులు చిందిస్తూ మాస్క్ ధరించకుండా ప్రజలకు ఏం సమాధానం చెబుతారని అన్నారు. ఇప్పటికైనా మాస్క్ వేసుకొని నలుగురికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన మీరు ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేస్తే ఎలా సీఎం గారూ.. అని ట్విటర్లో పేర్కొన్నారు.