KCR : బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ప్రతిపక్ష నేత కేసీఆర్ గత వారం రోజులుగా గాయపడడంతో ఆస్పత్రిలో చేరారు. ఆయన తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కోలుకుని ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి నిన్న పరామర్శించి ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా కదిలివచ్చి కేసీఆర్ ను పరామర్శించడం విశేషం.
Chandrababu Naidu visits KCR at Yashoda hospital pic.twitter.com/2VcT8Jm0L5
— Naveena (@TheNaveena) December 11, 2023
ప్రస్తుతం కేసీఆర్ చికిత్స పొందుతున్న సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిని చంద్రబాబు సందర్శించారు. ఆస్పత్రికి చేరుకున్న చంద్రబాబుకు అక్కడి సిబ్బందితో పాటు బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు.
చంద్రబాబు కేసీఆర్ కు ధైర్యం చెప్పారు. తుంటికి శస్త్ర చికిత్స నుంచి కోలుకుంటున్న బీఆర్ఎస్ బాస్ తో పలు విషయాలు చర్చించారు. కేసీఆర్తో బాబు ఇంటరాక్ట్ అవుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చంద్రబాబు పక్కనే కూర్చొని కేసీఆర్ ఎలా ఉన్నారని ఆరా తీయడంతో పాటు మర్యాదపూర్వకంగా పరస్పరం వ్యవహరించడం కనిపించింది.
రేవంత్ రెడ్డి మాదిరిగానే, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తన రాజకీయ ప్రత్యర్థిని అని అనుకోకుండా.. అడ్డం పెట్టుకోకుండా అవసరమైనప్పుడు కేసీఆర్కు మద్దతుగా నిలిచారు.
తొలినాళ్లలో చంద్రబాబు, కేసీఆర్ కలిసి పనిచేశారు. రాజకీయ కారణాలతో ఇటీవలి కాలంలో వీరి మధ్య విభేదాలు కనిపించినా చంద్రబాబు అవన్నీ ఈరోజు వాటిని పక్కన పెట్టేశారు. కేసీఆర్ ను పరామర్శించి తన గొప్ప మనసు చాటుకున్నారు.