ఏపీ ప్రభుత్వానికి కేంద్రం హెచ్చరిక

మన ఆదాయానికి సరిపడా అప్పులు చేయాలి.. ఆదాయంలో సగం ఈఎంఐలు, వడ్డీలు, రుణాలకు చెల్లించాలి. కానీ ఆదాయానికి మించి అప్పులు చేస్తే ఏమవుతుంది? చిప్ప చేతికి వస్తుంది. ఇప్పుడు ఏపీ రుణపరిమితికి మించి అప్పులు చేస్తోందని.. మించితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థంగా మారడం ఖాయమన్న హెచ్చరికలను కేంద్రం చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీ నేత పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రెజరీ విభాగం నుంచి నిధుల నిర్వహణ.. ఆర్థిక నిర్వహణలో […]

Written By: NARESH, Updated On : July 10, 2021 3:37 pm
Follow us on

మన ఆదాయానికి సరిపడా అప్పులు చేయాలి.. ఆదాయంలో సగం ఈఎంఐలు, వడ్డీలు, రుణాలకు చెల్లించాలి. కానీ ఆదాయానికి మించి అప్పులు చేస్తే ఏమవుతుంది? చిప్ప చేతికి వస్తుంది. ఇప్పుడు ఏపీ రుణపరిమితికి మించి అప్పులు చేస్తోందని.. మించితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థంగా మారడం ఖాయమన్న హెచ్చరికలను కేంద్రం చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీ నేత పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ట్రెజరీ విభాగం నుంచి నిధుల నిర్వహణ.. ఆర్థిక నిర్వహణలో ఏర్పాటు చేసిన అకౌంటింగ్ నిబంధనలు మరియు విధానాలను ఉల్లంఘించించవద్దని కేంద్ర ం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. టీడీపీ సీనియర్ లీడర్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ పయ్యావుల కేశవ్ తాజాగా వైసీపీ ప్రభుత్వం ఆర్థిక తీరుతెన్నులపై విరుచుకుపడ్డారు.

ప్రభుత్వంపై వివిధ ప్రయోజనాల కోసం 41000 కోట్ల రూపాయలకు పైగా చెల్లింపులు జరపడం లేదని పయ్యావుల కేశవ్ ఫిర్యాదు చేశారు. ఏపీ చీఫ్ సెక్రటరీ , ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్థిక నిర్వహణ సరిగ్గా చేయడం లేదని.. వివిధ సంస్థల పీడీ ఖాతాలకు నిధులు బదిలీ చేయాలని కేంద్రం స్పష్టం చేసినప్పటికీ.. అకౌంటింగ్ నిబంధనలు ఉల్లంఘించడాన్ని కేంద్రం చాలా తీవ్రంగా పరిగణించింది.

ఏపీ ప్రభుత్వం ఎఫ్ఆర్.బీఎం పరిమితి చట్టాన్ని ఉల్లంఘించి.. ఈ ఏడాది బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.17వేల కోట్ల అదనపు రుణాలు తీసుకున్నందుకు కేంద్రం ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

అనుమతించదగిన పరిమితుల కంటే ఎక్కువ, అంతకంటే ఎక్కువ రుణాలు పొందడానికి ఈ సంవత్సరానికి ఏపీ రుణ పరిమితిని తగ్గించనున్నట్టు కేంద్రం తెలిపింది.