Homeజాతీయ వార్తలుMLC Kavitha - CBI: కవితను వెంటాడుతున్న సీబీ‘ఐ’.. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మరోషాక్‌!

MLC Kavitha – CBI: కవితను వెంటాడుతున్న సీబీ‘ఐ’.. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మరోషాక్‌!

MLC Kavitha – CBI: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీబీఐ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఎమ్మెల్సీ కవితను నీడలా వెంటాడనుందా.. సాక్షి నుంచి తానూ నిందితురాలినే అని ఒప్పించనుందా.. ఈమేరకు సీబీఐ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. నిన్నటి వరకు 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి కేవలం సాక్షిగానే పరిగణించిన సీబీఐ.. తాజాగా సీఆర్పీసీ 91 కింద నోటీసులు ఇచ్చి షాక్‌ ఇచ్చింది. సాక్షిగా స్టేట్‌మెంట్‌ రికార్డు చేస్తున్న సమయంలో ఆమె చెప్పిన వివరాల ఆధారంగా కవిత వద్ద ఢిల్లీ లిక్కర్‌ కేసుకు సంబంధించిన బలమైన ఆధారాలు ఉన్నట్లు సీబీఐ భావిస్తుందని సమాచారం. అందుకే 91 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చినట్లు సీబీఐ వర్గాలు చెబుతున్న మాట. దీంతో త్వరలోనే కవితను సీబీఐ మళ్లీ విచారించనున్నట్లు తెలుస్తోంది.

MLC Kavitha - CBI
MLC Kavitha – CBI

నోటీసులపై సర్వత్రా చర్చ..
సీఆర్పీసీ 91 కింద సీబీఐ జారీ చేసిన నోటీసీలపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. సాక్షిగా ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీబీఐ కవితను ఫిక్స్‌ చేసింది. ఆదివారం ఏడున్నర గంటలపాటు జరిపిన విచారణలో ఈమేరకు కవిత కూడా తనకు తెలిసిన వివరాలు చెప్పింది. ఈమేరకు స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకుంది. న్యాయవాది సమక్షంలో విచారణకు హాజరైన కవిత తాను చెప్పిన వివరాలన్నీ నిజమైనవే అని స్టేట్‌మెంట్‌పై సంతకం కూడా చేసినట్లు తెలిసింది. దీని ఆధారంగానే సీబీఐ సీఆర్పీసీ 91 కింద నోటీసులు ఇచ్చింది. దీనిలో రెండు క్లాజ్‌లు ఉన్నాయి. సీఆర్పీసీ 91 క్లాజ్‌ 1 కింద తన దగ్గర ఉన్న ఆధారాలు పత్రాలు, ఫోన్లు, డాక్యుమెంట్లు, అగ్రిమెంట్లు, సీడీలు, కాల్‌ రికార్డులు ఇలా కీలకమైన ప్రతీ ఆధారం.. సీబీఐకి ఎవరితో అయినా పంపిచొచ్చు. ఇక క్లాజ్‌ – 2 ప్రకారం అయితే.. కవితనే స్వయంగా సీబీఐ ఆఫీస్‌కు వెళ్లి ఆధారాలు తాము చెప్పిన చోట, నోటీసు అందుకున్న వ్యక్తి హాజరుకావాల్సి ఉంటుంది. అడిగిన పత్రాలు, ఆధారాలు ఇవ్వాల్సిందే. దీనిపై సీబీఐ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. త్వరలోనే తేదీ, స్థలం వివరాలుల మెయిల్‌ ద్వారా పంపుతామని సీబీఐ పేర్కొంది.

ఉచ్చు బిగుస్తోందా?
సీబీఐ వేస్తున్న అడుగులు చూసుక్తంటే ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోంది. సీఆర్పీసీ 160 కింద కవితను సాక్షిగా మాత్రమే విచారించి వాంగ్మూలం నమోదు చేసిన సీబీఐ తర్వాత 91 కింద నోటీసులు ఇవ్వడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు కవితకు కొన్ని ఆధారాలు చూపించారని సమాచారం. వాటితో అప్పటి వరకు ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో కనిపించిన కవిత.. విచారణ తర్వాత ముఖంపై లేని వన్వును తెచ్చుకుని కార్యకర్తలకు, మీడియా ముందుకు వచ్చారు. దీనిద్వారా కవితలో ఏదో టెన్షన్‌ మొదలైందన్న అభిప్రాయం అందరికీ అర్థమవుతుంది. మరోవైపు కవిత మీడియాతో మాట్లాడకుండా, విచారణ తర్వాత హడావుడిగా ప్రగతి భవన్‌కు వెళ్లడం కూడా అనుమానాలకు తావిస్తోంది. సాక్షిగా వివరణ ఇస్తే ఇంత టెన్షన్‌ ఎందుకన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కవితను వెంటాడుతున్న సీబీ‘ఐ’.. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మరోషాక్‌!

MLC Kavitha - CBI
MLC Kavitha – CBI

ప్రగతిభవన్‌లో న్యాయ నిపుణులు..
ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీబీఐ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఎమ్మెల్సీ కవితను నీడలా వెంటాడనుందా.. సాక్షి నుంచి తానూ నిందితురాలినే అని ఒప్పించనుందా.. ఈమేరకు సీబీఐ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. నిన్నటి వరకు 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి కేవలం సాక్షిగానే పరిగణించిన సీబీఐ.. తాజాగా సీఆర్పీసీ 91 కింద నోటీసులు ఇచ్చి షాక్‌ ఇచ్చింది. సాక్షిగా స్టేట్‌మెంట్‌ రికార్డు చేస్తున్న సమయంలో ఆమె చెప్పిన వివరాల ఆధారంగా కవిత వద్ద ఢిల్లీ లిక్కర్‌ కేసుకు సంబంధించిన బలమైన ఆధారాలు ఉన్నట్లు సీబీఐ భావిస్తుందని సమాచారం. అందుకే 91 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చినట్లు సీబీఐ వర్గాలు చెబుతున్న మాట. దీంతో త్వరలోనే కవితను సీబీఐ మళ్లీ విచారించనున్నట్లు తెలుస్తోంది.
కవిత విచారణ పూర్తికాగానే అప్‌డేట్స్‌ తెలుసుకునేందుకు, తర్వాత ఏం చేయాలి, ఎలాంటి స్టెప్‌ వేయాలన్న విషయమై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ ఆదివారం ఉదయమే న్యాయ నిపుణులు, రిటైర్డ్‌ జడ్జీలు, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదులను ప్రగతి భవన్‌కు పిలిపించినట్లు తెలిసింది. సుమారు పది మంది న్యాయ నిపుణులు ఆదివారం రోజంతా ప్రగతిభవన్‌లోనే ఉన్నారని సమాచారం. విచారణ అనంతరం కవిత ప్రగతిభవన్‌కు వెళ్లిన తర్వాత సీబీఐ అడిగిన ప్రశ్నలు, వాటికి కవిత ఇచ్చిన సమాచారం, సీబీఐ అధికారులు చూపించిన ఆధారాల గురించి న్యాయ నిపుణులకు వివరించినట్లు తెలిసింది. ఈమేరకు రాత్రంతా మంతనాలు సాగినట్లు తెలుస్తోంది. కవిత, కేసీఆర్‌కు కంటిమీద కునుకు లేకుండా పోయిందని ప్రచారం జరుగుతోంది.

నోటీసులపై సర్వత్రా చర్చ..
ఫోన్ల ధ్వంసంపైనే ఎక్కువ ప్రశ్నలు..
సీఆర్పీసీ 91 కింద సీబీఐ జారీ చేసిన నోటీసీలపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. సాక్షిగా ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీబీఐ కవితను ఫిక్స్‌ చేసింది. ఆదివారం ఏడున్నర గంటలపాటు జరిపిన విచారణలో ఈమేరకు కవిత కూడా తనకు తెలిసిన వివరాలు చెప్పింది. ఈమేరకు స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకుంది. న్యాయవాది సమక్షంలో విచారణకు హాజరైన కవిత తాను చెప్పిన వివరాలన్నీ నిజమైనవే అని స్టేట్‌మెంట్‌పై సంతకం కూడా చేసినట్లు తెలిసింది. దీని ఆధారంగానే సీబీఐ సీఆర్పీసీ 91 కింద నోటీసులు ఇచ్చింది. దీనిలో రెండు క్లాజ్‌లు ఉన్నాయి. సీఆర్పీసీ 91 క్లాజ్‌ 1 కింద తన దగ్గర ఉన్న ఆధారాలు పత్రాలు, ఫోన్లు, డాక్యుమెంట్లు, అగ్రిమెంట్లు, సీడీలు, కాల్‌ రికార్డులు ఇలా కీలకమైన ప్రతీ ఆధారం.. సీబీఐకి ఎవరితో అయినా పంపిచొచ్చు. ఇక క్లాజ్‌ – 2 ప్రకారం అయితే.. కవితనే స్వయంగా సీబీఐ ఆఫీస్‌కు వెళ్లి ఆధారాలు తాము చెప్పిన చోట, నోటీసు అందుకున్న వ్యక్తి హాజరుకావాల్సి ఉంటుంది. అడిగిన పత్రాలు, ఆధారాలు ఇవ్వాల్సిందే. దీనిపై సీబీఐ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. త్వరలోనే తేదీ, స్థలం వివరాలుల మెయిల్‌ ద్వారా పంపుతామని సీబీఐ పేర్కొంది.
ఎమ్మెల్సీ కవిత 10 ఫోన్లు ధ్వంసం చేశారని అమిత్‌ ఆరోరా రిమాండ్‌ రిపోర్టులో సీబీఐ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ అంశంపైనే సీబీఐ కవితను ఎక్కువగా ప్రశ్నించినట్లు సమాచారం. విచారణ తాను అనుకున్ననంత ఈజీగా జరుగలేదన్న విషయం మాత్రం అందరికీ అర్థమవుతోంది. సీబీఐ దగ్గర ఉన్న ఆధారాలతో నిందితులుగా చేర్చే అవకాశం కూడా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఆభయమే కవితను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది.

ఉచ్చు బిగుస్తోందా?
స్టే తెచ్చుకునే ప్రయత్నం..
సీబీఐ వేస్తున్న అడుగులు చూసుక్తంటే ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోంది. సీఆర్పీసీ 160 కింద కవితను సాక్షిగా మాత్రమే విచారించి వాంగ్మూలం నమోదు చేసిన సీబీఐ తర్వాత 91 కింద నోటీసులు ఇవ్వడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు కవితకు కొన్ని ఆధారాలు చూపించారని సమాచారం. వాటితో అప్పటి వరకు ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో కనిపించిన కవిత.. విచారణ తర్వాత ముఖంపై లేని వన్వును తెచ్చుకుని కార్యకర్తలకు, మీడియా ముందుకు వచ్చారు. దీనిద్వారా కవితలో ఏదో టెన్షన్‌ మొదలైందన్న అభిప్రాయం అందరికీ అర్థమవుతుంది. మరోవైపు కవిత మీడియాతో మాట్లాడకుండా, విచారణ తర్వాత హడావుడిగా ప్రగతి భవన్‌కు వెళ్లడం కూడా అనుమానాలకు తావిస్తోంది. సాక్షిగా వివరణ ఇస్తే ఇంత టెన్షన్‌ ఎందుకన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరోవైపు కవితను సీబీఐ ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో నిందితురాలిగా చేర్చవచ్చన్న అభిప్రాయాన్ని న్యాయ నిపుణులు వ్యక్తం చేశారు. దీంతో ముందస్తు బెయిల్‌ లేదా నిందితురాలిగా చేర్చే అంశంపై ముందస్తుగా కోర్టు నుంచి స్టే తెచ్చుకునే అవకాశాలను కవిత, సీఎం కేసీఆర్‌ న్యాయ నిపుణులతో చర్చించారని తెలుస్తోంది. సోమవారం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్తున్నందున, అక్కడ కూడా మరికొంతమంది న్యాయ నిపుణులతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. 91 సీఆర్పీసీ నోటీసులపైనా స్టే కోరే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మొన్నటి వరకు సహకరిస్తానని చెప్పిన కవిత ఇప్పుడు స్టే తెచ్చుకుంటే మాత్రం ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు తన ప్రమేయం ఉన్నట్లు అంగీకరించినట్లు అవుతుంది. ఇది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుంది. మరోవైపు ఇన్నాళ్లు కవితకు అండగా నిలిచిన గులాబీ శ్రేణులు కూడా పునరాలోచనలో పడే అవకాశం ఉంది.

ప్రగతిభవన్‌లో న్యాయ నిపుణులు..
కవిత విచారణ పూర్తికాగానే అప్‌డేట్స్‌ తెలుసుకునేందుకు, తర్వాత ఏం చేయాలి, ఎలాంటి స్టెప్‌ వేయాలన్న విషయమై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ ఆదివారం ఉదయమే న్యాయ నిపుణులు, రిటైర్డ్‌ జడ్జీలు, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదులను ప్రగతి భవన్‌కు పిలిపించినట్లు తెలిసింది. సుమారు పది మంది న్యాయ నిపుణులు ఆదివారం రోజంతా ప్రగతిభవన్‌లోనే ఉన్నారని సమాచారం. విచారణ అనంతరం కవిత ప్రగతిభవన్‌కు వెళ్లిన తర్వాత సీబీఐ అడిగిన ప్రశ్నలు, వాటికి కవిత ఇచ్చిన సమాచారం, సీబీఐ అధికారులు చూపించిన ఆధారాల గురించి న్యాయ నిపుణులకు వివరించినట్లు తెలిసింది. ఈమేరకు రాత్రంతా మంతనాలు సాగినట్లు తెలుస్తోంది. కవిత, కేసీఆర్‌కు కంటిమీద కునుకు లేకుండా పోయిందని ప్రచారం జరుగుతోంది.

ఫోన్ల ధ్వంసంపైనే ఎక్కువ ప్రశ్నలు..
ఎమ్మెల్సీ కవిత 10 ఫోన్లు ధ్వంసం చేశారని అమిత్‌ ఆరోరా రిమాండ్‌ రిపోర్టులో సీబీఐ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ అంశంపైనే సీబీఐ కవితను ఎక్కువగా ప్రశ్నించినట్లు సమాచారం. విచారణ తాను అనుకున్ననంత ఈజీగా జరుగలేదన్న విషయం మాత్రం అందరికీ అర్థమవుతోంది. సీబీఐ దగ్గర ఉన్న ఆధారాలతో నిందితులుగా చేర్చే అవకాశం కూడా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఆభయమే కవితను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది.

స్టే తెచ్చుకునే ప్రయత్నం..
మరోవైపు కవితను సీబీఐ ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో నిందితురాలిగా చేర్చవచ్చన్న అభిప్రాయాన్ని న్యాయ నిపుణులు వ్యక్తం చేశారు. దీంతో ముందస్తు బెయిల్‌ లేదా నిందితురాలిగా చేర్చే అంశంపై ముందస్తుగా కోర్టు నుంచి స్టే తెచ్చుకునే అవకాశాలను కవిత, సీఎం కేసీఆర్‌ న్యాయ నిపుణులతో చర్చించారని తెలుస్తోంది. సోమవారం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్తున్నందున, అక్కడ కూడా మరికొంతమంది న్యాయ నిపుణులతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. 91 సీఆర్పీసీ నోటీసులపైనా స్టే కోరే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మొన్నటి వరకు సహకరిస్తానని చెప్పిన కవిత ఇప్పుడు స్టే తెచ్చుకుంటే మాత్రం ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు తన ప్రమేయం ఉన్నట్లు అంగీకరించినట్లు అవుతుంది. ఇది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుంది. మరోవైపు ఇన్నాళ్లు కవితకు అండగా నిలిచిన గులాబీ శ్రేణులు కూడా పునరాలోచనలో పడే అవకాశం ఉంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version