జడ్జీలపై కామెంట్స్: వైసీపీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బుక్?

ఏపీ హైకోర్టు జడ్జీలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐదుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది. శనివారం పి.ఆదర్స్, ఎల్.సాంబశివారెడ్డిని అధికారులు అరెస్ట్ చేశారు. జూలై 28న ధామిరెడ్డి కొండారెడ్డి, పాముల సుధీర్ ను అరెస్ట్ చేసినట్లు సీబీఐ తెలిపింది. జులై 9న ఈ కేసులో నిందితుడిగా ఉన్న లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డిని కువైట్ నుంచి వస్తుండగా అరెస్ట్ చేసినట్లు తెలిపింది.ఇప్పటివరకు 16మందిపై కేసులు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఇక ఈ కేసులో ఇద్దరి […]

Written By: NARESH, Updated On : August 8, 2021 8:23 pm
Follow us on

ఏపీ హైకోర్టు జడ్జీలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐదుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది. శనివారం పి.ఆదర్స్, ఎల్.సాంబశివారెడ్డిని అధికారులు అరెస్ట్ చేశారు. జూలై 28న ధామిరెడ్డి కొండారెడ్డి, పాముల సుధీర్ ను అరెస్ట్ చేసినట్లు సీబీఐ తెలిపింది. జులై 9న ఈ కేసులో నిందితుడిగా ఉన్న లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డిని కువైట్ నుంచి వస్తుండగా అరెస్ట్ చేసినట్లు తెలిపింది.ఇప్పటివరకు 16మందిపై కేసులు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

ఇక ఈ కేసులో ఇద్దరి వైసీపీ నేతల పేర్లు బయటకు రావడం సంచలనమైంది. ఈ కేసులో వైసీపీకి చెందిన ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ల ప్రమేయంపై కూడా దర్యాప్తు జరుపుతున్నామని సీబీఐ అధికారులు తెలిపడం చర్చనీయాంశమైంది. మొత్తం 16మందిలో ముగ్గురు విదేశాల్లో ఉన్నారని.. ఐదుగురిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలతోపాటు ఎఫ్ఐఆర్ లో ఉన్న వ్యక్తులపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. అది తేలాక వారిపై కూడా లీగల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జడ్జీలపై వ్యాఖ్యల వెనుక భారీ కుట్ర ఉందని అనుమానిస్తున్నట్టు సీబీఐ అధికార ప్రతినిధి ఆర్.సీ జోషి తెలిపారు. ఇప్పటికే జడ్జీలపై కేసులో సీఐడీ జాప్యం చేయడంతో కేసును సీబీఐకి అప్పగించింది ఏపీ హైకోర్టు. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో స్పందించింది. దేశంలో న్యాయాధికారులపై దాడులు, దూషణలు అధికం కావడంపై శుక్రవారం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.