Captain Abhilasha Barak: యుద్ధరంగంలోకి తొలి మహిళా పైలెట్‌.. చరిత్ర సృష్టించిన అభిలాష

Captain Abhilasha Barak: భారత వాయు సేనలోకి తొలి మహిళా పైలెట్‌గా హరియాణ యువతి కెప్టెన్‌ అభిలాష బరాక్‌(26) అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించారు. భారత తొలి యుద్ధ విమాన మహిళా పైలట్‌గా రికార్డులకెక్కారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న కంబాట్‌ ఆర్మీ ఏవియేషన్‌ ట్రైనింగ్‌ స్కూల్‌లో అభిలాషతో పాటు మొత్తం 36 మంది ఆర్మీ పైలట్లకు ‘‘వింగ్‌ కమాండర్‌’’ హోదా కల్పించారు. అభిలాష 2018లో ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ కార్ప్స్‌లో నియమితులయ్యారు. సైనిక కుటుంబం నుంచి.. అభిషాల […]

Written By: Raghava Rao Gara, Updated On : May 26, 2022 6:46 pm
Follow us on

Captain Abhilasha Barak: భారత వాయు సేనలోకి తొలి మహిళా పైలెట్‌గా హరియాణ యువతి కెప్టెన్‌ అభిలాష బరాక్‌(26) అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించారు. భారత తొలి యుద్ధ విమాన మహిళా పైలట్‌గా రికార్డులకెక్కారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న కంబాట్‌ ఆర్మీ ఏవియేషన్‌ ట్రైనింగ్‌ స్కూల్‌లో అభిలాషతో పాటు మొత్తం 36 మంది ఆర్మీ పైలట్లకు ‘‘వింగ్‌ కమాండర్‌’’ హోదా కల్పించారు. అభిలాష 2018లో ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ కార్ప్స్‌లో నియమితులయ్యారు.

Captain Abhilasha Barak

సైనిక కుటుంబం నుంచి..
అభిషాల కుటుంబానికి కూడా ఆర్మీ నేపథ్యం. తండ్రి ఓంసింగ్‌ కల్నల్‌గా పనిచేసి విరమణ పొందారు. పెద్దన్న 2013 నుంచి సైన్యంలో ఉన్నారు. అభిలాష.. సనావర్‌లోని లారెన్స్‌ స్కూల్‌లో చదివారు. ఢిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ నుంచి బీటెక్‌ (ఈసీఈ) పూర్తిచేశారు. 2018, సెప్టెంబర్‌లో అభిలాష ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ కార్ప్స్‌లో నియమించబడింది.

Also Read: Producer M. Ramakrishna Reddy: విషాదం : ప్రముఖ నిర్మాత కన్నుమూత !

మొదటి మహిళా పోరాట ఏవియేటర్‌గా గుర్తింపు..
భారత వైమానిక దళం, భారత నౌకాదళంలోని మహిళా అధికారులు చాలా కాలంగా హెలికాప్టర్లను ఎగురవేస్తున్నారు. ఇప్పటి వరకు ఆర్మీ ఏవియేషన్‌లో మహిళా అధికారులకు గ్రౌండ్‌ డ్యూటీలు మాత్రమే కేటాయించేవారు. 2021 ప్రారంభంలో ఎయిర్‌ఫోర్స్‌లోకి కూడా మహిళలను అనుమతి ఇవ్వాలని సైన్యం అనుమతించింది. ఆసక్తి ఉన్న మహిళలు జెట్‌ ఫైటర్‌ ఏవియేటర్‌ శిక్షణ న ఇవ్వాలని నిర్ణయించింది. భారతదేశం సాయుధ దళాలలో అధికారులుగా మహిళలను చేర్చుకోవడం ప్రారంభించిన 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా మహిళా ఏవియేటర్‌గా కెప్టెన్‌ అభిలాషా బరాక్‌ నాసిక్‌లోని పోరాట ఆర్మీ ఏవియేషన్‌ ట్రైనింగ్‌ స్కూల్‌లో ఒక సంవత్సరం పాటు కోర్సు పూర్తి చేసిన తర్వాత హెలికాప్టర్‌ పైలట్‌గా ఆర్మీ ఏవియేషన్‌ కార్ప్స్‌లో చేరిన మొదటి మహిళగా గుర్తింపు పొందింది. నాసిక్‌లోని ట్రైనింగ్‌ స్కూల్‌లో బుధవారం జరిగిన వేడుకలో ఆర్మీ ఏవియేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అజయ్‌ కుమార్‌ సూరి ఆమెకు 36 మంది ఆర్మీ పైలట్‌లతోపాటు వింగ్స్‌ పదానం చేశారు. «దృవ్‌ అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ నిర్వహించే 2072 ఆర్మీ ఏవియేషన్‌ స్క్వాడ్రన్‌లోని రెండో ఫ్లైట్‌కు బరాక్‌ కేటాయించబడ్డాడు.

Captain Abhilasha Barak

జూన్‌ 2022లో నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ తన మొదటి బ్యాచ్‌ మహిళా క్యాడెట్‌లను చేర్చుకోబోతున్న తరుణంలో బరాక్‌ సైన్యంలో మొదటి మహిళా పోరాట ఏవియేటర్‌ అయ్యారు.

నవంబర్‌ 1986లో పెరిగిన ఆర్మీ ఏవియేషన్‌ కార్ప్‌ ్ప..
ఎయిర్‌ ఫోర్స్‌ రుద్ర హెలికాప్టర్లు, చేతక్స్, చిరుతలు మరియు చీటల్‌ హెలికాప్టర్లను నిర్వహిస్తోంది. సియాచిన్‌ గ్లేసియర్‌తో సహా ఎతై ్తన ప్రాంతాలలో సైన్యం మోహరింపులకు మద్దతు ఇవ్వడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

2015లో మిలిటరీలో మహిళలను తమ యుద్ధవిమానంలోకి చేర్చుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు వారికి కీలక మలుపులు వచ్చాయి. దాదాపు 25 ఏళ్ల విరామం తర్వాత భారత నావికాదళం గత ఏడాది నలుగురు మహిళా అధికారులను యుద్ధ నౌకలపై మోహరించింది.

మే 2021లో, సైన్యం మహిళలను కార్ప్స్‌ ఆఫ్‌ మిలిటరీ పోలీస్‌లోకి చేర్చింది. మొదటిసారి వారు నాన్‌ ఆఫీసర్‌ కేడర్‌లో సైన్యంలో చేరడానికి అనుమతించబడ్డారు. 1990వ దశకం ప్రారంభం నుంచి మూడు సర్వీసుల ఎంపిక చేసిన శాఖల్లో మహిళలు అధికారులుగా పనిచేస్తున్నారు.

Also Read:Japan Man Turn Into Dog: కుక్కగా మారిన జపాన్ వ్యక్తి.. ఏకంగా రూ. 12 లక్షల ఖర్చు

Recommended Videos:


Tags