ఈ సందర్భంగా దేశాయ్ మాట్లాడుతూ ‘నేను చాలా సార్లు రైళ్లలో ప్రయాణించాను. రైళ్ళలో మురికి, చిరిగిన దుప్పట్లు చూసాను. అందుకే నా స్నేహితుడు తన సొంత దుప్పటితో అతనితో ప్రయాణిస్తుంటాడు. రైళ్లలో ఇచ్చిన దుప్పట్లు శుభ్రంగా వున్నాయంటే అతను నమ్మడు. అటువంటి పరిస్థితిలో ఈ దుప్పట్లు ఎప్పుడెప్పుడు ఉతుకుతారో తెలుసుకోవాలనుకున్నాను, అందుకే ఆర్టీఐకి దరఖాస్తు చేశానని తెలిపారు. కాగా ఈ విషయమై సిపిఆర్ఓ రవీందర్ భఖర్ మాట్లాడుతూ ఉన్ని దుప్పట్లు ఉతికితే పాడవుతాయి. గతంలో ఈ దుప్పట్లు ప్రతి రెండు నెలలకు ఒకసారి ఉతికేవారు. కాని ఇప్పుడు ప్రతి నెలా ఉతుకుతున్నారు. రోజూ ఉన్ని దుప్పట్లు ఉతకడం సాధ్యం కాదని చెప్పారు.