Homeఆంధ్రప్రదేశ్‌Janasena and BJP: బద్వేలు బరిలో బీజేపీ/జనసేన.. ఎవరికి సీటు? ఉత్కంఠ

Janasena and BJP: బద్వేలు బరిలో బీజేపీ/జనసేన.. ఎవరికి సీటు? ఉత్కంఠ

Janasena and BJP: దేశంలో ఉప ఎన్నికల కోసం ఎన్నికల సంఘం అక్టోబర్ 1న నోటిఫికేషన్ వెలువడనుంది. కడప జిల్లా బద్వేలు శాసనసభ ఉప ఎన్నికకు పార్టీలు సమాయత్తమవుతున్నాయి. సాధారణంగా పదవిలో ఉన్న వ్యక్తి చనిపోతే అక్కడ ఏకగ్రీవం చేసే సంప్రదాయానికి స్వస్తి పలికారు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ వెంకటసుబ్బయ్య కరోనాతో గత మార్చిలో చనిపోయారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో బద్వేలులో పార్టీల మధ్య పోటీ నెలకొంది.
BJP and Janasena
ఈక్రమంలో ఇక్కడ ఎలాగైనా విజయం సాధించాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. టీడీపీ కూడా తమ అభ్యర్థిగా ఓబుళాపురం రాజశేఖర్ పేరును ఖరారు చేసింది. వైసీపీ అభ్యర్థిగా వెంకటసుబ్బయ్య భార్య సుధను ప్రకటించింది. వామపక్షాలు, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బద్వేలు లో కూడా పోటీ ప్రధాన పార్టీల మధ్య నెలకొంది. బీజేపీ, జనసేన ఉమ్మడిగా పోటీ చేయాలని భావిస్తున్నాయి. తమకే అవకాశం ఇవ్వాలని జనసేన కోరుతోంది.

తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ పోటీలో నిలవగా జనసేన మద్దతిచ్చింది. ఇక్కడ జనసేనకు బీజేపీ మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు .రెండు పార్టీలు కూర్చుని మాట్లాడుకుని అభ్యర్థిని నిర్ణయిస్తాయని ప్రకటించిన నేపథ్యంలో అభ్యర్థి విషయంలో ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థి ఎవరైనా వారి గెలుపు కోసమే పని చేస్తామని ఇరు పార్టీలు ప్రకటిస్తున్నాయి.

దీంతో ఎలాగైనా విజయం సాధించాలని వైసీపీ కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. పార్టీనేతలందరు ఐక్యంగా పనిచేసి అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని సూచించారు. అక్టోబర్ 8 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 11న నామినేషన్ల పరిశీలించి 13 వరకు అవకాశం ఇవ్వనున్నారు. అక్టోబర్ 30న పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీంతో ఉప ఎన్నికపై అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version