spot_img
Homeఅంతర్జాతీయంGujarat Elections- Arvind Kejriwal: గుజరాత్ ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ చీఫ్ కేజ్రీవాల్ కు...

Gujarat Elections- Arvind Kejriwal: గుజరాత్ ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ చీఫ్ కేజ్రీవాల్ కు బిగ్ షాక్

Gujarat Elections- Arvind Kejriwal: స్వచ్ఛమైన రాజకీయాల పేరుతో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ శుద్ధ పూస కాదు అని మరోసారి తేలిపోయింది.. ఢిల్లీ లిక్కర్ స్కాం లో పీకలలోతు మునిగిపోయిన ఆ పార్టీ మరో కుంభకోణంలో ఇరుక్కుంది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నామని పదేపదే డబ్బా కొట్టుకుంటున్న అరవింద్ కేజ్రీవాల్.. తరగతి గదుల నిర్మాణం పేరుతో 1300 కోట్లు నొక్కేసారని సమాచారం. దీనిపై ప్రత్యేక దర్యాప్తుకు విజిలెన్స్ డైరెక్టరేట్ సిఫారసు చేయడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం చెలరేగుతున్నది. లిక్కర్ స్కాం మీద ఒక వైపు దర్యాప్తు జరుగుతోంది. ఇది మరవక ముందే ఈ కేసు తెర పైకి రావడం గమనార్హం.

Gujarat Elections- Arvind Kejriwal
Gujarat Elections- Arvind Kejriwal

విజిలెన్స్ డైరెక్టరేట్ సిఫారసు

ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలల తరగతి గదుల నిర్మాణంలో భారీ అవినీతి జరిగింది.. దీనిపై ప్రత్యేక విచారణ జరిపించాలని విజిలెన్స్ డైరెక్టరేట్ సిఫారసు చేసింది.. మొత్తం 193 పాఠశాలల్లో 2,405 తరగతి గదుల నిర్మాణంలో ₹1300 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు విజిలెన్స్ విభాగం చెప్పడం సంచలనాన్ని రేకెత్తిస్తోంది. పైగా వీటి నిర్మాణంలో భారీగా ఉల్లంఘనలు, అవినీతి జరగడంతో అధికారులను బాధ్యులను చేయాలని విజిలెన్స్ డైరెక్టరేట్ సూచించింది. 2015లో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అదనపు తరగతి గదుల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది.. వీటి నిర్మాణంలో అక్రమాలు జరిగాయని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ 2020 ఫిబ్రవరి 17న నివేదిక ఇచ్చింది.. దీనిని ఢిల్లీ విజిలెన్స్ డైరెక్టరేట్ కు పంపింది. అయితే రెండు సంవత్సరాలుగా దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.. ఇక ఈ నివేదికను కూడా ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తప్పు పట్టారు..

గుజరాత్ ఎన్నికల ముందు

గుజరాత్ రాష్ట్రంలో ఈసారి త్రిముఖ పోరు నెలకొన్నది. ఒకానొక దశలో ఆమ్ ఆద్మీ పార్టీ బిజెపికి గట్టి పోటీ ఇస్తుందని మొన్నటిదాకా పలు సర్వేలు తేల్చి చెప్పాయి. ఈ క్రమంలో ఇటీవల ఢిల్లీ తీహార్ జైల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత సత్యేంద్ర జైన్ మసాజ్ చేయించుకుంటున్న వీడియో బయటకు వచ్చింది. అయితే ఆ సమయంలో ఆయన ఫిజియో థెరపీ చేయించుకుంటున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కవర్ చేశారు. కానీ అతడికి మసాజ్ చేసింది కరడుగట్టిన నేరగాడు.. కన్న కూతురిపై అత్యాచారం చేసి జైలుకు వెళ్లిన వ్యక్తితో సత్యేంద్రజైన్ మసాజ్ చేయించుకున్నారు.. దీనిని పూర్తి ఆధారాలతో బిజెపి బయట పెట్టడంతో ఆప్ కక్కలేక మింగలేక ఉండిపోయింది. ఇది సరిపోదు అన్నట్టు ఇప్పుడు తరగతి గదుల కుంభకోణం తెరపైకి రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి డిఫెన్స్ లో పడింది. వీటిని చూపించుకుంటూ బిజెపి నాయకులు గుజరాత్ రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ సుద్దపూస కాదని ప్రజలకు చేరువ చేస్తున్నారు.

Gujarat Elections- Arvind Kejriwal
Gujarat Elections- Arvind Kejriwal

యువకులను ఆకట్టుకునే యత్నం

ఆమ్ ఆద్మీ పార్టీపై వరుస ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కాం పై ఈడీ అధికారులు పట్టు బిగించారు. మొన్నటిదాకా మనీష్ సిసోడియాను కార్నర్ చేసిన అధికారులు… ఈసారి మరిన్ని పెద్ద తలకాయలను టార్గెట్ చేశారు. పదివేల పేజీలతో దర్యాప్తు నివేదికను తయారు చేశాయి.. అయితే ఈ కేసులో భారీ ఎత్తున నగదు మారినట్టు ఈడి అధికారులు చెబుతున్నారు. అయితే ఈ వరుస ఘటనలతో ఆప్ ప్రభ గుజరాత్ రాష్ట్రంలో క్రమంగా మసక బారే ప్రమాదం కనిపిస్తోంది. మొన్నటిదాకా యువకులు ఆప్ వెంట తిరిగారు. కానీ బిజెపి నాయకులు వరుస కుంభకోణాల విషయాలను వారికి అర్థమయ్యేలా చెబుతూ ఆకర్షిస్తున్నారు. పాటి దార్లు కూడా ఈసారి బిజెపి వైపే ఉండటం గమనార్హం.

 

 

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Oktelugu Epaper
Exit mobile version