Pakistan Reverse Action: దురంధర్.. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా మన దేశంలో భారీగా వసూళ్లను సాధించింది. అంతేకాదు, మన దేశం మీద పాకిస్తాన్ సాగించిన దుర్మార్గాన్ని బయటపెట్టింది. భారతదేశానికి సంబంధించిన రా ఏజెంట్లు పాకిస్థాన్లో ఎలా ఉన్నారు.. దేశంలో అంతర్గత భద్రతను పెంపొందించడానికి వారు ఏ విధంగా కృషి చేస్తున్నారు.. ఉగ్రవాదులను వారు ఏ విధంగా అంతం చేస్తున్నారు.. అనే విషయాల మీద ఈ సినిమా రూపొందింది.
దురంధర్ సినిమాను పాకిస్తాన్ తీవ్రస్థాయిలో విమర్శించింది. కొంతమంది కూహాన లౌకికవాదులు కూడా మన దేశంలో ఉంటూ ఈ సినిమా గురించి చెత్త వాగుడు వాగారు. దురంధర్ సినిమా విడుదలైన తర్వాత పాకిస్తాన్ లో పరిస్థితులు మారిపోయాయి. బిచ్చగాళ్లను.. మతిస్థిమితం లేని వాళ్లను అక్కడి సర్కార్ అదుపులోకి తీసుకుంది. వారు ఏమైనా దురంధర్ల మాదిరిగా పనిచేస్తున్నారేమోనని అనుమానంతో ఇంటరాగేషన్ చేసింది. పాకిస్తాన్లో భారత్ తరఫున దురంధర్ల గురించి మనం సినిమాలో చూసాం. కానీ మనదేశంలో కూడా పాకిస్తాన్ రివర్స్ యాక్షన్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో మనదేశంలో జరుగుతున్న పరిణామాలు దీనికి బలం చేకూర్చుతున్నాయి.
పంజాబ్ రాష్ట్రంలో కొద్దిరోజుల క్రితం ఓ ఏఎస్ఐ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో అతడు చనిపోయాడని అందరూ అనుకున్నారు. కానీ పోలీసులు దర్యాప్తు జరిపితే అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు వ్యక్తులను ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేస్తే దాని వెనుక ఉన్న అసలు కథ తెలిసింది. ఆ తర్వాత హర్యానాలో ఓ పోలీస్ స్టేషన్ మీద బాంబు దాడి జరిగింది. ఈ కేసును విచారించిన పోలీసులకు అసలు విషయం తెలిసింది.. ఢిల్లీలో పోలీసులు ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిని విచారిస్తే అసలు కథ తెలిసింది.. ఇక గురుదాస్ పూర్ ప్రాంతంలో ఇద్దరు పోలీసులు హత్యకు గురయ్యారు. ఈ కేసును విచారించిన పోలీసులకు అసలు కథ తెలిసింది.
మనదేశంలో జరిగిన వేరువేరు సంఘటనలలో పోలీసులు విచారణ సాగిస్తే తెలిసిన అసలు కథలలో ఉన్న సూత్రధారి పేరు షహజాద్ భట్టి. ఇతడు పాకిస్తాన్లో ఉంటాడు. మాఫియా డాన్.. మాదకద్రవ్యాలు.. అక్రమ ఆయుధాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. భారతదేశం అంటే విపరీతమైన ద్వేషాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు.
మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి.. దారుణాలు జరగడానికి సోషల్ మీడియాను.. ఆన్లైన్ వేదికలను ఉపయోగించుకుంటాడు. కొంతమంది వ్యక్తులను తనకు స్లీపర్ సెల్స్ గా మార్చుకున్నాడు. వారందరికీ కూడా టర్కీ ప్రాంతం నుంచి డబ్బులు సరఫరా చేస్తున్నాడు. ఇతడు భారతదేశంలో ఇంతవరకు అడుగుపెట్టలేదు. కానీ దురంధర్ మాదిరిగా భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి.. అసాంఘిక పనులు జరగడానికి.. ప్రజల్లో భయం దిగడానికి ఇతడు కారణమవుతున్నాడు. ఇతడు 17 దేశాల్లో తన కార్యకలాపాలు సాగిస్తున్నాడు. 300 మంది వ్యక్తులు ఇతడికి సహకారం అందిస్తున్నారు.. ఆమధ్య నేషలిస్ట్ కాంగ్రెస్ నాయకుడు బాబా సిద్ధికి హత్యకు గురయ్యాడు. ఆ కేసును పోలీసులు విచారిస్తే ఇతడి గురించి తెలిసింది..
ఇతడు కేవలం మాదకద్రవ్యాలు.. అక్రమ ఆయుధాల వ్యాపారం మాత్రమే కాదు, తెహరిక్ ఏ తాలిబన్ హిందుస్థాన్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. దీనిద్వారా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నాడు. హిజిబుల్ ముజాహిద్దీన్, లష్కరే ఏ తోయి బా వంటి సంస్థలను మించి ఉగ్రవాద కార్యకలాపాలు సాగించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది.. అయితే ఇతడిని అజ్ఞాత సాయుధ దళాలు అంతం చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే కొంతకాలంగా ఇతడి మీద అజ్ఞాత సాయుధ దళాలు దృష్టిపెట్టాయి. ఈ క్షణమైనా సరే ఇతడు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని జాతీయవాదులు చెబుతున్నారు.
