Homeజాతీయ వార్తలుBandi Sanjay: మందుతాగి అయ్య, డ్రగ్స్ తీసుకునే కొడుకు మళ్లీ రెచ్చిపోయిన బండి సంజయ్

Bandi Sanjay: మందుతాగి అయ్య, డ్రగ్స్ తీసుకునే కొడుకు మళ్లీ రెచ్చిపోయిన బండి సంజయ్

Bandi Sanjay: ‘‘తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని మీలాంటి మోసగాళ్లు తిరిగిన తెలంగాణ గడ్డ అపవిత్రమైంది. మీ మోసాలను ఎండగడుతూ తెలంగాణ మొత్తం సంప్రోక్షణ చేయాలి’’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు మునుగోడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, మాజీ మంత్రి చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, కంకణాల నివేదితా రెడ్డి తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. ‘‘నువ్వు, నీ అయ్య నోరు హద్దులో పెట్టుకుని మాట్లాడాలే.. నువ్వు ఒక్కటి మాట్లాడితే మేం వంద మాట్లాడగలం. కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది. అసలు నీ అయ్య యాడికి పోయిండు? ఎందుకు మా సవాల్ ను స్వీకరించలేదు?’’అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు…

• అయ్యా కొడుకులకు (కేసీఆర్, కేటీఆర్) ఇక్కడ పీకుడు పనేమీలేదు. అమిత్ షా గారు మా గురువు.  మాకు గురువంటే దైవంతో సమానం. వాళ్ల కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటాం. ఆరోజు చెప్పులు అందించాను. అందులో తప్పేముంది? అయినా మీ సంగతి తెల్వందెవరికి? తాగి తండ్రిని కొడతవ్… ఇగ మీ అయ్య ఆయన గురువు జయశంకర్ సార్ ను కొట్టిండు.. కొండా లక్ష్మణ్ బాపూజీని అవమానించినడు. అయినా అడ్డగోలుగా మాట్లాడుతున్నరు. ముందు మీ నోరు సంప్రోక్షణ చేయాలి. అయ్యా కొడుకుల నోరు ఫినాయిల్ తో కడగాలి.

• ఏ వ్యక్తి కూడా తప్పు చేస్తే తడిబట్టలతో దేవాలయానికి వెళ్లరు. నేను వెళ్లడంద్వారా బీజేపీ నిజాయితీ ఏంటో ప్రజలకు తెలిసింది. దేవుడిని నమ్మని నాస్తికుడికి అసలు సంప్రోక్షణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు.

• తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుండా మోసం… మీరు మోసగాళ్లు… మీలాంటి మోసగాళ్లు తిరిగిన తెలంగాణ గడ్డ అపవిత్రమైంది. మేం తెలంగాణ మొత్తం సంప్రోక్షణ చేస్తాం…నువ్వు నీ అయ్య నోరు హద్దులో పెట్టుకుని మాట్లాడాలే.. ఒక్కటి మాట్లాడితే వంద మాట్లాడాలి. అసలు నీ అయ్య యాడికి పోయిండు? ఎందుకు మా సవాల్ ను స్వీకరించలేదు?

• నలుగురు ఎమ్మెల్యేలు, నువ్వు తప్పు చేయకపోతే ప్రగతి భవన్ లోనే ఎందుకు దాచి పెట్టారు? తప్పు చేశారు కాబట్టే వాళ్లు యాదాద్రికి రాలేదు.. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో లేదు… గల్లీలో లేదు.. వాళ్లకు జనమే రావడం లేదు… వాళ్లకు మందిని కూడా పంపాలేమో… అధి భారత్ జోడో యాత్ర కాదు.. కాంగ్రెస్-టీఆర్ఎస్ కలిసి చేస్తున్న జోడీ యాత్ర.

• అమిత్ షా మునుగోడుకు సభకు జనం వస్తుంటే 5 కి.మీల దూరంలో జనాన్ని ఆపేశారు. రాజగోపాల్ రెడ్డి నామినేషన్ సమయంలో జనం పెద్ద ఎత్తున వస్తుంటే… వారి వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిపేశారు. అందుకే నడ్డా గారి సభను వాయిదా వేశాం. అందుకు బదులుగా ప్రతి మండల కేంద్రంలో 20 వేల మంది చొప్పున 9 బహిరంగ సభలు ఏర్పాటు చేస్తాం.. ఈ సభల ద్వారా బీజేపీ సందేశాన్ని సులభంగా ప్రజలకు చేరుతుంది. ఈ సభలకు జాతీయ నాయకులతోపాటు రాష్ట్ర ముఖ్య నాయకులు హాజరవుతారు.

• తెలంగాణలో 16 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు డ్రగ్స్ తీసుకుంటున్నారు. వాళ్లు డ్రగ్స్ కు బానిసలయ్యారు. వాళ్ల అనుచరులకు కూడా డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక వారందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటాం.

• క్రిష్ణా జలాల వాటా పంపిణీ విషయంలో కేసీఆర్ తెలంగాణకు తీరని ద్రోహం చేశారు. 575 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా అప్పటి సీఎంతో కుమ్కక్కై 299 టీఎంసీలకే అంగీకరించిన ద్రోహి కేసీఆర్

తరుణ్ చుగ్ మాట్లాడుతూ…

• 8 ఏళ్ల పాలనలో మునుగోడుకు చేసిందేమిటి? డిగ్రీ కాలేజీ ఏది? డబుల్ బెడ్రూం ఇల్లు ఏది? ప్రజా సమస్యలన్నీ గాలికొదిలేశారు.

• మునుగోడు ఎన్నికలు ట్రైలర్. కేసీఆర్ అహంకారాన్ని దించే ఎన్నికలు. కేసీఆర్ అవినీతి, నియంత, కుటుంబ పాలనకు చరమగీతం పాడే ఎన్నికలు కాబోతున్నయ్.

• బంగారు తెలంగాణ నరేంద్రమోదీ కల. బీజేపీ ఆధ్వర్యంలో ఆ కలను నెరవేరుస్తాం.

• టీఆర్ఎస్ నేతలెవరూ అభ్యర్థి పేరుతో ఎన్నికలకు వెళ్లడానికి ముఖం చాలడం లేదు. బీజేపీ మాత్రం అభ్యర్ధి పేరుతోనే ఎన్నికలకు వెళుతోంది.

• సచివాలయానికి వెళ్లని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. రామాయణంలో అహంకారం తలకెక్కిన రావణుడు ఎట్లా పతనమయ్యారో… కేసీఆర్ కు సైతం అదే గతి పడుతుంది.

• కేసీఆర్ దమ్ముంటే 8 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలపై శ్వేత పత్రం విడుదల చేయాలి. ఎంతమందికి దళిత బంధు ఇచ్చారో? ఎంతమందికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారో చెప్పాలి.

• 4గురు ఎమ్మెల్యేల వ్యవహారం అంతా భోగస్.. బీజేపీకి సంబంధమేలేదు. ఇదంతా టీఆర్ఎస్ డ్రామా.

• అందుకే మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తడిబట్టలతో వెళ్లి యాదాద్రిలో ప్రమాణం చేశారు. కేసీఆర్ ఎందుకు రాలేదు? తప్పు చేయకపోతే రావాలి కదా అంటూ బండి సంజయ్ తరుణ్ చుగ్ లు టీఆర్ఎస్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. .

 

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular