Bandi Sanjay: తెలంగాణపై జెండా ఎగురువేసే ‘బండి సంజయ్’ ప్లాన్

తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే ఆయన టార్గెట్.. కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎదిగిన బండి సంజయ్ ప్లాన్లు అదిరిపోయాయి. తెలంగాణ బీజేపీకి దూకుడు నేర్పిన బండి సంజయ్ అదే ఊపులో ఇప్పుడు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. తెగించి కొట్లాడుదాం అంటూ బీజేపీ శ్రేణులకు పిలుపునిస్తున్నాడు. కర్నాటక తరహాలో ఉద్యమించి తెలంగాణలో అధికారం చేజిక్కుంచుకునేలా మాస్టర్ ప్లాన్లు వేస్తున్నారు. బండి సంజయ్ తెలంగాణలో చేపట్టే పాదయాత్ర కోసం కార్యకర్తల వర్క్ షాప్ […]

Written By: NARESH, Updated On : August 19, 2021 7:49 pm
Follow us on

తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే ఆయన టార్గెట్.. కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎదిగిన బండి సంజయ్ ప్లాన్లు అదిరిపోయాయి. తెలంగాణ బీజేపీకి దూకుడు నేర్పిన బండి సంజయ్ అదే ఊపులో ఇప్పుడు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. తెగించి కొట్లాడుదాం అంటూ బీజేపీ శ్రేణులకు పిలుపునిస్తున్నాడు. కర్నాటక తరహాలో ఉద్యమించి తెలంగాణలో అధికారం చేజిక్కుంచుకునేలా మాస్టర్ ప్లాన్లు వేస్తున్నారు. బండి సంజయ్ తెలంగాణలో చేపట్టే పాదయాత్ర కోసం కార్యకర్తల వర్క్ షాప్ లో బండి సంజయ్ ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులను బండి సంజయ్ కార్యోన్ముఖులను చేశారు. బండి సంజయ్ మాట్లాడుతూ ‘‘తెలంగాణలో దోపిడీ, నియంత, కుటుంబ, గడీల పాలన నడుస్తోంది. కేసీఆర్ మూర్ఖత్వ పాలనలో ప్రజలంతా అల్లాడిపోతున్నరు. ప్రశ్నించిన నాయకులు, కార్యకర్తలపై లాఠీలు ఝుళిపిస్తున్నారు. జైల్లో వేస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లు లాఠీ దెబ్బలు తిందాం? ఇంకా ఎన్నాళ్లు త్యాగాలు చేద్దాం? అధికారమే లక్ష్యంగా తెగించి కొట్లాడాల్సిన సమయం వచ్చింది. కర్నాటక తరహాలో ఉద్యమిద్దాం. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొద్దాం. బీజేపీ కార్యకర్తలంతా రాబోయే రెండేళ్లపాటు తమ పూర్తి సమయాన్ని పార్టీకి కేటాయించండి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ కోరారు.

-బండి సంజయ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలివీ..

•ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనే కార్యకర్తలకు అవగాహన కల్పించే అంశంపై ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వర్క్ షాప్ నిర్వహించారు. వందలాది మంది కార్యకర్తలు హాజరైన ఈ వర్క్ షాప్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇంఛార్జీ, ఎంపీ మునుస్వామి, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, పాదయాత్ర సహ ప్రముఖ్ తూళ్ల వీరేందర్ గౌడ్, మల్లారెడ్డి, కట్టా సుధాకర్, కడగంచి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
• ఈ వర్క్ షాపులో తొలుత మనోహర్ రెడ్డి, తూళ్ల వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ బండి సంజయ్ తో కలిసి ప్రజా సంగ్రామ యాత్రలో నడిచే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ముఖ్యంగా ఆరోగ్యం, వసతి, భోజనం వంటి అంశాల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అదే విధంగా పాదయాత్ర సక్సెస్ చేసేందుకు కార్యకర్తలు అనుసరించాల్సిన పద్దతులను వివరించారు.
• ఎంపీ మునుస్వామి మాట్లాడుతూ…. బండి సంజయ్ చేపడుతున్న పాదయాత్రను ప్రతి ఒక్కరు సక్సెస్ చేయాలని కోరారు. ‘‘పార్టీలో ఎవరు కష్టపడుతున్నారు? ఎవరు పార్టీ కోసం బూత్ స్థాయి నుండి నిరంతరం శ్రమిస్తున్నారు. అనే విషయాలను నిశితంగా పరిశీలించేందుకే కేంద్రం తనను ప్రతినిధిగా పంపింది. అందరూ కష్టపడి పనిచేయాలి’’అని పేర్కొన్నారు.
• పాదయాత్ర లో భాగంగా రాష్ర్టంలోని అన్ని నియోజక వర్గాల్లో మండల, జిల్లా నాయకుల, వివిధ మోర్చాల పనితీరు పై లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే వారిని పార్టీ గుర్తించి తగిన పదవులిస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు.
• ముఖ్యంగా పాదయాత్రలో టీఆరెస్ అవినీతి, నియంత పాలనను ఎండగట్టడంతోపాటు నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వంటి హామీల అమలులో కేసీఆర్ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు.
• అనంతరం శ్రీ బండి సంజయ్ ఆయా కార్యకర్తలను ఉద్దేశించి ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు. అందులోని ముఖ్యాంశాలు……
• ఈనెల 24న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుండి ప్రారంభించనున్న ప్రజా సంగ్రామ యాత్రలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని తనతో నడిచేందుకు సిద్ధం కావడం చాలా సంతోషంగా ఉంది.
• ప్రజలతో మమేకమయ్యేందుకే పాదయాత్ర చేపట్టాలని తాను నిర్ణయించానని, బీజేపీ అధ్యక్షుడైన కొత్తలోనే పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ కరోనా మహమ్మారి, లాక్ డౌన్ వల్ల ఇన్నాళ్లూ వాయిదా వేయాల్సి వచ్చింది.
• 2023లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే వరకు తాను దశల వారీగా పాదయాత్రను కొనసాగిస్తా.
• నీళ్లు-నిధులు-నియామకాలే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్రంలో గడీల, కుటుంబ పాలన కొనసాగుతోంది. అవినీతి, నియంత పాలనతో పేదలు తీవ్రమైన ఇబ్బందులపాలవుతున్నారు.
• బీజేపీ కార్యకర్తలు సైతం టీఆర్ఎస్ మూర్ఖత్వ, నయా నిజాం పాలనవల్ల కష్టాలు పడుతున్నారు.
• కేసీఆర్ గడీల పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలంతా ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు.
• ఈ నేపథ్యంలో ప్రజల ఆకాంక్షలు, బాధలు, కన్నీళ్లను స్వయంగా తెలుసుకోవాలనే లక్ష్యంతోనే పాదయాత్ర చేయాలని నిర్ణయించాం.
• వారి బాధలు, సమస్యలు తెలుసుకోవడంతోపాటు వారికి అండగా ఉండేందుకు, వారి సమస్యల ఆధారంగా బీజేపీ మేనిఫెస్టో రూపొందించేందుకే ఈ పాదయాత్ర చేస్తున్నాం.
• గడీలను బద్దలు కొట్టడం బీజేపీ వల్ల మాత్రమే సాధ్యం. టీఆర్ఎస్ మెడలు వంచి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతాం.
• కేసీఆర్ మోసాలకు, దొంగ హామీలకు అంతు లేకుండా పోయింది. చివరకు ప్రభుత్వం కేంద్రం ఇచ్చే నిధులను కూడా దారి మళ్లిస్తూ సొంత పథకాలుగా చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు. ప్రశ్నించిన వారిపై లాఠీలు ఝుళిపిస్తున్నారు. జైల్లో వేస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లు లాఠీ దెబ్బలు తిందాం? ఇంకా ఎన్నాళ్లు త్యాగాలు చేద్దాం? అధికారమే లక్ష్యంగా తెగించి కొట్లాడాల్సిన సమయం వచ్చింది.
• ఒకప్పుడు కర్నాటకలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు మనలాగే ఎన్నో ఉద్యమాలు చేసిండ్రు. ఓర్వలేని ఆనాటి పాలకులు కాషాయా జెండాపై కక్ష కట్టి కార్యకర్తలను జైల్లో వేశారు. అయినా అక్కడి కార్యకర్తలు వెరవలేదు. పాలకులపై తెగించి యుద్దం చేశారు. ఫలితంగానే కర్నాటకలో అధికారంలోకి వచ్చారు.
• ఈసారి తెలంగాణ వంతు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నియంత, గడీల పాలనపట్ల ప్రజలు విసిగిపోయారు. వారంతా బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారు. బీజేపీ అధికారంలో రావడం ఖాయమనే విశ్వాసాన్ని ప్రజల్లో నింపాల్సిన అవసరం ఉంది.
• అందుకోసమే పాదయాత్ర చేస్తున్నా. ప్రజల కష్టాలు, కన్నీళ్లు తుడవడమే నా తక్షణ కర్తవ్యం. వారికి భరోసా ఇవ్వడమే నా ఉద్దేశం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, బాధలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. తద్వారా బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే నా అంతిమ లక్ష్యం. అందుకోసం ప్రతి ఒక్క కార్యకర్త ఈ రెండేళ్లపాటు పూర్తి సమయాన్ని పార్టీకి కేటాయించాలిన సమయం ఆసన్నమైంది. ఈ రెండేళ్ల పాటు కుటుంబ శ్రేయస్సు కంటే రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, పార్టీ శ్రేయస్సు ముఖ్యమని భావించి పోరాటాలకు సిద్ధం కావాలి.
• పార్టీ కోసం కుటుంబంతో గడిపే సమయాన్ని కొంత వరకు త్యాగం చేయాలి. ఈ విషయంలో కుటుంబాలను ఒప్పించాలి. ఆ సమయాన్ని రాష్ట్ర ప్రజల కష్టాలను, బాధలను తుడిచేందుకే కేటాయించాలి. అంతిమంగా రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో రాత్రింబవళ్లు పనిచేయాలి.
• నిస్వార్థంగా, కమిట్ మెంట్ తో పనిచేస్తూ ప్రజా సంగ్రామ యాత్రలో పనిచేసే వారికి పార్టీ తగిన గుర్తింపు ఇస్తుంది. చేసే పనిని బట్టే గుర్తింపు వస్తుందే తప్ప ఫొటోలకు ఫోజులిస్తే మాత్రం గుర్తింపు రాదు.
• కేసీఆర్ నియంత, అవినీతి, కుటుంబ పాలనతో తెలంగాణ తల్లి బందీ అయ్యింది. ఆ తల్లిని విముక్తి చేయడమే లక్ష్యంగా తెగించి పోరాడాలి.

– దళితులపై దాడులు చేస్తే భరతం పట్టండి
-జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకునేలా ఒత్తిడి తెండి
-ఎస్సీలకు అండగా ఉండే పార్టీ బీజేపీ మాత్రమే
-బీజేపీ ఎస్సీ మోర్చా నేతలకు   బండి సంజయ్ దిశానిర్దేశం

రాష్ట్రంలో దళితులపై దాడులు జరిగితే బీజేపీ ఇకపై చూస్తూ ఊరుకోబోదని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ విషయంలో తక్షణమే జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేయడమే కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకునేదాకా ఒత్తిడి తీసుకురావాలని బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులను కోరారు.
ఈరోజు (19.08.2021) పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇంఛార్జీ, ఎంపీ మునుస్వామి, జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇంఛార్జ్ డాక్టర్ జి. మనోహర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు వేముల అశోక్, ప్రధాన కార్యదర్శులు కుమ్మరి శంకర్, క్రాంతి కుమార్ తదితరులు హాజరయ్యారు.
•ఈ సమావేశానికి హాజరైన నాయకులంతా ఈనెల 24 నుండి చేపట్టనున్న ‘ప్రజా సంగ్రామ యాత్ర’లో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేస్తామని ముందుకు వచ్చారు.
• ఈ సందర్భంగా వారికి క్రుతజ్ణతలు తెలిపిన శ్రీ బండి సంజయ్ ఎస్సీ మోర్చా చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని కోరారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో ఎస్సీలపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యంత పేదరికం అనుభవిస్తున్న వారిలో దళితులే ఎక్కవుగా ఉన్నారని, వారిపై నిత్యం దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
•‘‘ఇకపై దళితుల పక్షాన ఎస్సీ మెర్చా నాయకులంతా ఉద్యమించండి దళితులపై దాడులు జరిగితే తక్షణమే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేయండి. కఠిన చర్యలు తీసుకునేలా ఉద్యమించండి. తెలంగాణలో దళితులకు బీజేపీ ఎస్సీ మోర్చా అండగా ఉంటుంది’’అని కోరారు.
• బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇంచార్జ్ మునుస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ మోర్చాను మరింత బలం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపై మెర్చా నాయకుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తామన్నారు. ఇకపై ప్రజల కోసం, పార్టీ ఉన్నతి కోసం కష్టపడి పనిచేసే మోర్చా నాయకులకు భవిష్యత్తులో అనేక అవకాశాలు లభిస్తాయని చెప్పారు.