పిఎం కెర్స్ కు ఎంపీ బండి సంజయ్ విరాళం

కరోనా బాధితులను ఆదుకొనేందుకు ప్రధాన మంత్రి ఏర్పాటు చేసిన `పీఎం కేర్స్’ నిధికి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన ఎంపీ ల్యాండ్స్ నుండి కోటి రూపాయలు, ఒక నెల జీతం లక్ష రూపాయలను విరాళంగా ప్రకటించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కరోనా నివారణకు చేపట్టే కార్యక్రమాలకు వినియోగించడానికి ఇప్పటికే రూ 50 లక్షలు ప్రకటించారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 […]

Written By: Neelambaram, Updated On : April 3, 2020 6:09 pm
Follow us on


కరోనా బాధితులను ఆదుకొనేందుకు ప్రధాన మంత్రి ఏర్పాటు చేసిన `పీఎం కేర్స్’ నిధికి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన ఎంపీ ల్యాండ్స్ నుండి కోటి రూపాయలు, ఒక నెల జీతం లక్ష రూపాయలను విరాళంగా ప్రకటించారు.

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కరోనా నివారణకు చేపట్టే కార్యక్రమాలకు వినియోగించడానికి ఇప్పటికే రూ 50 లక్షలు ప్రకటించారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు 2 గంటల సమయంలో భారీగా పిఎం కేర్స్ నిధికి విరాళాలు అందించారు.

దేశం కంటికి కనిపించని కరోనా వైరస్ తో పోరాటం చేస్తుందని, దాని నివారణకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన లాక్ డౌన్ ను తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా పిలుపిచ్చారు.

దేశ విపత్కర పరిస్థితుల్లో ఉన్న సమయంలో ప్రతి ఒక్కరు ప్రభుత్వాలకు సహకరిస్తూనే తమ వంతు సహాయ సహకారాలను, ఆర్థిక సహాయం రూపంలో నేడు పీఎం సహాయ నిధికి విరాళాలు అందించడం చాలా గొప్ప పరిణామం అని పేర్కొన్నారు.

ఈ పిలుపుకు ముందుకు వచ్చి రూ 10 లక్షలు అందించిన బీజేపీ నేత, మాజీ ఎంపీ డా. వివేక్ వెంకటస్వామికి అభినందనలు పలికారు. తెలంగాణ ప్రాంత ప్రజలు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా పిఎం కేర్స్ సహాయ నిధికి విరాళాలు అందించడం కోసం ముందుకు వచ్చి పెద్ద ఎత్తున సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు