Homeజాతీయ వార్తలుAssam CM Himanta Biswa: ఎవరీమె... అస్సాం సీఎం ఎందుకు టార్గట్‌ చేశాడు?

Assam CM Himanta Biswa: ఎవరీమె… అస్సాం సీఎం ఎందుకు టార్గట్‌ చేశాడు?

Assam CM Himanta Biswa: జాతీయ భద్రత ఈ రోజుల్లో చాలా కష్టంగా మారింది మన మధ్యనే ఉంటూ.. మనతో కలిసి తిరుగుతూ.. మనతో కలిసి పనిచేస్తూ.. ఉగ్ర కార్యకలాపాలకు ప్పాడుతున్నారు., దేశ వ్యతిరేక శక్తులకు సమాచారం ఇస్తున్నారు., అలాంటి పరిస్థితే అస్సాం ఎంపీ గౌరవ్‌ గొగోయ్‌ ఎదుర్కొంటున్నారు. మాజీ సీఎం తరుణ్‌ గొగోయ్‌ కుమారుడు అయిన గౌవర్‌ గొగోయ్‌ బ్రిటన్‌కు చెందిన ఎలిజబెత్‌ కోల్‌బోర్న్‌ (42 ఏళ్లు)ను పెళ్లి చేసుకున్నాడు. గౌవర్‌ లోక్‌సభలో డిఊ్యటీ లీడర్, అస్సాం పీసీసీ అధ్యక్షుడు. ఇక ఎలిజిబెత్‌ ఎల్‌ఎస్‌ఈ నుంచి పర్యావరణ శాస్త్రం, అంతర్జాతీయ రాజకీయ ఆర్థికశాస్త్రంలో డిగ్రీలు సాధించారు. ఎల్‌ఈఏడీ, సీడీఎన్‌కే. వంటి అంతర్జాతీయ సంస్థల్లో వాతావరణ మార్పులు, అభివృద్ధి కార్యక్రమాల్లో కీలక పాత్రలు పోషించారు.

వైభవంగా వివాహం..
2013లో ఢిల్లీలో అస్సాం అహోమ్‌ సంప్రదాయంలో గౌవర్‌ – ఎలిజిబెత్‌ వివాహం వైభవోపేతగా జరిగింది. సోనియా, రాహుల్, మన్మోహన్‌ సింగ్‌ హాజరయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు కబీర్, మాయా. గౌరవ్‌ అమెరికాలో పబ్లిక్‌ అడ్మిన్‌ చదివి సామాజిక సేవల్లో నిమగ్నుడు. ఇద్దరి పరిచయం రహస్యమే అయినా, పర్యావరణ–సామాజిక ఆసక్తులు కలిపాయని చెబుతారు.

ఐఎస్‌ఐతో లింకులు..
అస్సాం ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్‌.. ఎలిజబెత్‌–పాక్‌ ఐఎస్‌ఐ సంబంధాలు, గౌరవ్‌ రహస్య పాక్‌ పర్యటనలు, పిల్లల పౌరసత్వాలపై విచారించింది. ఎలిజబెత్‌ ఐఆ సున్నిత సమాచారాన్ని (వాతావరణ అంశాలు) 45 పేజీల నివేదికగా పాకిస్తానీ అలీ తౌకీర్‌ షేక్‌కు పంపింది. ఆమెకు పాక్‌ బ్యాంకు ఖాతాలు, ఎప్‌సీఆర్‌ఏ ఉల్లంఘనలు ఉన్నాయని ఆరోపణ. కేసు కేంద్ర హోం శాఖకు బదిలీ అవుతోంది.

పౌరసత్వ రహస్యాలు..
విదేశీ వివాహం తర్వాత 7 ఏళ్లు నివసించి పౌరసత్వం తీసుకోవచ్చు. కానీ 2013 వివాహం తర్వాత ఎలిజబెత్‌ ఇప్పటికీ బ్రిటిష్‌ పౌరురాలిగా ఎసీఐ కార్డుతోనే ఉంది. గౌరవ్‌ కుమారుడు కబీర్‌ భారత పాస్‌పోర్ట్‌ను వదులుకుని బ్రిటిష్‌ పౌరసత్వం తీసుకున్నాడు. కుమార్తె మాయాకు బ్రిటిష్‌ పాస్‌పోర్ట్‌ కొనసాగుతోంది. మూడుసార్లు ఎంపీ, సీఎం అభ్యర్థి కుమారుడు ఇలా చేయడం అనుమానాలకు తావిస్తోంది.

గౌరవ్‌ అస్సాం సీఎం ఆరోపణలను రాజకీయ కుట్ర, సినిమా స్క్రిప్ట్‌గా తిరస్కరించాడు. ప్రభుత్వం ఓసీఐ రద్దు గురించి ఆలోచిస్తోందని పేర్కొన్నారు. అఇతే ఇది కేవలం కుటుంబ విషయం కాదు జాతీయ భద్రత, విదేశీ ప్రభావాలు, పౌరసత్వ చట్టాలకు సంబంధించిన ప్రశ్నలు లేవనెత్తుతోందని అస్సాం ప్రభుత్వం పేర్కొంటోంది. అస్సాం రాజకీయాల్లో కొత్త ట్విస్ట్‌గా మారింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular