Homeజాతీయ వార్తలుMahua Moitra: మోదీ చీటింగ్‌.. ఏపీ ప్రజలూ గ్రహించండి.. పార్లమెంట్‌లో నిప్పులు చెరిగిన లేడీ∙సింగం!

Mahua Moitra: మోదీ చీటింగ్‌.. ఏపీ ప్రజలూ గ్రహించండి.. పార్లమెంట్‌లో నిప్పులు చెరిగిన లేడీ∙సింగం!

Mahua Moitra: దేశంలో లోక్‌సభ ఎన్నికలతోపాటే ఏపీ అసెంబ్లీకి మే నెలలో ఎన్నికలు జరిగాయి. జూన్‌ 3న వెల్లడైన ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అధికార వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది, దీంతో ఏపీ సీఎంగా నారా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టారు. పవన్‌ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యలు స్వీకరించారు. ఎన్డీఏ కొలువుదీరి రెండు నెలలైంది. ఈ రెండు నెలల్లో చంద్రబాబు గత ప్రభుత్వ వైపల్యాలను ఎండగట్టడంతోనే గడిపేశారు. కనీసం పూర్తిస్థాయి బడ్జెట్‌ కూడా పెట్టే సాహసం చేయలేదు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌నే పొడిగించారు. ఈ క్రమంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు కేటాయించింది. కోఆపరేటివ్‌ సంస్థల ద్వారా రుణం ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే మరో మిత్ర పక్షం జేడీఎస్‌ అధికారంలో ఉన్న బిహార్‌కు 25 వేల కోట్లు కేటాయించింది. దీనిపై పార్లమెంటులో విపక్షాలు నిరసన తెలిపాయి. బడ్జెట్‌ ప్రవేశపెట్టి పక్షం రోజులైనా విమర్శల సునామీ తగ్గట్లేదు. ఇండియా కూటమి అంత సులభంగా వదిలేలా కనిపించట్లేదు. లైఫ్, మెడికల్‌ ఇన్సూరెన్స్, ప్రీమియం చెల్లింపులపై 18 శాతం జీఎస్టీని ఎత్తివేయాలంటూ లోక్‌సభలో ఆవరణలో ఇదివరకే ధర్నాకు దిగారు కూటమి నాయకులు. దీన్ని మరింత ఉధృతం చేయనున్నారు. ఇదే సమయంలో లోక్‌సభలో తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యురాలు మహువా మొయిత్రా కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. వేతన జీవులు, మధ్యతరగతివర్గాల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కాదంటూ నిప్పులు చెరిగారు. కార్పొరేట్‌ కంపెనీలకు అనుకూలంగా రూపొందించారంటూ మండిపడ్డారు.

రూ.15 వేల కోట్లు అప్పే..
ఇక ఈ బడ్జెట్‌లో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించారు. కానీ, ఇది మొత్తం అప్పేనని మహువా మొయిత్రా తేల్చి చెప్పారు. రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన భారం ఏపీ ప్రజలపైనే ఉందని పేర్కొన్నారు. ఒక్క రూపాయి కూడా గ్రాంట్‌గా ఇవ్వలేదని స్పష్టం చేశారు. వివిధ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఆ మొత్తాన్ని రుణంగా పొందేలా మాత్రమే సహకరిస్తామని బడ్జెట్‌లో పొందుపర్చారని పేర్కొన్నారు. ఇక వెనుకబడిన జిల్లాలైన రాయలసీమ, ప్రకాశం, ఉత్తర–కోస్తాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి గ్రాంట్‌ ఇస్తామని ప్రతిపాదించడాన్ని స్వీపింగ్‌ స్టేట్‌మెంట్‌గా అభివర్ణించారు మహువా మొయిత్రా. ఇందులో కూడా అబద్ధాలే ఉన్నాయని, ఏపీకి ఒక్క రూపాయి కూడా గ్రాంట్‌గా ఇవ్వలేదని తేల్చి చెప్పారు.

ఏపీలో సంబురాలు..
ఇదిలా ఉంటే.. ఏపీకి రూ.15 వేల కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాధించడంతో ఏపీలో అధికార ఏన్డీఏలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సంబురాలు చేసుకున్నారు. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. లోక్‌సభలో 12 ఎంపీ సీట్లు ఉన్న జేడీఎస్‌ అధికారంలో ఉన్న బిహార్‌కు రూ.25 వేల కోట్లు గ్రాంట్‌ కేటాయించిన కేంద్రం, 16 ఎంపీలు ఉన్న టీడీపీ అధికారంలో ఉన్న ఏపీకి మాత్రం రూ.15 వేల కోట్లు అదికూడా అప్పుగా ఇవ్డం గమనార్హం. దీనికే కూటమి నేతలు సంబురాలు చేసుకోవడం ఏపీ ప్రజలు గమనించాల్సి అంశం. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన రెండ నెలల్లోనే చంద్రబాబు సర్కార్‌ దాదాపు 20 వేల కోట్ల రూపాయల అప్పు చేసింది. సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. మళ్లీ అప్పులు తెచ్చి జీతాలు చెల్లిస్తున్నారు. దీనిపై విపక్ష వైసీపీ మండిపడుతోంది. ప్రజలు ఎన్డీఏ మోసాలను గమనించాలని కోరుతోంది. రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ ఏపీ ప్రజలను చీటింగ్‌ చేస్తున్నారని ఆరోపిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version