జనసేన 10వ ఆవిర్భావ సభ వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. అర్ధరాత్రి అయినా అందుకే జనం కదలలేదు. నెమ్మదిగా మొదలైనా ఎక్కడా ఆవేశం లేదు. ఎక్కడా డీవియేషన్ లేదు. ఎక్కడ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. పవన్ ప్రసంగంతో తెలుగు భాషకు, భావవ్యక్తీకరణకు గౌరవం దక్కింది.
పవన్ ప్రసంగంలో గొప్పతనం ఏంటంటే ఎంతో మంది కవులను ఆయన ప్రస్తావించాడు. తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి, సీతారామశాస్త్రి ‘రుద్రవీణ’, గుర్రం జాషువా ‘విశ్వనటుడు’, శ్రీశ్రీ ‘మహాప్రస్తానం’, గోరటి వెంకన్న ‘పల్లె కన్నీరు పెడుతుందో’.. శేషేంద్ర పద్యం, విశ్వనాథ సత్యనారాయణ గారి కొటేషన్లు ఇలా ఏడుగురు కవుల ప్రస్థావన తో పవన్ ఆకట్టుకున్నారు.
జగన్, చంద్రబాబులు తెలుగు నేలను ఇన్నేళ్లు ఏలారు. ఈ మాత్రమైనా పవన్ లా తెలుగును పరిచయం చేయగలరా? మమేకం కాగలరా? అంటే లేదు అని చెప్పొచ్చు. ఈ ఇద్దరిలో ఒకరికి సరిగ్గా తెలుగు మాట్లాడడమే రాదు. పవన్ కళ్యాణ్ ప్రసంగంలో ఎన్నో అద్భుత సూక్తులు ప్రజలకు ఎంతో భరోసానిచ్చాయి. స్ఫూర్తిని పంచాయి.
ఇదే ఒరవడి కొనసాగిస్తే రాజ్యాధికారం ఖాయమని పవన్ కళ్యాణ్ నిరూపించారు. పవన్ ప్రసంగంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.