
మూడు రోజులపాటు భారీ వర్షాలు పడి.. రెండు రోజులుగా తెరిపి ఇచ్చిందని సంబురపడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఈ అల్పపీడనం అలా ముగిసిందో లేదో మరోటి ముంచుకువస్తోందట. మరో ఐదు రోజుల పాటు వాతావరణ ఎలా ఉండబోతుందో వివరించింది.
Also Read: కేసీఆర్.. సచివాలయం.. ఓ డ్రైనేజీ వ్యవస్థ
ఈనెల 19న మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయుగుండం ఇప్పటికే అరేబియా సముద్రంలో కలిసిపోయిందని, భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని స్పష్టం చేసింది. 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని వివరించారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రం వెంట ఉత్తర కోస్తాంధ్ర, తెలంగాణ, దక్షిణ మహారాష్ట్ర, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కొంకన్ ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని చెప్పింది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పియర్ స్థాయి వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి మహారాష్ట్ర తీరం మీదుగా అరేబియా సముద్రంలోకి ప్రవేశిస్తుందని అధికారులు చెప్పారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.
Also Read: ధరణి: ఆస్తుల సర్వే ఎంత వరకు కరెక్ట్..?
ఇప్పటికే మొన్నటి వర్షాలకు ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మరోసారి హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వాలు ఏదో సాయం చేస్తుందని చూడకుండా.. ఎవరికి వారుగా జాగ్రత్తగా ఉండాల్సిందే.