spot_img
Homeజాతీయ వార్తలుAir Train: దేశంలో మరో కొత్త రైలు.. త్వరలో ప్రారంభించనున్న మోదీ.. ప్రత్యేకతలు ఇవే..

Air Train: దేశంలో మరో కొత్త రైలు.. త్వరలో ప్రారంభించనున్న మోదీ.. ప్రత్యేకతలు ఇవే..

Air Train: భారత దేశంలో రైల్వే వ్యవస్థ చాలా పురాతనమైంది. బ్రిటిక్‌ కాలంలోనే దేశంలో రైల్వే వ్యవస్థ మొదలైంది. 1890లో బ్రిటిష్‌ పాలకులు తమ అవసరాల కోసం రైలు మార్గం నిర్మించారు. క్రమంగా విస్తరించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం కూడా రైల్వే వ్యవస్థను విస్తరించింది. నిత్యం లక్షల మందికి రైల్వే ప్రధాన రవాణా సాధనం. కాలక్రమేణా ఇండియన్‌ రైల్వే అనేక కొత్త రైళ్లను ప్రవేశపెడుతూ రైల్వేను ఆధునికీకరిస్తూ.. కొత్త రైలు మార్గాలు నిర్మిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే రాజధాని, శతాబ్ది, వందేభారత్, వందే మెట్రో, వందే సాధారణ్‌ పేరులో అనేక రైళ్లను కేంద్రం ప్రవేశపెట్టింది. ఇక త్వరలోనే హైడ్రోజన్‌ రైళ్లను పట్టాలెక్కించే పనిలో ఉంది కేంద్రంలోని మోదీ సర్కార్‌. 2025 చివరి నాటికి బుల్లెట్‌ రైలును కూడా పట్టాలెక్కించాలన్న సంకల్పంతో ఉంది. పూరిత్గా దేశీయ పరిజ్ఞానంతో గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఇంజిన్లను తయారు చేయబోతోంది. ఇదే సమయంలో మరో కొత్త రైలు తెచ్చే ప్రయత్నం చేస్తోంది.

ఎయిర్‌ ట్రైన్‌..
కొత్తగా తెచ్చే రైలును ఆటోమేటెడ్‌ పీపుల్‌ మూవర్‌–ఏపీఎం సర్వీసుగా వ్యవహరించే ఈ ఎయిర్‌ ట్రైన్‌ న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభం కాబోతోంది. మిమానాశ్రయంలో ఉన్న మూడు టెర్మినళ్లకు వెళ్లేందుకు లేదంటే విమానాన్ని డీబోర్డింగ్‌ చేసిన తర్వాత క్యాబ్‌ కోసం సర్వీస్‌ను అందుబాటులో ఉంచనుంది. అయితే ఇక్కడ సమయం చాలా ఎక్కువ పడుతుంది. రద్దీగా ఉండే విమానాశ్రయం. ఏడు కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.

ఆలస్యాన్ని నివారించేందుకు
విమానాశ్రయంలో ఒక టెర్మినల్‌ నుంచి మరో టెర్మినల్‌కు ప్రయాణికులు వెళ్లే సమయంలో ఆలస్యాన్ని నివారించేందుకు ఈ ఎయిర్‌ ట్రైన్‌ తీసుకురాబోతున్నారు. ఇది మెట్రో తరహాలో డ్రైవర్‌ లేకుండా పనిచేస్తుంది. రూ.2 వేల కోట్ల రూపాయలతో దీనిని ప్రారంభించబోతున్నార. 2027 నాటికి ఈ రైలు అందుబాటులోకి వస్తుంది. తక్కువ బోగీలు ఉండి ట్రాక్‌పై నడుస్తుంది. విమానాశ్రయంలో హోటళ్లు, క్యాబ్‌ ఎక్కే పాయింట్లు, పార్కింగ్, ఇతర టెర్మినల్స్‌ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. వేగంగా తీసుకెళ్తుంది. నాలుగు స్టాపులతో 7.7 కిలోమీటర్ల దూరాన్ని కవర్‌ చేస్తుంది. దీని కోసం ఈ ఏడాది చివరన టెండర్లు పిలవాలని కేంద్రం నిర్ణయించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version