అచ్చెన్నా.. నీ లేఖ సూపరన్నా..!

అదును చూసి దెబ్బకొట్టడానికి స్కెచ్ గీశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. జగన్ ను ఎలా దెబ్బతీయాలో స్వయంగా లేఖ రాసి మరీ ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు సూచించారు. ఇలా చేస్తే.. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని హింట్ ఇచ్చారు. ఇప్పుడు అచ్చెన్న రాసిన లేఖ వైరల్ అవుతోంది. ఇంతకీ అచ్చెన్నాయుడు ఏం రాశాడంటే.. Also Read: ఆన్ లైన్ ట్రెండ్స్ లో దూసుకెళుతున్న మోదీ.. జగన్..! […]

Written By: NARESH, Updated On : November 24, 2020 2:52 pm
Follow us on

achenna jagan will take a photo

అదును చూసి దెబ్బకొట్టడానికి స్కెచ్ గీశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. జగన్ ను ఎలా దెబ్బతీయాలో స్వయంగా లేఖ రాసి మరీ ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు సూచించారు. ఇలా చేస్తే.. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని హింట్ ఇచ్చారు. ఇప్పుడు అచ్చెన్న రాసిన లేఖ వైరల్ అవుతోంది. ఇంతకీ అచ్చెన్నాయుడు ఏం రాశాడంటే..

Also Read: ఆన్ లైన్ ట్రెండ్స్ లో దూసుకెళుతున్న మోదీ.. జగన్..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా వారి నామినేషన్ పత్రాలను గతంలో చించివేశారు వైసీపీ శ్రేణులు. అంతేకాదు.. పోటీచేయకుండా బెదిరింపులకు దిగారు. దీంతో నాడు చాలా మంది టీడీపీ నేతలు మిన్నకున్నారు.కానీ ఇప్పుడు దీనికి ఉపాయాన్ని ఆలోచించిన అచ్చెన్నాయుడు మాంచి లేఖ రాశారు.

వైసీపీ దౌర్జన్యాల నేపథ్యంలో ఆన్ లైన్లో నామినేషన్లు దాఖలు చేయడానికి అవకాశం కల్పించాలని ఈసీని అచ్చెన్నాయుడు కోరారు. దీనిపై ఈసీ దృష్టి సారించాలని లేఖలో విన్నవించారు. టీడీపీ అభ్యర్థులను టార్గెట్ చేసి వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారని అచ్చెన్నాయుడు లేఖలో ఆరోపించారు. వైసీపీ నేతల విధ్వంసంపై సీబీఐ విచారణ జరపాలని.. కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని అచ్చెన్న లేఖలో ఈసీని కోరారు.

Also Read: ఏపీలో ఇప్పుడు క్లారిటి వస్తుంది

సంతమాగులూరు కుందూరులో వైసీపీ శ్రేణులు కత్తులతో టీడీపీ అభ్యర్థులపై దాడులకు పాల్పడ్డారని.. కుందూరు ఎంపీటీసీ అభ్యర్థి రాఘవమ్మ భర్తపై హత్యాయత్నం చేశారని లేఖలో అచ్చెన్న పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోలేకనే టీడీపీ అభ్యర్థులను బెదిరించే ప్రక్రియకు వైసీపీ దిగుతోందని అచ్చెన్నాయుడు లేఖలో విమర్శించారు.

ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ ప్రభుత్వం మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. దీనిపై పెట్రోల్ పోసేలా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా లేఖ రాసి నిమ్మగడ్డకు హింట్స్ ఇవ్వడం వైసీపీ పుండు మీద కారం చల్లినట్టైంది. ఇప్పటికే టీడీపీకి ఫేవర్ గా రాజకీయం చేస్తున్నాడని నిమ్మగడ్డపై ఆరోపణలున్నాయి. మరి ఇప్పుడు అచ్చెన్న చెప్పినట్టు నిమ్మగడ్డ చేస్తాడా? లేదా అన్నది వేచిచూడాలి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్