రాష్ట్రంపై కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపుతూనే ఉంది. గత మూడు రోజులుగా అత్యధిక సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ప్రతి రోజు 60 నుంచి 80 వరకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మొత్తం కేసుల సంఖ్య వెయ్యికి చేరువైంది. గతంతో కరోనా స్వాబ్ టెస్టింగ్ సెంటర్లు తక్కువగా ఉండటంతో రోజుకు 2 వేల పరీక్షలే చేసేవారు. ట్రూనాట్ పరికరాలు, ర్యాపిడ్ టెస్ట్ కిట్ లతో పరీక్షల సంఖ్యను 7 వేలకు పంచారు. దీంతో రాష్ట్రంలో కేసుల పెరుగుతున్నాయని అధికారులు చెపుతున్నారు.
రాష్ట్రంలో మూడవ విడత సర్వేలో 32 వేల మంది కరోనా లక్షణాలతో ఉన్నారని గుర్తించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ అనుమానితుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ 32 వేల మంది అనుమానితులతో సుమారు 10 వేల మందికి ఇప్పటి వరకూ పరీక్షలు నిర్వహించారు. మిగిలిన వారికి పరీక్షలు నిర్వహించేందుకు ఈ నెలాఖరు వరకూ సమయం పడుతుంది చెబుతున్నారు. దీంతో ఈ నెలాఖరు వరకూ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అనుమానితులకు పరీక్షలు నిర్వహించడం పూర్తయిన అనంతరం కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు అనుమానితులకు పరీక్షలు పూర్తయిన అనంతరం కేసులు నమోదు కాకపోతే కరోనాను కట్టడి చేయడంలో విజయం సాధించినట్లే అవుతుంది. తాజాగా 72 కరోనా పాజిటివ్ కేసులకు మూలలు ఎక్కుడవనేది అంతు చిక్కడం లేదు. ఎటువంటి కేసులు కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలో అధికంగా ఉన్నాయి. అయితే ఈ నెలాఖరు వరకూ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఉధృతి కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.