Paris Olympics : పారిస్ ఒలింపిక్స్ లో అథ్లెట్స్ ఏం ఫుడ్ తింటారు.. మన అథ్లెట్స్ కు ఏం పెడుతారు? క్స్ లో అథ్లెట్స్ ఏం ఫుడ్ తింటారు.. మన అథ్లెట్స్ కు ఏం పెడుతారు?

ప్రస్తుతం పారిస్‌లో ఒలింపిక్స్ జరగుతున్నాయి. అయితే ఈ ఒలింపిక్స్ కోసం పారిస్‌లో అతిపెద్ద రెస్టారెంట్‌ను ప్రారంభించారు. 46000 చదరపు అడుగుల్లో ఒలింపిక్ విలేజ్‌లో దీనిని నిర్మించారు. ఈ రెస్టారెంట్‌లో ఒకేసారి 3500 మంది కూర్చుని తినవచ్చు. రోజుకి 40 వేలకి మందికి పైగా భోజనాన్ని అందిస్తున్నారు. మొత్తం 14 వేదికల్లో ఫుడ్ సర్వీస్ చేస్తున్నారు.

Written By: NARESH, Updated On : August 13, 2024 9:06 am

paris olympics Food

Follow us on

Paris Olympics :  ఎక్కడికైనా ట్రిప్‌కు వెళ్తే అక్కడి ఫుడ్ నచ్చక చాలా ఇబ్బంది పడుతుంటాం. పండ్లు, జ్యూస్‌లతో సరిపెట్టుకుంటాం. అలాంటిది అథ్లెట్స్ వేరే దేశానికి వెళ్లినప్పుడు అక్కడి వాతావరణానికి, ఫుడ్‌కి ఎలా అలవాటు పడతారు. గంటల తరబడి వర్క్‌వుట్ చేసేవాళ్లు ఏది పడితే అది తినరు. ఫుడ్ విషయంలో జాగ్రత్త వహిస్తారు. అయితే ఒలింపిక్స్ క్రీడల్లో భారత అథ్లెట్స్ మన ఆహారం తింటారా? లేకపోతే అక్కడ దొరికే ఫుడ్ తింటారా అని చాలామందికి సందేహం ఉంటుంది. మరి వీటిన్నింటికి సమాధానం చెప్పేద్దామా.ప్రస్తుతం పారిస్‌లో ఒలింపిక్స్ జరగుతున్నాయి. అయితే ఈ ఒలింపిక్స్ కోసం పారిస్‌లో అతిపెద్ద రెస్టారెంట్‌ను ప్రారంభించారు. 46000 చదరపు అడుగుల్లో ఒలింపిక్ విలేజ్‌లో దీనిని నిర్మించారు. ఈ రెస్టారెంట్‌లో ఒకేసారి 3500 మంది కూర్చుని తినవచ్చు. రోజుకి 40 వేలకి మందికి పైగా భోజనాన్ని అందిస్తున్నారు. మొత్తం 14 వేదికల్లో ఫుడ్ సర్వీస్ చేస్తున్నారు. ఒలింపిక్స్‌లోని అథ్లెట్లకు భోజనం తయారు చేయడం కోసం దాదాపుగా 200 మంది కుక్‌లు పనిచేస్తున్నారు. అథ్లెట్లకు మెనూ ఆధారంగా ఫుడ్‌ను సర్వ్ చేస్తారు. పండ్లు, సలాడ్‌లు వంటివి ఫిట్‌గా ఉంచేలా సాయపడిన వాటిని మెనూలో ఉంచుతారు. అథ్లెట్స్‌కు తొందరగా జీర్ణం అయ్యే ఆహారాన్ని మాత్రమే అందిస్తారు.

ఒలింపిక్ విలేజ్‌లో దాదాపుగా 500 కంటే ఎక్కువ పదార్థాలు ఉంటాయి. వీటిలో ఫ్రెంచ్, ఆసియన్, ఆఫ్రికయన్ కరీబియన్‌తో పాటు ప్రపంచ దేశాల ప్రధాన   అందుబాటులో ఉంటాయి. 1896లో మొదటిసారి ఒలింపిక్స్‌లో గుడ్లు, బ్రెడ్, చీజ్, మాంసం, రెడ్ వైన్ పెట్టారట. ఆ తర్వాత నుంచి ఎక్కువగా ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ఉండే ఫుడ్స్‌పై దృష్టిపెట్టారు. అలా ప్రతిసారి ఫుడ్ మెనూలో మార్పులు చేసుకుంటూ వచ్చారు. ప్లేయర్స్‌ను బట్టి ఫుడ్ మెనూ మారుస్తారు. ఎందుకంటే ఒక్కో ప్లేయర్ ఒక్కో రకమైన డైట్ ఫాలో అవుతుంటారు. అథ్లెట్స్ తీసుకునే ఫుడ్ సరిగ్గా లేకపోతే ఆటలో అంతగా రాణించలేరు. ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడిన శ్రమ అంతా ఒక్కసారిగా వృథా అవుతుంది. కాబట్టి ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

జపాన్, కొరియన్ 1980లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చాయి. ఆ సమయంలో వాళ్ల వంటకాలను ప్రపంచానికి తెలియజేయడానికి జపాన్ రైస్ బాల్, కొరియన్ కిమిచి వంటకాలు పెట్టారు. అయితే సియోల్‌లో జరిగిన ఒలింపిక్స్ తర్వాత కిమిచి ఫేమస్ కాగా, టోక్యో ఒలింపిక్స్ తర్వాత రైస్ బాల్ బాగా ఫేమస్ అయ్యాయి. ఈ ఫుడ్ మెనూలో ఆసియా వంటకాలు కూడా ఉంటాయి. బాస్మతి రైస్‌తో అన్నం, ఆలూ గోబీ, కాల్చిన కాలీఫ్లవర్, బంగాళదుంపలు, పుదీనా చట్నీ, పప్పు, వెజిటబుల్ బిర్యానీ, లాంబ్ కోర్మా, గుడ్లు, చిలకడదుంప, చికెన్ కర్రీలు కూడా ఉంటాయి. ఈ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున రిలయన్స్ గ్రూప్ ఇండియా హౌస్‌ను ప్రారంభించింది. మన అథ్లెట్స్ ఇండియన్ వంటకాలను మిస్ కాకుండా ఉండటానికి రిలయన్స్ ఇండియా హౌస్‌ను స్టార్ట్ చేసింది.