
పరిశోధకులు ప్రతి 100 మందిలో 20 శాతం ఈ సమస్యలతో బాధ పడుతున్నారని సరైన సమయంలో చికిత్స చేయించుకుంటే మానసిక సమస్యలను దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు. మానసిక సమస్యలతో బాధ పడుతున్న వాళ్లలో కొందరిలో మతిమరపు కనిపిస్తుంటే మరి కొందరిలో మెదడు పనితీరులో అనేక మార్పులను గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు.
బ్రిటన్ ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలోని ప్రొఫెసర్ పాల్ హరిసన్ మానసిక సమస్యలు ఎదురైతే హై రిస్క్ గా భావించాలని అన్నారు. లాన్సెట్ జర్నల్ లో ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి వైద్యులు, శాస్త్రవేత్తలు మానసిక సమస్యలకు గల కారణాలపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని.. ప్రజలు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని తెలుపుతున్నారు.
62 వేలకు పైగా కరోనా బాధితుల డేటాను పరిశీలించి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. ఆందోళన, ఒత్తిడి లేదా మతిమరుపు లాంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.