Homeవార్త విశ్లేషణFigs : అంజీర్ లో నిజంగా నాన్ వెజ్ ఉందా ? సోషల్ మీడియాలో జరుగుతున్న...

Figs : అంజీర్ లో నిజంగా నాన్ వెజ్ ఉందా ? సోషల్ మీడియాలో జరుగుతున్న వాదనలో నిజమెంత ?

Figs : డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో ముఖ్యమైనది అంజీర్. ఇది ఆరోగ్య సమస్యల నుండి మనల్ని రక్షిస్తుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని రోజూ తింటే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. మీరు రోజుకు 3 నుండి 4 అంజీర్ పండ్లను తినాలి. బరువు తగ్గించడంలో అంజీర పండ్లు బాగా పనిచేస్తాయి. ఇందులో ఉండే ప్రోటీన్ ఆకలిని నివారిస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతుంది. అంజీర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఇది గుండె జబ్బులను కూడా నివారిస్తుంది. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో కారణంగా ఇప్పుడు శాకాహారులు అంజీర పండ్లను తినేందుకు వెనుకాడుతున్నారు. అసలు విషయం ఏమిటి.. అంజీర్ నిజంగా నాన్ వెజ్ అవునా కాదా అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

కొన్ని రోజుల క్రితం, నటి షెహనాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసి, ‘‘అందుకే జైన్ అంజీర పండ్లు తినరు. నేను కూర్గ్‌లో నితిన్‌ను కలిసినప్పుడు, అంజీర పండ్లు పెరగడానికి ఒక చిన్న కీటకం తన జీవితాన్ని త్యాగం చేస్తుందని అతడు నాకు చెప్పారు.  కందిరీగ గుడ్లు పెట్టవలసి వచ్చినప్పుడు అది అత్తి పువ్వులోకి ప్రవేశించి అక్కడ గుడ్లు పెడుతుంది. పువ్వులోకి ప్రవేశించేటప్పుడు రెక్కలు విరిగి లోపల చనిపోతాయి. దీని తరువాత అత్తి ఈ జీవి మృతదేహాన్ని జీర్ణం చేస్తుంది.’’ అంటూ రాసుకొచ్చారు.

అంజీర్ నాన్ వెజ్?
నటి షెహనాజ్ ఇచ్చిన కోణం నుండి  పరిశీలిస్తే.. బహుశా ఇది నిజం కావొచ్చు కానీ లక్షలాది శాకాహారులు దీనిని నమ్మరు. అంజీర్ పండ్లు అందజేసే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని దాని తింటారు. అయితే, జైన మతాన్ని అనుసరించే వ్యక్తులు మాత్రం అంజీర్ పండ్లకు దూరంగా ఉంటారు.

జైన మతానికి చెందిన వారు అంజీర్ పండ్లను ఎందుకు తినరు?
జైన మతాన్ని విశ్వసించే వ్యక్తులు అహింసను అనుసరిస్తారు. మాంసం వినియోగానికి దూరంగా ఉంటారు. ఈ సమాజంలోని చాలా మంది ప్రజలు అంజీర పండ్లను తినకపోవడానికి ఇదే కారణం. కానీ, ఇది సాధారణ శాఖాహారుల విషయంలో కాదు. చాలా మంది శాకాహారులు కందిరీగలు లోపలికి వెళ్లి అక్కడ చనిపోవడం, అంజీర్ పండ్లను పోషించడం సహజమైన ప్రక్రియ, వాళ్లు ఇలాంటివి పట్టించుకోరు. అంజీర్ పండ్లు కలుగజేసే ప్రయోజనాల కోసం వీటిని తింటారు.

ప్రజలు ఏమంటున్నారు ?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై ప్రజల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఈ పోస్ట్‌పై వ్యాఖ్యానిస్తూ.. లక్కీక్నోవ్ అనే  నెటిజన్ సాంకేతికంగా చెప్పాలంటే, అంజీర్‌లో ఒక్క కందిరీగ కూడా లేదని కామెంట్ చేశారు. ఫిసిన్ అనే ఎంజైమ్ కారణంగా ఈ కందిరీగ కూడా అత్తి పండ్ల లోపల నుండి పూర్తిగా నాశనమై ప్రొటీన్‌గా మారుతుంది. మరొక నెటిజన్ ఈ వీడియోను నమ్మవద్దని కామెంట్ చేశారు.  ఎందుకంటే ఇది సాంకేతికంగా సరైనది కాదని కామెంట్ చేశారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular