Kiran Abbavaram: రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు ఆడియన్స్ కు పరిచయం అయ్యాడు కిరణ్ అబ్బవరం. తన సహజ నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం తో తనకంటూ మంచి విజయాన్ని దక్కించుకున్నాడు. తాజాగా ఇప్పుడు కిరణ్ అబ్బవరం హీరోగా మరో కొత్త సినిమా స్టార్ట్ అయ్యింది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి, ‘మత్తువదలరా’ సినిమాను నిర్మించిన క్లాప్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా బాబీ, గోపిచంద్ మలినేని వంటి దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన రమేష్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
Also Read: ‘అయ్యయ్యో.. భీమ్లా నాయకా ఎంత పని జరిగి పోయినాది ?
పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ రెండో వారం నుండి స్టార్ట్ కాబోతోంది. ఈరోజు పూజా కార్యక్రమాలను చిత్రబృందం నిర్వహించింది. ముహూర్తపు సన్నివేశానికి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ నివ్వగా… దర్శకుడు బాబీ కెమెరా స్విచ్చాన్ చేశారు. గోపిచంద్ మలినేని గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్, చిరంజీవి దర్శకుడికి స్క్రిప్ట్ను అందజేశారు. ఈ కార్యక్రమానికి రమా రాజమౌళి, శ్రీవల్లి, కాల భైరవ, శ్రీసింహా, సాయి కొర్రపాటి, గుణ్ణం గంగరాజు తదితరులు హాజరయ్యి మూవీ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక కిరణ్ సినిమాల విషయానికి వస్తే సమ్మతమే, సెబాస్టియన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈరోజు సమ్మతమే సినిమాలోని మొదటి పాట కూడా విడుదలయ్యింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read: నాగశౌర్య “లక్ష్య” సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్న విక్టరీ వెంకటేశ్…