Rishab Shetty: కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా హీరోగా దర్శకుడిగా ఎదిగిన రిషబ్ శెట్టి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే కాంతార సినిమాతో తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా ప్రస్తుతం స్టార్ హీరోలతో పాటు సరిసమానమైన క్రేజ్ ను అందుకుంటున్నాడు. నిజానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులకు చేరుకోవడంలో ఆయన చాలావరకు కృషి చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన చేసే ప్రతి సినిమా కూడా సగటు ప్రేక్షకుడిని మెప్పించేలా ఉంటుంది. మొత్తానికైతే కన్నడ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న తర్వాత ఆయన పాన్ ఇండియాలోకి అడుగుపెట్టి సూపర్ సక్సెస్ ని అందుకోవడం అనేది ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ప్రస్తుతం ఆయన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న జై హనుమాన్ సినిమాలో హనుమాన్ పాత్రను పోషించబోతున్నాడు. ఇక ఇప్పటికే ప్రశాంత్ వర్మ అతన్ని కలిసి కథ చెప్పి హనుమాన్ క్యారెక్టర్ కోసం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఆయన చేస్తున్న ప్రతి క్యారెక్టర్ లో ఒక కొత్తదనం ఉండేలా చూసుకుంటారు. ఈ సినిమాతో పాటుగా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ సినిమాలో కూడా ఒక డిఫరెంట్ పాత్రలు పోషించడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక అందులో భాగం గానే ఆయన పాత్ర చాలా కొత్తగా ఉండబోతుందట. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ తమ్ముడిగా నటించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ పాత్రలో కూడా తనదైన రీతిలో నటించి మెప్పించాలనే ప్రయత్నంలో రిషబ్ శెట్టి ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మీద గౌరవం ఉన్న రిషబ్ శెట్టి వాళ్ళ కోసమే ఈ సినిమాకి కమిట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక కాంతార సినిమాతో ఒక్కసారిగా తనకు మంచి గుర్తింపు రావడమే కాకుండా తెలుగు తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తను మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. ఇకమీదట ఆయన ప్రతి ఇండస్ట్రీలో సినిమాను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక తను అనుకున్నట్టుగానే వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక ప్రస్తుతం ఆయన కాంతార సినిమాతో చాలా బిజీగా ఉన్నప్పటికీ తన డేట్స్ ని అడ్జస్ట్ చేసుకొని మిగతా హీరోల సినిమాల్లో కూడా నటించడానికి సిద్ధమవుతుండటం విశేషం…ఇక కాంతార సినిమాని కూడా తొందర్లోనే రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది…