Puri Jagannadh-Abhishek Bachchan: పూరి అభిషేక్ బచ్చన్ మూవీ ఎందుకు ఆగిపోయింది…

పూరి జగన్నాథ్ అమితాబచ్చన్ కొడుకు అయిన అభిషేక్ బచ్చన్ తో అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమా ని రీమేక్ చేయాల్సి ఉంది.

Written By: Neelambaram, Updated On : March 4, 2024 10:43 am

Why Why Puri Abhishek Bachchan movie stopped

Follow us on

Puri Jagannadh-Abhishek Bachchan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న పూరీ జగన్నాథ్ అప్పట్లో చేసిన వరుస సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ అని అందుకున్నాయి. రవితేజ లాంటి హీరోని స్టార్ హీరోను చేయడంలో పూరి జగన్నాథ్ పాత్ర చాలా కీలకమనే చెప్పాలి. ఆయన తలుచుకుంటే ఒక హీరోని స్టార్ హీరోగా మార్చే అంత కెపాసిటీ ఉన్న డైరెక్టర్ కావడం విశేషం…

ఇక ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్(Puri Jagannadh) అమితాబచ్చన్ కొడుకు అయిన అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) తో అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమా ని రీమేక్ చేయాల్సి ఉంది. దానికి సంబంధించిన స్క్రిప్ట్ మొత్తాన్ని రెడీ చేసి పెట్టినప్పటికీ కొన్ని అనుకోని కారణాలవల్ల ఈ సినిమా ఆగిపోయింది. ఇక అప్పటికే పూరి అమితాబచ్చన్ తో ‘బుడ్డా హోగా తెర బాప్’ అనే సినిమాని తెరకెక్కించాడు. కాబట్టి అభిషేక్ బచ్చన్ తో సినిమా చేసే అవకాశం కూడా వచ్చింది. కానీ ఇందులో జరిగిన కొన్ని క్లాషేస్ వల్ల ఈ సినిమా అనేది పట్టాలెక్కలేదు. అభిషేక్ బచ్చన్ కనక ఈ సినిమా చేసి ఉంటే ఆయనకి మరింత ఇమేజ్ పెరిగి ఉండేదని చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం పూరి జగన్నాథ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ అయిన ‘డబుల్ ఇస్మార్ట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ.సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో పాన్ ఇండియా అభిమానులకు చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఆయన ‘ఇస్మార్ట్ శంకర్ ‘ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చూపించాడు.

‘లైగర్ ‘ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల పూరి జగన్నాథ్ కి ఉన్న క్రేజ్ అంతా ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. కాబట్టి డబుల్ ఇస్మార్ట్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకొని మరోసారి ‘పూరి ఇస్ బ్యాక్ ‘ అని అనిపించుకోవాలని చూస్తున్నాడు…చూడాలి మరి ఈ సినిమాతో పూరి ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది…