Jawan Movie: బ్లాక్ బస్టర్ జవాన్… మిస్ చేసుకున్న టాప్ టాలీవుడ్ స్టార్స్ ఎవరంటే?

పుష్ప అల్లు అర్జున్ కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. అలాగే జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఆయనకు కట్టబెట్టింది. అలాగే చిరంజీవితో ది ఫ్యామిలీ మాన్ సిరీస్ ని మూవీగా చేయాలనుకున్నారు రాజ్ అండ్ డీకే.

Written By: Shiva, Updated On : September 7, 2023 5:49 pm

Jawan Movie

Follow us on

Jawan Movie: ప్రతి గింజ మీద తినే వారి పేరు ఉంటుందనేది సామెత. ఒకరికి దక్కాలని రాసి ఉంటే దాన్ని మార్చలేం అని ఆ సామెత అర్థం. దర్శకులు కొన్ని స్క్రిప్ట్స్ పర్టిక్యులర్ గా కొందరు హీరోలను దృష్టిలో ఉంచుకుని రాసుకుంటారు. సన్నివేశాల్లో వారిని ఊహించుకుంటారు. దర్శకుడు అనుకున్న హీరోకి ఆ స్క్రిప్ట్ నచ్చకపోవచ్చు. నచ్చినా ఇతరత్రా కారణాలతో మూవీ చేయలేకపోవచ్చు. అప్పుడు మరొక హీరోతో దర్శకుడు ఆ చిత్రం చేస్తారు. పుష్ప స్క్రిప్ట్ ఫస్ట్ మహేష్ వద్దకు పోయింది. తన ఇమేజ్ కి అది సెట్ కాదని భావించి మహేష్ రిజెక్ట్ చేశాడు.

పుష్ప అల్లు అర్జున్ కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. అలాగే జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఆయనకు కట్టబెట్టింది. అలాగే చిరంజీవితో ది ఫ్యామిలీ మాన్ సిరీస్ ని మూవీగా చేయాలనుకున్నారు రాజ్ అండ్ డీకే. ఆయన రిజెక్ట్ చేయడంతో సిరీస్ గా మనోజ్ బాజ్ పాయ్ తో చేశారు. ది ఫ్యామిలీ మాన్ అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న సిరీస్ గా నిలిచింది. ఈ ఉదాహరణలు ఇప్పుడు ఎందుకు చెబుతున్నాం అంటే… జవాన్ మూవీ టాలీవుడ్ లో ఇద్దరు స్టార్స్ వద్దకు వచ్చింది.

దర్శకుడు అట్లీ జవాన్ కథను మహేష్, రామ్ చరణ్ కోసం రాసుకున్నారట. వారిలో ఎవరు ఒప్పుకున్నా మూవీ పట్టాలెక్కించాలని అనుకున్నారట. అయితే అట్లీ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్స్ కారణంగా కానీ, స్క్రిప్ట్ నచ్చక పోవడం వలన కానీ… మహేష్, రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్ వదులుకున్నారు. పరాజయాలతో సందిగ్ధంలో పడ్డ షారుక్ ఖాన్ అట్లీని నమ్మి జవాన్ చేశాడు.

ఆయన నమ్మకం మంచి ఫలితం ఇచ్చింది. జవాన్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్ర ఓపెనింగ్స్ పఠాన్ ని మించి ఉండే అవకాశం ఉంది. ఇక ఫైనల్ రన్ లో రికార్డు వసూళ్లు రాబట్టడం ఖాయం. కథలో కొత్తదనం లేకున్నా అట్లీ మేకింగ్, యాక్షన్ ఎపిసోడ్స్, టిస్ట్స్, గ్రాండ్ విజువల్స్ మెస్మరైజ్ చేశాయి. ఈ క్రమంలో జవాన్ ని మిస్ చేస్తున్న మహేష్, రామ్ చరణ్ మంచి సినిమా కోల్పోయారని అంటున్నారు. జవాన్ మూవీలో నయనతార హీరోయిన్ గా నటించింది. ప్రియమణి కీలక రోల్ చేయగా దీపికా పదుకొనె గెస్ట్ రోల్ లో అలరించింది. విజయ్ సేతుపతి విలన్ గా చేశారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు.