Virataparvam: ‘భీమ్లానాయక్​’ బాటలోనే ‘విరాటపర్వం’.. రిలీజ్​ అప్పుడేనా!

Virataparvam: రానా దగ్గుబాటి హీరోగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విరాట పర్వం. సురేశ్​బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. ఇందులో సాయిపల్లవి హీరోయిన్​గా నటించింది. తెలంగాణ ప్రాంతంలోని నక్సల్స్​ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా విడుదల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఏప్రిల్​లోనే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా నిలిచిపోయింది. ఆ తర్వాత ఓటీటీలో విడుదల చేయనున్నట్లు పలు వార్తలు వినిపించాయి. అయితే, చిత్రబృందం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. […]

Written By: Raghava Rao Gara, Updated On : November 17, 2021 2:01 pm
Follow us on

Virataparvam: రానా దగ్గుబాటి హీరోగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విరాట పర్వం. సురేశ్​బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. ఇందులో సాయిపల్లవి హీరోయిన్​గా నటించింది. తెలంగాణ ప్రాంతంలోని నక్సల్స్​ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా విడుదల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఏప్రిల్​లోనే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా నిలిచిపోయింది. ఆ తర్వాత ఓటీటీలో విడుదల చేయనున్నట్లు పలు వార్తలు వినిపించాయి. అయితే, చిత్రబృందం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.

కాగా, సురేశ్​ బాబు నిర్మాతగా వ్యవహరించిన నారప్ప సినిమా ఓటీటీలోనే విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు దృశ్యం2 కూడా అమెజాన్​ ప్రైమ్​ ద్వారా స్ట్రీమింగ్ కానుంది. అయితే, రానా నటించిన భీమ్లా నాయక్​ సినమా వచ్చే ఏడాది జనవరి 12న థియేటర్లలో పలకరించనుంది. ఈ క్రమంలోనే భీమ్లానాయక్​ సినిమా విడుదలైన తర్వాత.. విరాట పర్వం సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనే ఆలోచనలో సురేశ్​ బాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

భీమ్లనాయక్​ సినిమాలో పవన్​కల్యాణ్​- రానా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సాగర్​ కె చంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్​ పనుల్లో బిజీగా ఉంది. త్రివిక్రమ్​ ఈ సినిమాకు స్క్రీన్​ ప్లే, మాటలు అందిస్తున్నారు. థమన్​ స్వరాలు అందించారు. కాగా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.